breaking news
Gaddam Srinivas Yadav
-
హైదరాబాద్ ఎంపీ సీటు ఆయనకే.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. దీంతో, తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే.. 1. హైదరాబాద్: గడ్డం శ్రీనివాస్ యాదవ్ 2.నాగర్కర్నూల్: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, 3. మెదక్: వెంకట్రామిరెడ్డి, 4. మహబూబ్నగర్ : మన్నె శ్రీనివాస్ రెడ్డి, 5. కరీంనగర్: వినోద్ కుమార్, 6.పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్, 7. జహీరాబాద్: గాలి అనిల్ కుమార్, 8. ఖమ్మం: నామా నాగేశ్వర్ రావు, 9. చేవెళ్ల : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, 10.మహబూబాబాద్ : మాలోత్ కవిత, 11. మల్కాజ్గిరి : రాగిడి లక్ష్మారెడ్డి, 12. ఆదిలాబాద్: ఆత్రం సక్కు, 13. నిజామాబాద్ : బాజిరెడ్డి గోవర్ధన్, 14. వరంగల్ : కడియం కావ్య 15. సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్ 16. భువనగిరి - క్యామ మల్లేశ్ 17 నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి -
జెండా మోసేవాడే జెండా ఎగురవేయాలి
– బీసీ సంఘం జిల్లా నేత గడ్డం శ్రీనివాస్యాదవ్ ఆత్మకూర్ : జనాభాలో 80శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలని జెండా మోసే వాడే జెండా ఎగురవేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్యాదవ్, యుగేందర్యాదవ్ అన్నారు. ఆదివారం ఆత్మకూర్లోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, 500ల బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో వ్యవసాయ రైతులకు రుణమాఫీ వర్తింపజేసి కొత్త రుణాలు ఇవ్వాలని అన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేయాలని, 50ఏళ్లు పైబడిన బీసీలకు ఆసరా పింఛన్లు వర్తింపజేయాలన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు శ్రీను, సత్యనారాయణ, కురుమన్న, శోభన్, కొండన్న, రాజేష్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.