breaking news
eye ability
-
Amblyopia: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!
కొన్ని సందర్భాల్లో రెండు కళ్లలో... ఏదో ఓ కన్ను పనిచేయడానికి కాస్త బద్ధకిస్తుంటుంది. ఈ సమస్య అందరిలోనూ వచ్చే అవకాశమున్నా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువ. అయితే... తమకు ఉన్న రెండు కళ్లలో ఒకటి... తన పక్కదానంత బాగా పనిచేయడం లేదన్న విషయం వారికి తెలిసే అవకాశం సాధారణంగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టంగా కనిపించే కంటి నుంచే ప్రతిబింబాలను గ్రహించి, అస్పష్టంగా కనిపించే ప్రతిబింబాలను మెదడు నిరాకరిస్తుంది. అంటే ఈ రెండు కళ్లలో ఒకటి ప్రతిబింబాన్ని ప్రసారం చేయడంలో కాస్త బద్ధకంగా పనిచేస్తుందన్నమాట. ఇలా బద్ధకంగా పనిచేసే కన్ను పనితీరు క్రమంగా తగ్గి΄ోతూ... ఒక దశలో పూర్తిగా పనిచేయకుండా ΄ోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యనే వాడుక భాషలో ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. సాధారణంగా ఆంబ్లోపియా సమస్య ఉన్నప్పుడు... కొద్దిగానైనా చూపు ఉన్నంత కాలం... తమ కళ్లలో ఒకదానికి సమస్య ఉందన్న విషయమే బాధితులకు తెలిసే అవకాశం పెద్దగా ఉండదు. ఈలోపే జరగాల్సిన అనర్థాలు జరిగే అవకాశముంది. అందుకే ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా)పై అవగాహన అవసరం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. ఓ కేస్ స్టడీశిరీష (పేరు మార్చాం) అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారి రెండు కళ్లలో ఒక కన్నులోంచే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండో కన్ను మంచి ప్రతిబింబాన్ని పంపడంలో కాస్త బద్ధకిస్తోంది. ఇలా కంటిన్యువస్గా జరిగే సమయంలో ఎదుటి దృశ్యాన్ని స్పష్టంగా పంపే కంటి తాలూకు ప్రతిబింబాన్నే మెదడు తీసుకుంటోంది. సరిగ్గా కనిపించని కంటి నుంచి వచ్చే ఆ సమాచారాన్ని తీసుకోవడాన్ని నిరాకరిస్తూ పోవడంతో కొంతకాలానికి ఆ కంటికి క్రమంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈలోపు ఏదో ఇతర పరీక్ష కోసం వెళ్లిన సమయంలో డాక్టర్లకు ఒక కన్ను బద్ధకిస్తోన్న విషయం తెలిసివచ్చింది. దాంతో డాక్టర్లు అతి కష్టమ్మీద ఆ రెండో కంటి చూపునూ కాపాడగలిగారు. అసలు ‘లేజీ ఐ’ పై అవగాహన రావాలంటే ముందుగా... చూడడమనే ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియడం చాలా ప్రధానం. మనం ఏదైనా దృశ్యాన్ని లేదా వస్తువును చూడాలంటే... తొలుత ఆ వస్తువుపై కాంతి పడి, మళ్లీ అదే కాంతి మన కంటిని చేరాలి. అప్పుడది తొలుత నల్లగుడ్డు అయిన కార్నియా నుంచి, తర్వాత పారదర్శకమైన మన లెన్స్ నుంచీ ప్రసరించి... రెటీనా అనే తెరపై ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని తలకిందులుగా పడేలా చేస్తుంది. ‘ఆప్టిక్ నర్వ్’ అనే కీలకమైన నాడి ద్వారా రెటీనాపైనున్న ప్రతిబింబం సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. దాంతో ఆ వస్తువు కనిపించడం వల్ల మనకు దృష్టిజ్ఞానం కలుగుతుంది. ఏమిటీ ‘లేజీ ఐ’?మనకు కలిగే దృష్టి జ్ఞానాన్ని ‘బైనాక్యులర్ విజన్’ అంటారు. అంటే... మన రెండు కళ్లలోని దృశ్యాలూ తమ తమ రెటీనాలపై కలిసి (ఇంటిగ్రేట్ అయి) ఆ రెండూ ఒకే దృశ్యంగా / వస్తువుగా కనిపిస్తాయి. అంటే ‘బై’ అంటే రెండు... ‘ఆక్యులార్’ అంటే ‘కళ్లు’... ఈ రెండు కళ్లూ కలిసి ఒకే దృశ్యాన్ని చూపడమే ‘బైనాక్యులార్ విజన్’! ఏదైనా కారణాలతో ఒకవేళ ఒకరి రెండు కళ్లలో... ఒకదానికి ఏదైనా కొంత లోపం ఉంటే... అలాంటప్పుడు ఒక కంటిలోని ప్రతిబింబం చాలా స్పష్టంగానూ, లోపమున్న కంటిలోని ప్రతిబింబం కొంత అస్పష్టంగా... ఇలా తన రెండు రెటీనాలపై ప్రతిబింబాలను చూపుతుంది. అయితే రెండు కళ్లతో చూసేప్పుడు బైనాక్యులర్ విజన్ కారణంగా ఆ లోపం తెలియక΄ోవచ్చు. ఒక్కో కంటితో విడివిడిగా, పరీక్షగా చూసినప్పుడు మాత్రమే అది తెలిసిరావచ్చు.ఇలాంటి సందర్భాల్లో స్పష్టమైన ప్రతిబింబాన్నే మెదడు స్వీకరిస్తుంది. అస్పష్టమైన దాన్ని క్రమంగా నిరాకరిస్తూపోతుంది. ఇలా అస్పష్టమైన ప్రతిబింబాన్ని నిరాకరించడాన్ని ‘సప్రెషన్’ అంటారు. ఒక కంట్లో ప్రతిబింబం అస్పష్టంగా ఏర్పడుతున్నప్పుడూ, ఆ సమాచారాన్ని మెదడు క్రమంగా నిరాకరిస్తూపోతూ ఉండే మెడికల్ కండిషన్ను ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. లేజీ ఐ / ఆంబ్లోపియా సమస్య ఉన్నవారిలో తొలుత ఎలాంటి లోపమూ కనిపించదు. చిన్నపిల్లల్లోనైతే వాళ్ల కన్ను అభివృద్ధి / వికాసం కూడా మామూలుగానే జరుగుతాయి. వైద్యపరీక్షల్లోనూ కంటి గురించి ఎలాంటి లోపమూ తెలియదు. కాని కొన్నిసార్లు ఏదో ఒక కంట్లోగానీ లేదా ఒక్కోసారి రెండు కళ్లల్లోనూ చూపు మందగిస్తుంది. ‘లేజీ ఐ’ కండిషన్ వయసుతో పాటు పెరుగుతూ పోతుంది. పైకి అంతా బాగానే ఉండటంతో ఈ కండిషన్ను తొలిదశల్లో గుర్తుపట్టడమూ కష్టమే.ఆంబ్లోపియా విస్తృతి : మన దేశంలోని చిన్నారుల్లో దీని విస్తృతి దాదాపు రెండు శాతం. అంటే ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరిలో ఈ లోపం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి ఇంకా ఎక్కువ. అంటే దాదాపు 4 శాతం. ఆంబ్లోపియా రకాలు అన్ ఐసోమెట్రోపిక్ ఆంబ్లోపియా : ఒక కంట్లో ఉన్న దృష్టిలో΄ానికీ (రిఫ్రాక్టివ్ ఎర్రర్కూ), మరో కంటికీ తేడా ఉండటం. ఈ సమస్య ఉన్న వాళ్లలో చాలా ఎక్కువమందిలో ఈ సమస్యే ఉంటుంది. ఐసోమెట్రిక్ ఆంబ్లోపియా : రెండు కళ్లలోనూ ఎక్కువ దృష్టిలోపం (రిఫ్రాక్టివ్ ఎర్రర్) ఉండటం. (ఉదా + 6.0 ; +6.0) మెరిడోనల్ ఆంబ్లోపియా: కళ్లలో సిలెండ్రికల్ పవర్ ‘2.0’ కంటే ఎక్కువ ఉండటం. స్టెడిస్మస్ ఆంబ్లోపియా : మెల్లకన్ను కారణంగా వచ్చే ఆంబ్లోపియా ఇది. డిప్రొవేషనల్ ఆంబ్లోపియా : పుట్టుకతోనే కంట్లో శుక్లం ఉండటం, కార్నియా సమస్య, రెటీనా సమస్య, కనురెప్ప వాలిపోవడం వంటి సమస్యలున్నప్పుడు, కాంతి కిరణాలు రెటీనాకు సరిగా చేరకపోవడం ఈ తరహా ఆంబ్లోపియా వస్తుంది.ఎంత త్వరగా చికిత్స జరిగితే... అంత మేలైన ఫలితాలుఆంబ్లోపియాను ఎంత త్వరగా గుర్తించి, ఎంత చిన్న వయసులో చికిత్స చేయిస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆ పసివయసులో తమ చూపులో లోపం ఉందన్న విషయాన్ని పిల్లలు గ్రహించలేకపోవడం, అలాగే చిన్నారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఒకపట్టాన గుర్తించలేరు. అయితే చిన్నతనంలోనే అంటే... రెండు నుంచి ఎనిమిది ఏళ్లలోపు గుర్తించి, చికిత్స చేయిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అంతమాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. పన్నెండేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు చికిత్స చేయించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఫలితాలు చిన్నప్పటితో పోలిస్తే కాస్త నిదానంగా కనిపిస్తాయి. పెద్దవాళ్లలో కూడా ‘విజన్ థెరపీ’ ద్వారా కొంతవరకు ఫలితాలను రాబట్టవచ్చు. ఏ కారణంతో ఆంబ్లోపియా వచ్చిందో దానికి చికిత్స చేయడం : అంటే ఉదాహరణకు దృష్టిలోపాల వల్ల సమస్య వచ్చినట్లయితే దానికి సరిపడిన అద్దాలను ఇవ్వడం. ఉదాహరణకు ప్లస్ పవర్, మైనస్ పవర్, సిలెండ్రికల్ పవర్. మెల్లకన్ను కారణంగా ఆంబ్లోపియా వస్తే మెల్లకన్ను కరెక్షన్ చికిత్సతో దాన్ని సరిచేయడం. డిప్రెవేషన్ ఆంబ్లోపియా జబ్బులకు... అంటే శుక్లం, కార్నియా, రెటీనా, వాలిపోయే కనురెప్పలు వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడం ద్వారా లోపాల్ని తొలగించవచ్చు. ఉదాహరణకు... పుట్టుకతోనే శుక్లం (కాటకార్ట్) కారణంగా ఆంబ్లోపియా వస్తే... శస్త్రచికిత్స ద్వారా తొలుత పారదర్శకత కోల్పోయిన శుక్లాన్ని తొలగించాలి. ఆ స్థానంలో ఇంట్రా ఆక్యులార్ లెన్స్ను అమర్చాలి. శుక్లం కేవలం ఒకే కంట్లోనే ఉంటే– బిడ్డ పుట్టిన వెంటనే ఈ ఆపరేషన్ చేయవచ్చు. ఒకవేళ శుక్లాలు రెండు కళ్లలోనూ ఉంటే ఆపరేషన్కు కొన్ని మాసాల వ్యవధి తీసుకోవచ్చు. కాని శస్త్రచికిత్స మాత్రం తప్పనిసరిగా చేయించాలి. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే చూపు వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఆపరేషన్ తర్వాత కూడా పిల్లలకు డాక్టర్లు సూచించిన ప్రకారం... క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఇలా ఆ చిన్నారికి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లల్లో మెల్లకన్ను ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. మూడేళ్లలోపు పిల్లలకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. కొందరిలో పుట్టగానే మెల్లకన్ను ఉండవచ్చు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డకు మెల్లకన్ను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తారు. పిల్లలు ఎదిగిన తర్వాత పరీక్షలు చేయించవచ్చని మరికొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతుంటారు. ఈ రెండూ సరికాదు. పిల్లల్లో మెల్లకన్నును గమనించగానే వెంటనే పిల్లలను డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. మెల్లకంటి సమస్యకూ ఎంతత్వరగా చికిత్స చేయిస్తే... అంత మంచిది. కంటి రెప్ప వాలిపోవడం వల్ల ఆంబ్లోపియా వస్తే... ఆ రెప్ప పైకెత్తి నిలిపి ఉంచేలా ఓ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీన్నే ‘టోసిస్ కరెక్షన్’ సర్జరీ అంటారు. ఈ ఆపరేషన్ తర్వాత కూడా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండటం అవసరం. కొందరిలో కంటికి అద్దాలు అవసరమవుతాయి. ఇలాంటివారు అద్దాలు వాడుతూనే ఆంబ్లోపియాకూ చికిత్స చేయించాలి.అంబ్లోపియాకు కారణాలు(ఆంబ్లోజెనెసిస్)విజువల్ డిప్రవేషన్ : చూపు విషయంలో ఒక కంటిలో ఉన్నంత స్పష్టత మరోదానిలో లేకపోవడం. లైట్ డిప్రవేషన్ : కంటిలోని కొన్ని దోషాల కారణంగా (కాటరాక్ట్ వంటి వాటివల్ల) రెటీనాకు తగినంత కాంతి చేరకపోవడం. అబ్–నార్మల్ బైనాక్యులార్ విజన్ : అంటే రెండు కళ్లూ సమంగా ఒకే వస్తువుపై కేంద్రీకరించలేకపోవడం... ఈ అంశాలు ఉన్నవారిలో ఆంబ్లోపియా క్రమంగా వృద్ధిచెందుతుంది.అక్లూజన్ థెరపీఈ చికిత్స ప్రక్రియలో నార్మల్గా ఉన్న కంటిని పూర్తిగా మూసివేసి, చూపు మందగించిన కంటి తాలూకు దృష్టి మెరుగుపడేలా స్టిమ్యులేట్ చేస్తారు. నార్మల్గా ఉన్న కంటిని ఎన్నాళ్లు మూసి ఉంచి... ఈ స్టిమ్యూలేషన్ చికిత్స చేయాల్సి ఉంటుందన్నది డాక్టర్ నిర్ధారణ చేస్తారు. ఈ చికిత్స వల్ల 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.పీనలైజేషన్అట్రోపిన్ చుక్కల మందులు లేదా బలమైన లెన్స్లను బాగా కనిపించే కంటికి వాడతారు. అప్పుడు బలహీనంగా ఉన్న కన్ను స్టిమ్యులేట్ అవుతుంది. దాంతో అది చూడటానికి ప్రయత్నించడాన్ని మొదలు పెడుతుంది. కన్నును మూసివేసి ఉంచి చేసే చికిత్స అయిన ‘అక్లూజన్ థెరపీ’లోలా కాకుండా, కన్ను తెరచే ఉంచి చేసే చికిత్స ఇది.విజన్ థెరపీపైన పేర్కొన్న అక్లూజన్ పద్ధతిలో చికిత్స చేస్తూ... కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా బలహీనమైన కంటిని చురుగ్గా మారేలా చేస్తారు. దీని వల్ల మెదడు కూడా తిరిగి ప్రతిబింబాన్ని గ్రహించేలా, పక్క కన్ను ప్రతిబింబంతో పోల్చుకుని... మళ్లీ చూపు, బైనాక్యులర్ విజన్ పొందేలా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రక్రియకు దాదాపుగా 100 నుంచి 200 గంటల పాటు చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు / నిర్ధారణనిజానికి చాలా మంది తమకు లోపం ఉన్నట్లు గుర్తించలేరు / చెప్పలేరు. ∙ఒక కంటిలో చూపు తగ్గడంక్రౌడింగ్ ఫినామినా: అంటే... అనేక అక్షరాలు ఉన్నప్పుడు ఏదో ఒక అక్షరాన్ని మాత్రమే చూడగలగటం. ఒక్క అక్షరాన్ని మాత్రమే చదవడగలగడం. న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ : దీనితో పరీక్షించినప్పుడు మామూలు కంటి చూపు ఉన్నవారికిస్పష్టంగా కనిపించదు. కానీ ‘ఆంబ్లోపియా’ ఉన్నవారు దీనిలోంచి చూసినప్పుడు... వారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందిలో మెల్లకన్ను ఉండటం, అలాగే రంగులు చూసే సామర్థ్యం తక్కువగా ఉండటం. కంటి డాక్టర్లు పైన పేర్కొన్న లక్షణాలను బట్టి ‘ఆంబ్లోపియా’ను నిర్ధారణ చేస్తారు. నివారణమూడు నుంచి ఐదేళ్ల వయసులోని పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. లోపాలుండి శస్త్రచికిత్స అవసరమైన వారికి వీలైనంత త్వరగా చేయించాలి. ఆక్లూజన్ థెరపీ ద్వారా చూపు తిరిగి వచ్చాక కూడా ‘మెయింటెనెన్స్ థెరపీ’ అంటూ రోజూ రెండు గంటల పాటు అక్లూజన్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ∙తరచూ కంటి డాక్టర్ను సంప్రదిస్తూ ఉండాలి.ఫ్యూజనల్, స్టీరియాప్టిక్ ఎక్సర్సైజెస్లేజీ ఐ తన చురుకుదనాన్ని పొందేలా చేసిన చికిత్స ప్రక్రియల తర్వాత ఆ రెండు కళ్లూ ఒకేలాంటి మంచి ప్రతిబింబాన్నే మెదడుకు ఇచ్చేలా చేసేందుకు కొన్ని వ్యాయాయాలు చేయిస్తారు. ఇందులో ఫ్యూజనల్ ఎక్సర్సైజ్లో రెండు కళ్లూ తాము ప్రతిబింబించే దృశ్యాన్ని మెదడు ఒకేలా గ్రహించేలా చేస్తారు. ఇక స్టీరియాప్టిక్ ఎక్సర్సైజ్లో ఈ రెండు కళ్లూ డెప్త్ / 3 డీ ఇమేజ్ సాధించేలా చేయడానికి చేయిస్తారు. ఈ రెండు ఎక్సర్సైజ్లు చేయిస్తేనే భవిష్యత్తులో లేజీ ఐ లో చూపు తగ్గకుండా ఉంటుంది. లేదంటే మళ్లీ వెనక్కువెళ్లే అవకాశాలు ఉంటాయి.ఫార్మకోథెరపీలీవోడోపావంటి మందుల ద్వారా కంటి నరాలు బాగా పనిచేసేలా చేస్తారు. భవిష్యత్తు చికిత్స ప్రక్రియల్లో జీన్ థెరపీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త చికిత్స ప్రక్రియలు అందివచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల అడల్ట్ ఆంబ్లోపియాకు కూడా మరిన్ని అధునాతన చికిత్సలను అందుబాటు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: 'మార్నింగ్ వాకింగ్' ఎందుకంటే..! థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ) -
Health: చీకటి పొర చీల్చండి..
మధ్య వయసు దాటాక చాలామందిలో కంటికి వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది క్యాటరాక్ట్. ఈ సమస్యనే వాడుకభాషలో కంటిలో వచ్చే తెల్లముత్యం అనీ, పువ్వు రావడం, పొర రావడం అని అంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మందిలో క్యాటరాక్ట్ వల్ల అంధత్వం వస్తోంది. ఇప్పటికీ మారుమూల గ్రామీణ ్రపాంతాల్లో మధ్యవయసులోనే అంధత్వానికి దారితీసే కారణాల్లో ఇదీ ఒకటి. దీనికి కారణాలూ, చికిత్స ఏమిటో తెలుసుకుందాం.సాధారణంగా వృద్ధాప్య దశలోనే వచ్చే ఈ క్యాటరాక్ట్...ఇటీవల చాలామందిలో చాలా చిన్నవయసులోనే వస్తోంది. అంధత్వానికి దారితీసే అంశాల్లో క్యాటరాక్ట్ కూడా ఒకటి అని తెలిసినప్పటికీ, సాధారణ శస్త్రచికిత్సతో దీన్ని సరిదిద్దడం సాధ్యమైనప్పటికీ మారుమూల పల్లెవాసుల్లో దీనిపై అంతగా అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ దీని వల్ల అంధులయ్యేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సర్జరీ ద్వారా ఈ పరిస్థితిని పూర్తిగా సరిదిద్ది, దీని ద్వారా వచ్చే అంధత్వాన్ని నివారించడం నూటికి నూరు పాళ్లు సాధ్యమే. అదెలాగో చూద్దాం.క్యాటరాక్ట్ అంటే ఏమిటి, అందుకు కారణాలు...కంట్లో ఉండే పారదర్శకమైన లెన్స్ పారదర్శకంగా ఉన్నంతసేపే కాంతి నిరాటంకంగా లోపలికి ప్రవేశించి రెటీనా తెరను చేరుకుంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల లెన్స్ తన పారదర్శకత కోల్పోయే ప్రమాదముంది. అవి... పెరిగే వయసు, లేదా ఏదైనా ప్రమాదాలు వంటి కారణాలతో ఈ లెన్స్ క్రమంగా మసక మసకబారిపోతూ తన పారదర్శకతను కోల్పోతుంది. దాంతో లెన్స్ గుండా కాంతి సాఫీగా ప్రయణించడం సాధ్యం కాదు. ఫలితంగా క్రమంగా చూపు మసకబారుతుంది. ఈ కండిషన్నే క్యాటరాక్ట్ అంటారు.చికిత్స...క్యాటరాక్ట్ ఉన్నవారికి కంట్లో పారదర్శకత కోల్పోయిన లెన్స్ను తొలగించి, దాని స్థానంలో కృత్రిమ (ఆర్టిఫిషియల్) లెన్స్ (ఐఓఎల్ / ఇంట్రా ఆక్యులార్ లెన్స్)ను అమర్చడం ద్వారా చికిత్స చేసేవారు. అయితే గతంలో ఈ లెన్స్ను తొలగించేందుకు దాదాపు 13–14 ఎం.ఎం. మేరకు కోత పెట్టేవారు. తర్వాత ఈ గాయానికి కుట్లు వేసేవారు. కాల క్రమంలో శస్త్రచికిత్సల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అక్రిలిక్ టెక్నాలజీలో వచ్చిన మార్పులతో కృత్రిమ లెన్స్ను రూపొందించారు. పాత స్వాభావిక (నేచురల్) లెన్స్ స్థానంలో దీన్ని అమర్చుతారు. దీంతో ఆపరేషన్ తర్వాత కనుచూపు పూర్తిగా మెరుగవుతుంది.ఫ్యాకో ఎమల్సిఫికేషన్... (పీఈ):కాటరాక్ట్ చికిత్సలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్ అనేది ఒక ఆధునిక ప్రక్రియ. ఇందులో అల్ట్రా సౌండ్ ఎనర్జీ సహాయంతో లెన్స్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి, చిన్న రంధ్రం ద్వారా క్యాటరాక్టస్ లెన్స్ (క్యాటరాక్ట్కు గురైన లెన్స్)ను తొలగిస్తారు. అదే చిన్న రంధ్రం ద్వారా ఫోల్డబుల్ అక్రిలిక్ ఇంట్రాక్యులార్ లెన్స్ను కంటిలోపల అమర్చుతారు. దీనికి కేవలం 2 – 3 ఎం.ఎం. గాటు సరిపోతుంది. కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. గాటు చిన్నది కావడం వల్ల గాయం మానేందుకు పట్టే సమయం కూడా తక్కువ. ఈ ప్రక్రియలో రిస్క్ కూడా చాలా తక్కువ. దీనిలో కన్ను ఎర్రబారడం, కళ్ల మంట చాలా తక్కువ. ఫలితంగా బాధితులు చాలా త్వరగా తమ వృత్తి, ఉద్యోగాలకు వెళ్లవచ్చు.ఫెమ్టో లేజర్ చికిత్స:త్యాధునికమైన ఫెమ్టో లేజర్ సాంకేతికత ఇప్పుడు క్యాటరాక్ట్కు మరో చికిత్స. ఇందులో కాటరాక్టస్ లెన్స్ తాలూకు పరిమాణం, మందం వంటి అంశాలను ఓసీటీ టెస్ట్ ద్వారా కొలిచి లేజర్ చికిత్స ద్వారా అవసరమైనంత పరిమాణంలో ముక్కలు చేసి ఆ మేరకే లెన్స్ను తొలగిస్తారు. కచ్చితత్వం, భద్రత... ఈ రెండూ ఈ ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తాయి.లెన్స్లలో మరెన్నో రకాలు...లెన్స్లలో మోనోఫోకల్, బైఫోకల్, ట్రైఫోకల్, టోరిక్ అనేవి కూడా కొత్తగా వచ్చాయి. ఇవి పేషెంట్ అవసరాలను బట్టి అమర్చుతారు.మత్తు అవసరం లేదు.. నొప్పీ ఉండదు..ఫ్యాకో చికిత్సలోనూ, లేజర్ చికిత్సలోనూ గతంలోలా పూర్తిగా మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కేవలం లోకల్ అనస్థీషియాగా చుక్కల మందు వేసి వెంటనే చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాదు... గత ప్రక్రియలతో పోలిస్తే నొప్పి కూడా తక్కువే.కొనసాగుతున్న పరిశోధనలు...ఫ్యాకో ఎమల్సిఫికేషన్, ఫెమ్టో లేజర్ దగ్గరే పురోగతి ఆగిపోలేదు. మరింత నాణ్యమైన, సమర్థమైన కృత్రిమ లెన్స్ల కోసం కృషి కొనసాగుతూనే ఉంది. ఇందులో ఇంట్రా ఆక్యులార్ లెన్స్ మరింత ఆధునికమైనవి.ఇవి చదవండి: డ్రాగన్ పౌడర్ టెక్నాలజీ రెడీ! -
అసలే వేసవి, ఆపై కంప్యూటర్ కాలం.. కళ్లు ‘కళ’ తప్పితే.. చిన్న వయసులోనే!
సాక్షి, పార్వతీపురం: కళ్లు నిత్యం తడిగా ఉంటాయి.. కంటినిండా నీరు ఉంటుంది.. ఒక విధంగా చెప్పాలంటే నేత్రాలు నిండు జలాశయాలు వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యం కారణంగా కంటిలో తడి ఆరిపోతోంది. నేత్ర వ్యాధులు అధికమవుతున్నాయి. చివరకు చూపు మసకబారుతోంది. అన్ని ఇంద్రియాల్లో కంటే కన్ను చాలా విలువైనది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు కలకాలం చల్లాగా ఉండాలి. చూపు శాశ్వతమవ్వాలి. కానీ మనిషి దుష్ప్రవర్తన కారణంగా కంటి సమస్యలు ఏర్పడి పిన్న వయస్సులోనే అంధత్వం ఏర్పడుతోంది. మనిషి నిమిషానికి ఎనిమిది సార్లు కంటి రెప్పలు ఆర్పుతుంటాడు. అలా చేయడం ద్వారా కార్నియాకు అవసరమైన నీరు చేరి కళ్లు ఎండిపోకుండా చేస్తాయి. వేసవి ప్రయాణాల్లో వేడి గాలులకు కళ్లు తడి ఆరిపోయి దురదలు ప్రారంభమవుతున్నాయి. వేసవి ప్రయాణాల్లో కంటి రెప్పలు నిమిషానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే కొట్టుకుంటున్నాయని వైద్యులు ఒక సర్వేలో పేర్కొన్నారు. ఫలితంగా కంటి సమస్యలు వచ్చి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తలనొప్పి వంటివి కూడా వస్తున్నాయని వెల్లడించారు. చదవండి👉🏼 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! అధిక వినియోగం ముప్పు.. ప్రస్తుతం సాంకేతికత రాజ్యమేలుతోంది. అన్ని చోట్లా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ప్రతి పది మందిలో తొమ్మిది మందికి పైగా ప్రజలు మొబైల్ వినియోగిస్తున్నారు. నిత్యం కంప్యూటర్తో వర్క్ చేయడం, మొబైల్ ఆపరేటింగ్లో తలమునకలవ్వడం కారణంగా కళ్లు పొడిబారి పోతున్నాయి. ప్రస్తుతం ప్రతి 100 మందిలో 60 నుంచి 70 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 99 శాతం మంది కార్నియ సమస్యలకు గురవుతున్నారు. వేడిగాలుల బారిన పడడం, ఆండ్రాయిడ్, కంప్యూటర్ వినియోగించడం, రాత్రి 12 గంటల వరకు సెల్ఫోన్తో గడపడం కారణంగా ఈ సమస్య వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. 15 నుంచి 40 ఏళ్ల మద్య ఉన్నవారే అధికంగా ఈ సమస్యకు గురవుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. చదవండి👉🏻 నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి! సాధారణ కన్ను పొడిబారిన కన్ను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► వేసవిలో ప్రయాణించే వారు తప్పనిసరిగా కళ్లజోడు ధరించాలి. ► ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగం తగ్గించుకోవాలి. ► కంప్యూటర్ల వద్ద గంటలకొద్దీ గడపరాదు. ► కంటి రెప్పలు ఎక్కువసార్లు కొట్టుకొనే విధంగా ప్రయత్నించాలి. ► తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ► కంటికి దురదలు వచ్చే సమయంలో చేతితో నలపరాదు ► కళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చదవండి👉🏾 చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స అవగాహన తప్పనిసరి రోజురోజుకూ కంటి సమస్యలు అధిగమవుతున్నాయి. 70 శాతం మంది కంటి రోగాలతో బాధపడుతున్నారు. ఇవి చిన్నవైనప్పటికీ జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో బయట ప్రయాణాలు వద్డు. ఆండ్రాయిడ్ మొబైల్ను చిన్నారులకు ఇవ్వరాదు. టీవీ, సెల్ఫోన్, కంప్యూటర్ వాడే సమయంలో అరగంట కొకసారి ప్రతి పది నిమిషాలకు ఒకసారి విరామం ఇవ్వాలి. ఏవైనా కంటి సమస్యలు వస్తే నేరుగా వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ జీరు నగేష్రెడ్డి, వైఎస్సార్ కంటి వెలుగు జిల్లా ఇన్చార్జ్, పార్వతీపురం మన్యం -
కళ్లల్లో కల్లోలం
నేత్రాలు నిండు జలాశయాల వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యంతో కళ్లల్లో నీరు ఆవిరవుతోంది. కళ్ల సహజత్వాన్ని మెల్లగా కోల్పోయేలా చేసే టీవీ.. కంప్యూటర్ల జాబితాలోకి స్మార్ట్ఫోన్లు వచ్చి చేరాయి. అధిక గంటలు స్మార్ట్ఫోన్, కంప్యూటర్తో గడిపేస్తుండటంతో కళ్లల్లో కల్లోలం అలముకుని ఎడారిలా మారిపోతున్నాయి. చివరకు చూపుపై ప్రభావం పడుతోంది. ఇందులో భాగంగా కళ్లు పొడిబారడం అనే సమస్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. సాక్షి, నెహ్రూనగర్ (గుంటూరు): ఆధునిక టెక్నాలజీతో అందరికీ అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ఫోన్లు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరానికి మించి వినియోగిస్తుండడంతో మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు యువతీ, యువకులతో పాటు పెద్దవారిలోనూ ఇదే సమస్య మొదలైంది. ఒకప్పుడు కంప్యూటర్తో గంటల తరబడి గడిపేవారు. అవసరం లేకపోయినా ఇంటర్నెట్ చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ కాలం వెల్లబుచ్చేవారు. ఇప్పుడు కంప్యూటర్లతో పాటు స్మార్ట్ఫోన్లు జతకలిశాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ ఆధునిక పరికరానికి అతుక్కుపోతున్నారు. మనిషి రోజులో 16 గంటల పాటు మేల్కొని ఉంటే అందులో 3 నుంచి 4 గంటల పాటు స్మార్ట్ఫోన్ చూస్తూ గడిపేవారు అధికంగా ఉంటున్నారు. నిద్రపోయే 8 గంటల సమయాన్ని సైతం యువత కుదిస్తే మరో రెండు, మూడు గంటలను స్మార్ట్ఫోన్కే కేటాయిస్తోంది. ఫలితంగా శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటోంది. ఇందులో కళ్లు పొడిబారడం అనే సమస్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. నిత్యం ఐదు నుంచి ఆరు గంటలు స్మార్ట్ఫోన్ వాడే వారిలో కళ్లు డ్రై అవడంతో పాటు కార్నియా సమస్యలు వస్తాయని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి వస్తుందంటే.. 50 సంవత్సరాలు నిండిన స్త్రీలకు, బహిష్టు ఆగిన తర్వాత హార్మోన్ థెరపీలో ఉన్నవారికి, కాలుష్య వాతావరణంలో ఎక్కువగా తిరిగే వారికి, కళ్లల్లో కాంటాక్ట్ లెన్స్ వాడే వారికి, ధూమపానం చేసే వారికి, ఎక్కువ సమయం కంప్యూటర్పై పనిచేసే వారికి, కొన్ని రకాలైన మందులు (బీపీ, అలర్జి, మానసిక వ్యాధిగ్రస్తుల మందులు, గర్భ నిరోధక మాత్రలు) వాడే వారితో పాటు కీళ్ల నొప్పులు, మధుమేహం వ్యాధి మందులు వాడే వారికి కూడా డ్రై ఐ రావచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రయాణాలు చేసే వారు కూలింగ్ గ్లాస్ వాడాలి. తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవాలి. స్మార్ట్ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని చూడాలి. కళ్లకు ఫోన్కు మధ్య 15 సెంటీమీటర్ల దూరంగా పెట్టుకుని చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టుకోకూడదు. 20 నిమిషాల పాటు ఫోన్, కంప్యూటర్ వాడిన తర్వాత 20 సెకన్ల పాటు దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడంతో పాటు కనురెప్పలు కొట్టడం వల్ల నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై అవకుండా దోహదం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చీకట్లో స్మార్ట్ఫోన్ను వినియోగించరాదు. కంప్యూటర్పై పనిచేసే వారు యాంటీ రిఫ్లేక్టివ్ గ్లాసెస్ వాడితే మంచిది. రోజులో ఎక్కువ సేపు స్మార్ఫోన్, కంప్యూటర్పై పనిచేసే వారు ఐ డ్రాప్స్, ఆయిట్మెంట్లు వాడటం ద్వారా దుష్ఫలితాలు దరిచేరకుండా చూసుకోవచ్చు. నేత్ర పరీక్ష నిర్వహిస్తున్న వైద్యుడు (ఫైల్) డ్రై ఐని అశ్రద్ధ చేస్తే చూపు కోల్పోతారు డ్రై ఐ వచ్చిన వారు ఆర్టిఫీషియల్ ఐ వాటర్ (కృత్రిమ కంటినీళ్లు) చాలా కాలం వాడాలి. వాడే టియర్ డ్రాప్స్ ఎలాంటి ప్రిజర్వేటివ్ లేకుండా వాడితే మంచిది. పొడి బారిన కళ్ల సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సైక్లోస్పోడిన్ ఐ డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది. ఈ డ్రాప్స్ ఎక్కువ ఉత్ప్రేరితం చేసి కంట్లో ఎక్కువ నీళ్లు వచ్చేలా దోహదం చేస్తాయి. డ్రై ఐని అశ్రద్ధ చేస్తే కంట్లోని కార్నియాపై తెల్లటి మచ్చలు వచ్చి చూపు కోల్పోయే అవకాశం ఉంది. కంటికి పని కల్పించే టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ వంటి వస్తువులను సరైన దూరంలో నుంచి చూస్తే చాలా వరకు కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. వీలైనంత వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కళ్లను పక్కకు మరల్చాలి. డాక్టర్ మెండా ఫర్నీకుమార్, కంటి వైద్య విభాగాధిపతి, జీజీహెచ్, గుంటూరు నేత్రాలు పొడిబారే లక్షణాలు కళ్లు అలసినట్లుగా ఉండడం. కళ్లల్లో మంట, కంట్లో దురదగా ఉండటం, కళ్లల్లో నీళ్లు రావడం, కళ్లు నొప్పిగా ఉండడం, కళ్లల్లో ఇసుకపోసినట్లుగా ఒత్తుకోవడం ఈ లక్షణాలు ఉంటే డ్రై ఐ (కళ్లు పొడిబారడం) సమస్యతో బాధపడుతున్నట్లే. డ్రై ‘ఐ’ ఎలా గుర్తిస్తారు డ్రై ఐ కనుగొనేందుకు కంటి వైద్యులు ఘమర్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్షలో కంట్లో నీరు ఎంత ఉందో కొలిచేందుకు ఒక ఫిల్టర్ పేపర్ వాడతారు. సాధారణంగా 35 మిల్లీమీటర్ల పేపర్ తడిగా అయితే నార్మల్గా ఉన్నట్లు, 5 మిల్లీమీటర్ల కంటే తక్కువగా తడి ఉంటే అతి ప్రమాదకర డ్రై ఐగా నిర్ధారిస్తారు. -
చేప కన్నుతో చికిత్స!
-
చేప కన్నుతో చికిత్స!
వాషింగ్టన్: రెటీనా దెబ్బతిని చూపు కోల్పోయిన వారు తిరిగి చూడగలిగేలా చేయగలమని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. జీబ్రా ఫిష్ మెదడులోని రసాయనిక చర్యల కారణంగా అది తన రెటీనాను కేవలం 28 రోజుల్లో పునరుత్పత్తి చేసుకోగలదని వండర్బిల్ట్ వర్సిటీ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. చేపలోని న్యూరోట్రాన్స్మీటర్ ‘గాబా’ వల్ల ఇది సాధ్యమవుతుందని వారు తేల్చారు. చేపతో పాటు క్షీరదాల్లో రెటీనాను పునరుత్పత్తి చేయగల శక్తి గాబాకు ఉందని, దీనివల్ల దెబ్బతిన్న రెటీనాను కన్ను తనంతట తానుగా పునరుత్పత్తి చేసుకునే అవకాశం ఉందని ప్రొఫెసర్ జేమ్స్ ప్యాటన్ తెలిపారు. రెటీనాకు గాయమైనప్పుడు అందులోని ముల్లర్గ్లియా అనే మూలకణాలు పూర్తిగా వ్యాప్తి చెంది దెబ్బతిన్న నాడీకణాలను పునరుద్ధరిస్తాయి. ఈ మూలకణాలు క్షీరదాల్లోనూ ఉన్నప్పటికీ వాటికి పునరుత్పత్తి శక్తి ఉండదని జేమ్స్ తెలిపారు. ఈ పరిశోధనా వివరాలు ‘స్టెమ్ సెల్ రిపోర్ట్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.