breaking news
EX CS IYR Krishna Rao
-
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్దాలు కోరు అని.. ఆయన అసత్యాలను సానుకూల మీడియా వక్రీకరించి పదే పదే ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుతోందని విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్.కృష్ణారావు ధ్వజమెత్తారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సోమవారం జరిగిన బ్రహ్మణ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర సహాయం చేయలేదని చంద్రబాబు పదేపదే అబద్దాలను చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటున్న ప్రత్యేక హోదాపై చంద్రబాబు, రాహుల్గాంధీ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కేవలం రాష్ట్రానికి ఆర్థిక సహాయంతో కూడిన ప్రత్యేక హోదా మాత్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదాతో పనిలేకుండా రాష్ట్రానికి నిధులు కేటాయించిందన్నారు. కేంద్ర బడ్జెట్ సుమారుగా లక్షన్నర కోట్లు కాగా.. రాష్ట్రానికి లక్ష కోట్లు కావాలని అడగడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్రం విశాఖకు రైల్వేజోన్ ప్రకటించిన 24 గంటల్లో చంద్రబాబు అండ్కో మీడియా లేనిపోని అర్థరహిత వ్యాఖ్యానాలు చేసిందన్నారు. ఎక్కడ జోన్ ప్రకటించినా తప్పనిసరిగా రిక్రూట్మోంట్ బోర్డు ఉంటుందని ఇంగిత జ్ఞానం లేకుండా ఆరోపణలు చేశారన్నారు. మాట్లాడితే పోలవరం పాట పాడే బాబు నాలుగన్నరేళ్లు ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బుతో గెలవాలనే తాపత్రయంతో చంద్రబాబు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అబద్దాలు చెప్పే చంద్రబాబును గెలిపించే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో విశాఖ తూర్పు బీజేపీ అభ్యర్థి సుహాసినీ తదితరులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణుల్లో సాధికారత అవసరం
-
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీగా భారం పడుతుంది
-
ఐవైఆర్ కృష్ణారావుతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ దందా
-
రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ దందా
♦ ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా భూ సమీకరణ ♦ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మండిపాటు సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని అమరావతి నిర్మాణం పేరిట ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా సాగిస్తోందని ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ధ్వజమెత్తారు. స్టార్ హోటళ్లు, గోల్ఫ్ కోర్టుల కోసమని రైతులను బెదిరించి వేలాది ఎకరాలు సమీకరిస్తోందని విమర్శించారు.గురువారం ఉదయం విజయవాడలోని రోటరీ ఆడిటోరియంలో గ్రీన్ సాలిడర్స్ స్వచ్ఛంద సంస్థ ‘పర్యావరణం – సారవంత భూముల పరిరక్షణ’అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి మోసపూరితంగానే వ్యవహరించిందన్నారు. రాజధాని ప్రతిపాదన ఒక చోటు నుంచి మరో చోటుకు కదులుతూ.. మొదట నూజివీడు.. తర్వాత గన్నవరం, మంగళగిరి.. ఆ తర్వాత అమరావతికి చేరిందన్నారు. అసలు రాజధానికి 33వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రాజధాని ప్రక్రియలో నన్ను దూరం పెట్టారు : రాజధాని ప్రక్రియలో అప్పటి ప్రభుత్వ సీఎస్గా ఉన్న నన్ను ప్రభుత్వం దూరం పెట్టింది. ప్రభుత్వ స్థలాల అన్వేషణ కోసం నన్ను సంప్రదించినప్పుడు దొనకొండను పరిపాలన నగరంగా ఏర్పాటుకు సూచించాను. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలను అభివృద్ధి చేసుకోవాలని నివేదించాను. ఆ సమయంలోనే శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి తొలుత నేను కన్వీనర్గా ఉంటారని చెప్పారు. నాలుగు రోజులకే సీఎస్గా బిజీగా ఉంటారు కాబట్టి నన్ను తొలగిస్తున్నట్లు తెలిపారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి రాజధానులను నిర్మిస్తేనే విజయవంతమవుతాయి. ‘మీరు సీఎస్గా ఉన్నారు.. అధికారం మీ చేతిలో ఉండింది.. ఆ రోజు మాట్లాడకుండా.. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు?’ అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలో పని చేసేటప్పుడు పరిమితులుంటాయి. అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అధికారికంగా ఏం చేసినా బయటకు చెప్పడానికి వీల్లేదు. రాజధాని విషయంలోనూ అదే జరిగింది. ఈ రోజు ఇలా మాట్లాడడానికి.. ఆ రోజు నేను చేసిన దానికి సంబంధం లేదు’’అని కృష్ణారావు వివరించారు.