breaking news
model school hostel
-
మోడల్ స్కూల్ ఎదుట ధర్నా
పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం ఉరేసుకుని మోడల్ స్కూల్ వసతి గృహంలో మృతి చెందిన మడ్డి ప్రసన్న మృతిపై మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రసన్న బంధువులు శుక్రవారం మోడల్ స్కూల్ ఎదుట ప్రసన్న మృతదేహంతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రసన్న మృతికి కారకులైన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, వారికి సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ధర్నా, రస్తారోకోలో రెండు వేల మంది పాల్గొని నినాదాలు చేశారు. మోడల్ స్కూల్ యాజమాన్యంపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయని నేటి వరకు యాజమాన్యంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. పాఠశాలలో తరగతి గదులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు నినాదాలు చేశారు. తమ విద్యార్థులకు రక్షణ కరువైందని ప్రభుత్వం మోడల్ స్కూల్ విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసన్నకు చదువు తప్ప మరో ద్యాస తెలియదని ప్రసన్న మృతికి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మరో కారణం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రసన్న మృతిపై వాస్తవాలను తెలియజేయాలన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ప్రసన్న మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
మోడల్ స్కూల్ను ప్రారంభించిన మంత్రి
నల్లగొండ : నల్లగొండ జిల్లా వేములపల్లిలో నూతనంగా నిర్మించిన ఆదర్శ పాఠశాల హాస్టల్ భవనాన్ని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి గురువారం ప్రారంభించారు. తొలిసారిగా మంత్రి జగదీష్రెడ్డి మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని పార్టీ నాయకులు మిర్యాలగూడ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, సీనియర్ నాయకులు తేరా చెన్నపురెడ్డి గ్రామ శివారులో వేచి చూస్తున్నారు. కానీ మంత్రి వాహనాన్ని అక్కడ ఆపకుండా.. నేరుగా హాస్టల్ భవనం వద్దకు చేరుకుంది. దాంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా... మంత్రికి అత్యవసర పనులు ఉండటంతోనే.. ఎక్కువ సమయం కేటాయించలేక పోయారని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలను సముదాయించినట్లు సమాచారం.