breaking news
Geetla mukundara Reddy
-
అమ్మ ఎట్లుంది?
పెద్దపల్లి: అమ్మ ఎట్లుంది.. ఆరోగ్యం బాగుందా.. నాన్న చనిపోయి నాలుగేండ్లయిందా? పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి తనయుడు రాజేందర్రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుశల ప్రశ్నలు అడిగారు. హైదరాబాద్ ప్రగతిభవన్లో గురువారం సీఎంను కలిసిన రాజేందర్రెడ్డి పరిచయం చేసుకునేలోపే అమ్మ బాగుందా అని అడగడంతో అమ్మ కూడా చనిపోయిందని సమాధానమిచ్చారు. దీంతో కాసేపు విచారం వ్యక్తం చేసి దగ్గరకు తీసుకున్నారు. అనంతరం రాజేందర్రెడ్డి పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము మనో హర్రెడ్డి గెలుపు కోసమే పనిచేశామని, తిరిగి అప్పటి నుంచి టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇకముందు కూడా టీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ విజయానికి సహకరిస్తామని సీఎంకు వివరించారు. స్పందించిన సీఎం తన ఆశీస్సులు ఉంటాయని రాజేందర్రెడ్డి నుంచి ఫోన్ నంబరు తీసుకోవాలని ఓఎస్డీని ఆదేశించారు. ఆయన వెంట కాశెట్టి కుమార్ ఉన్నారు. -
స్వచ్ఛ భారత్ లక్ష్యం ఇదేనా..?
► ఏళ్లతరబడిగా మూతపడిన సులభ్కాంప్లెక్స్ ► బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన పెద్దపల్లి(సుల్తానాబాద్ రూరల్): ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా, సుల్తానాబాద్లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొని ఉంది. స్థానిక మినీ కలెక్టరేట్ ఏర్పడిన సమయంలో సందర్శకులు, ప్రజల కోసం సులభ్కాంప్లెక్స్ను నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే గీట్ల ముకుందరరెడ్డి దూరదృష్టితో మినీ కలెక్టరేట్తో పాటు సులభ్కాంప్లెక్స్ను నిర్మించి 2008జూలై 14న ప్రారంభించారు. ప్రభుత్వ వాటాగా రూ.2.50లక్షలు, నిర్వహకులు రూ.2.50లక్షలతో దీనిని నిర్మించారు. అయితే సులభ్కాంప్లెక్స్ నిర్వహకులకు ప్రభుత్వ వాటా చెల్లింపు కాకపోవడం, అప్పట్లో ఆదరణ లేకపోవడంతో దీనిని మూసివేశారు. దాదాపు ఆరేళ్లుగా తెరువడం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దీని అవసరం ఎంతో ఏర్పడింది. అనేక గ్రామాలకు, మండలాలకు కూడలి అయిన సుల్తానాబాద్లో ప్రజలకు తగినన్ని మూత్రశాలలు లేకుండా పోయాయి. కూరగాయల మార్కెట్ వద్ద ఒకటి మాత్రమే పనిచేస్తోంది. కాల్వశ్రీరాంపూర్ చౌరస్తాలో ఉన్న ఐబీ, ఇరిగేషన్, పాత సివిల్ ఆసుపత్రి, పాత మటన్ మార్కెట్, బస్టాండ్ స్థలాల్లో, బంజరుదొడ్డి, రోడ్డు ప్రక్కన డ్రెయినేజీల్లో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారు.