breaking news
Manik
-
మాణిక్ ఫస్ట్లుక్ ఆవిష్కరణ
తమిళసినిమా: బుల్లితెరలో పాపులర్ అయిన నటుడు మాకాపా ఆనంద్ ఇప్పుడు వెండితెరపై గుర్తుంపు తెచ్చుకుంటున్నారు. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం మాణిక్. ఎదుర్నీశ్చల్ చిత్రం ఫేమ్ సుశకుమార్ కథానాయకిగా నటించిన ఇందులో రెండవ కథానాయకిగా వత్సన్ నటించింది. హోహిత సినీ టాకీస్ పతాకంపై ఎం.సుబ్రమణియం నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా మార్టిన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పలు లఘు చిత్రాలను రూపొందించి అవార్డులను అందుకున్న ఈయన నాళైఇయక్కునార్ సీజన్ 5లో విజయం సాధించి టైటిల్ను గెలుచుకున్నారన్నది గమనార్హం. మాణిక్ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది స్నేహం, వినోదం కలిపిన జనరంజక చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన బాషా చిత్రంలోని రజనీకాంత్లో మాపాకా ఆనంద్ ఉన్న పోస్టర్లకు మంచి స్పందన వస్తోందన్నారు. మాణిక్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను శుక్రవారం నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం కార్యదర్శి ఆవిష్కరించారని తెలిపారు. దీంతో చిత్రంపై ప్రేక్షకుల్లో, పరిశ్రమ వర్గాల్లోనూ మాణిక్ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగిందని అన్నారు. త్వరలోనే చిత్ర ఆడియోను, ఈ తరువాత చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
ఆశలు.. ఆవిరి!
వారంతా 35ఏళ్లలోపు యువకులే.. బోరుబండిపై పనిచేస్తే రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చనే ఉద్దేశంతో 12మంది జీతానికి కుదిరారు.. ఈ వేసవి మూడు నెలలు కష్టపడితే చాలు తమ కష్టాలు తీరుతాయని భావించారు.. అంతలోనే వారి ఆశలు ఆవిరయ్యాయి.. రాత్రనకా పగలనకా బోర్లు వేసి అలసిపొలసి తిరుగు ప్రయాణమయ్యారు.. మార్గమధ్యంలోనే వాహనం బోల్తా పడటంతో వారి బతుకులు తెల్లారిపోయాయి.. ఈ సంఘటనలో ఇద్దరు దుర్మరణం పాలుకాగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తకోట : నల్లగొండ జిల్లా వలిగొండ మండలానికి చెందిన మాణిక్ (25), కృష్ణయ్య (26), రమణారెడ్డి (డ్రైవర్), లక్ష్మణ్, భీమయ్య, రాములు, బుగ్గయ్య, అజయ్, కృష్ణారెడ్డి, నాగూరావు, రాజు, థాలీరామ్ కొన్ని నెలలుగా బోరుబండి (రిగ్గు) పై కార్మికులుగా పనిచేస్తున్నారు. వారంరోజుల క్రితం వాహనం వెంట మహబూబ్నగర్ జిల్లాకు వచ్చారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఐజ మండలంలో వివిధ చోట్ల బోర్లు వేసి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున మార్గమధ్యంలోని కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులో కునుకు తీయడంతో డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టగా వారంతా కిందపడ్డారు. అంతలోనే డ్రిల్లింగ్ పైపులు వారిమీద పడటంతో మాణిక్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన బాటసారులు వెంటనే క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే కృష్ణయ్య చనిపోయినట్టు నిర్ధారించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్ఐ కృష్ణ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. నిత్యం 4నుంచి 7 పాయింట్లు.. ప్రస్తుతం గ్రామాల్లో నీటి కొరత ఉన్న దృష్ట్యా బోరుబండ్లకు విపరీతమైన గిరాకీ ఉందని, అందువల్లే ఈ పనికి ఒప్పుకొన్నామని కార్మికుడు భీమయ్య తెలిపారు. అందులోభాగంగా ప్రతిరోజూ నాలుగు నుంచి ఏడు పాయింట్లు ఎంపిక చేసుకుని బోర్లు వేస్తున్నామన్నారు. డ్రైవర్ కూడా తమతోపాటు పనిచేసేవాడని రోజంతా బోర్లు వేసి బాగా అలసిపోయామన్నారు. చివరిరోజు తామంతా బండిలోని రాడ్లపై నిద్రకు ఉపక్రమించామని, నలుగురు మాత్రం క్యాబిన్లో ఉన్నార ని తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుందని బోరుమన్నారు. బండిని సర్వీసింగ్ చేయించుకుని తిరిగి వస్తామని హైదరాబాద్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.