breaking news
generate
-
సోషల్మీడియా ద్వారా గృహిణుల ఆదాయం తెలిస్తే...
ముంబై: సోషల్ మీడియాలో గృహిణుల దేశంలో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ అభివృద్దిని ఎక్కువగా మహిళలే అందిపుచ్చుకున్నట్టు సర్వేలో తేలింది. ఇ-కామర్స్ బూమను అడ్వాంటేజ్గా తీసుకుంటున్నభారతీయ మహిళలు భారీగా అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతున్నారట. తాజా నివేదిక ప్రకారం 20లక్షలమంది(2 మిలియన్ల) హోం మేకర్స్ సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని లెక్కల్లో తేలింది. దీనికి స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరగడం కూడా కారణమని పేర్కొంది. వాట్సాప్, ఫేస్బుక్ ప్లాట్ ఫాం ల ద్వారా దాదాపు 2మిలియన్ మంది హోమ్మేకర్స్ 9 బిలియన్ డాలర్ల ( సుమారు 58వేల కోట్లు) మేర ఆదాయం సమకూర్చుకున్నారని కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ ఒక నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా గృహిణులు లైఫ్ స్టైల్ వస్తువులు, దుస్తులు విక్రయ, పునఃవిక్రయాలు చేస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. వివాహ తదితర వివిధ కారణాల రీత్యా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయినా కూడా తమ వ్యాపారాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని తెలిపింది. దీంతో ప్రాంతాలు మారినా ఈ కామర్స్ విధానం వల్ల అమ్మకాలపై ప్రభావం ఉండటంలేదని పేర్కొంది. దేశంలో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం భారీగా ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఫ్లిప్కార్ట్ , అమెజాన్ లాంటి ఇ-కామర్స్ మేజర్ల లావాదేవీలు భారీగా జరుగుతున్నాయని తెలిపింది. ప్రాథమిక ఇంటర్నెట్ ఉపకరణాల ద్వారా సుమారు 8-9 బిలియన్ డాలర్ల గరిష్ట అమ్మకాలతో వీటి వ్యాపారాన్ని విస్తరణకు తోడ్పడ్డాయని పేర్కొంది. అంతేకాదు 20202 నాటికి ఇది 48-60 బిలియన్ చేరుతుందని కూడా నివేదించింది. -
ఈ తెరచాప ఎత్తితే.. కరెంటు వస్తుంది!
పడవలకు తెరచాపను ఎందుకు వాడతారు? గాలివాటాన్ని ఉపయోగించుకుని పడవను సరైన దిశలో ముందుకు తీసుకుపోవడానికి. అయితే ఈ తెరచాపతో పడవను నడపడమే కాదు.. కరెంటునూ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాగంటే.. దీనిలో సోలార్ సెల్స్ కూడా ఉంటాయి మరి. అధునాతనమైన ఈ పర్యావరణ హిత నౌకను డాక్టర్ మార్గట్ క్రసోజెవిక్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. కార్బన్ ఫైబర్, కృత్రిమ ఫైబర్తో తయారు చేసిన తెరచాపలో సోలార్ సెల్స్ను పొందుపరుస్తారు. అవసరమైనప్పుడు పడవ నీటిపై కొంత ఎత్తుకు తేలేందుకు, తెరచాప దిశను, ఆకారాన్ని మార్చుకునేందుకు కూడా వీలవుతుంది. పూర్తిగా సౌరవిద్యుత్తోనే నడిచే ఈ పడవను దక్షిణాఫ్రికాలోని హోల్డెన్ మాంజ్ వైన్ ఎస్టేట్ యజమానులు డిజైన్ చేయించుకున్నారు. పడవ పందేలకు, సముద్రయానానికి దీనిని ఉపయోగిస్తారట. వచ్చే ఏప్రిల్లో నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని నిర్మాణానికి రూ. 10 కోట్ల వరకూ ఖర్చు కానుందట.