intra-day
-
సూచీలకు స్వల్ప లాభాలు.. ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ సూచీలు గురువారం (ఫిబ్రవరి 16) స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 486 పాయింట్లు పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 44 పాయింట్ల లాభంతో 61,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 136 పాయింట్ల రేంజ్ కదలాడింది. ఆఖరికి 20 పాయింట్లు బలపడి 18,135 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఉదయం ఉత్సాహంగా ట్రేడింగ్ను ప్రారంభించిన సూచీలు ఇంట్రాడేలో భారీ ఊగిసలాటకు లోనయ్యాయి. ఆఖరి గంటలో లార్జ్ క్యాప్ షేర్లలో తలెత్తిన అమ్మకాలు ఆరంభ లాభాలను హరించివేశాయి. వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ కావడంతో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత స్థాయి మార్కెట్లో ఐటీ, మెటల్, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 82.72 వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు అంతర్జాతీయంగా దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా కేంద్రం విండ్ఫాల్ పన్నును తగ్గించింది. ఈ అంశం దేశీయ అయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లకు కలసిసొచ్చింది. ఓఎన్జీసీ 5.66%, ఆయిల్ ఇండియా అయిదు శాతం చొప్పున లాభపడ్డాయి. నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ అక్మే ఫిన్ట్రేడ్ ఐపీఓకు వచ్చేందుకు సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ 1.1 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిడ్ ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ మేనేజర్గా వ్యవహరించనుంది. (ఇదీ చదవండి: వెబ్సైట్ల నిర్వహణ తప్పనిసరి.. సెబీ ఆదేశాలు) -
పాతాళానికి రూపాయి..!
• రికార్డు కనిష్టానికి పతనం.. • డాలర్తో పోలిస్తే 68.86కి క్షీణత • 70 స్థారుుకి పడిపోవచ్చని అంచనా న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తదితర పరిణామాల నేపథ్యంలో రూపారుు పతనం కొనసాగుతోంది. గురువారం ఇంట్రా డేలో డాలర్తో పోలిస్తే రూపారుు మారకం విలువ 68.86 స్థారుుకి పడిపోరుుంది. ఇప్పటిదాకా 2013 ఆగస్టు 28 ఇంట్రాడేలో నమోదైన 68.85 స్థాయే ఆల్టైమ్ కనిష్టంగా ఉంది. ఆ రోజున దేశీ కరెన్సీ 68.80 వద్ద ముగిసింది. ఇటు పెద్ద నోట్ల రద్దు, అటు సమీప భవిష్యత్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తది తర పరిణామాలు రూపారుు పతనానికి దారి తీస్తున్నాయని పరిశీలకులు పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే మరికొద్ది కాలంలో 70 స్థారుుకి కూడా పడిపోయే అవకాశముందని వ్యాఖ్యానించారు. గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 68.56తో పోలిస్తే బలహీనంగా 68.74 వద్ద ప్రారంభమైన రూపారుు ట్రేడింగ్ ఒక దశలో ఆల్టైమ్ కనిష్టం 68.86కి పడిపోరుుంది. చివరికి కొంత కోలుకుని 39 నెలల కనిష్ట క్లోజింగ్ స్థారుు 68.73 వద్ద ముగిసింది. రూపారుు పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఒక దశలో ఆర్బీఐ జోక్యం చేసుకుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నారుు. దాదాపు బిలియన్ డాలర్లను ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ విక్రరుుంచినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారుు. కరెన్సీ కదలికల్ని గమనిస్తున్నాం: ఆర్థిక శాఖ గడిచిన అరుుదు ట్రేడింగ్ రోజుల్లో రూపారుు విలువ ఏకంగా 91 పైసల మేర (సుమారు 1.34 శాతం) పతనమైన నేపథ్యంలో కరెన్సీ కదలికలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపారుు. తగు సమయంలో ఆర్బీఐ తగు నిర్ణయం తీసుకోగలదని పేర్కొన్నారుు. డాలర్తో పోలిస్తే రూపారుు విలువ 69 కన్నా దిగువనే కొనసాగినంత వరకూ ఆర్బీఐ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోబోదని వివరించారుు. ఈ నెలలో రూపారుు విలువ దాదాపు 3 శాతం మేర క్షీణించింది. 14 నెలల కాలంలో ఇది అత్యంత భారీ పతనం. మరోవైపు, రూపారుు క్షీణత మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ ఎడెల్వీజ్ ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది. వ్యవస్థలో ద్రవ్య లభ్యత కొంత మెరుగుపడితే పరిస్థితి చక్కబడగలదని తెలిపింది.