Emission Norms
-
భారత కార్బన్ మార్కెట్ ప్రారంభం..
భారత్తోపాటు ప్రపంచం అంతటా వాతావరణ కాలుష్యం ప్రధాన సమస్యగా మారుతోంది. ఇందుకు కార్బన్ ఉద్గారాలు కీలకంగా ఉన్నాయి. వివిధ ఉత్పత్తుల తయారీలో భాగంగా వీటిని విడుదల చేస్తున్న కంపెనీలపై కాలుష్య నియంత్రణ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అల్యూమినియం, సిమెంట్, క్లోర్-ఆల్కలీ, పేపర్ ఇండస్ట్రీల్లో 282 యూనిట్లకు నిర్దిష్ట ఉద్గార తీవ్రత లక్ష్యాలను నోటిఫై చేయడం ద్వారా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల సమస్యను కొంతవరకు కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్బన ఉద్గారాలను నియంత్రించడం, పరిశ్రమల్లో స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా కార్యాచరణను తయారుచేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మార్గదర్శకాల ప్రకారం పవర్ ఎక్స్ఛేంజీల్లో కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు ట్రేడ్ కావడంతో భారతదేశం ఇటీవల తన కార్బన్ మార్కెట్ను ప్రారంభించింది.కాంప్లయన్స్ కార్బన్ మార్కెట్పరిశ్రమలు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల మేరకే ఉత్పత్తులను తయారు చేయాల్సి ఉంటుంది. బాధ్యతాయుతమైన సంస్థలు (ఆబ్లిగేటెడ్ ఎంటిటీస్-ఓఈ) ఉద్గార పరిమితులను చేరుకోవాలి. ఈ పరిమితుల కంటే అధికంగా ఉద్గారాలు ఉంటే చర్యలు తప్పవు. టన్ను కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినా లేదా నివారించినా కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లను జారీ చేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రాలను రెగ్యులేటర్లకు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పాటించనందుకు జరిమానాలు సైతం విధించేలా నిబంధనలు సిద్ధం చేశారు.కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు అంటే..ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ (CO2) లేదా గ్రీన్ హౌస్ వాయువులు (GHG) నివారిస్తే కంపెనీలకు ప్రత్యేకంగా ఇచ్చే సర్టిఫికేట్లు. కంపెనీలు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, ఆ దిశగా సంస్థలను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. ఒక ప్రాజెక్ట్ విజయవంతంగా GHG ఉద్గారాలను తగ్గించినప్పుడు నియంత్రణ సంస్థలు లేదా స్వతంత్ర సంస్థల ద్వారా కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు జారీ చేస్తారు. ఉదాహరణకు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు లేదా అడవుల పెంపకం కార్యక్రమాలతో ఈ క్రెడిట్లను సంపాదించవచ్చు.ఉద్గారాల పరిమితిని దాటిన కంపెనీలు మిగులు క్రెడిట్లు ఉన్న సంస్థల నుంచి ఈ సర్టిఫికేట్లను కొనుగోలు చేయవచ్చు. ఇది ఉద్గారాల తగ్గింపునకు మార్కెట్ ఆధారిత విధానాన్ని సృష్టిస్తుంది. సంస్థలు ఉద్గారాలను తగ్గించడం లేదా కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకోవాలి. దీన్ని పాటించడంలో విఫలమైతే జరిమానాలు తప్పవు. కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా నైతిక పద్ధతుల్లో భాగంగా కంపెనీలు తమ ఉద్గారాలను భర్తీ చేయడానికి స్వచ్ఛందంగా కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేయవచ్చు.ఇదీ చదవండి: భారత్లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..ప్రయోజనాలుఇది క్రెడిట్ సర్టిఫికేట్లు కలిగి ఉన్న కంపెనీలకు సుస్థిర ప్రాజెక్టుల్లో పెట్టుబడులు వచ్చేలా ప్రోత్సహిస్తుంది. ఉద్గారాల తగ్గింపునకు సంస్థలకు ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. వాతావరణ కాలుష్య కట్టడికి ఇతర కంపెనీలకు తోడ్పడుతుంది. -
అప్గ్రేడెడ్ ఇంజిన్లతో టాటా వాహనాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కఠినతరమైన ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో అప్గ్రేడ్ చేసిన ఇంజిన్లతో ప్యాసింజర్ వాహనాల శ్రేణిని ఆవిష్కరించినట్లు టాటా మోటర్స్ వెల్లడించింది. ఈ ఇంజిన్లు ఈ–20 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది. వీటితో వాహనాలు మరింత సురక్షితంగానూ, సౌకర్యవంతంగా ఉంటాయని వివరించింది. ప్రారంభ గేర్లలో కూడా సౌకర్యవంతమైన అనుభూతి కలిగించేలా ఆల్ట్రోజ్, పంచ్ వాహనాలను తీర్చిదిద్దినట్లు టాటా మోటర్స్ వివరించింది. ఈ రెండు మోడల్స్లో మరింత మైలేజీనిచ్చేలా ఐడిల్ స్టాప్ స్టార్ట్ ఫీచర్ను అందిస్తున్నట్లు పేర్కొంది. పనితీరు మెరుగుపడేలా నెక్సాన్ డీజిల్ ఇంజిన్ను కూడా రీట్యూన్ చేసినట్లు కంపెనీ వివరించింది. -
ఇండియాలో ‘ఆడి’కి షాక్
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్కు చెందిన మరో సంస్థ ఆడికు దేశంలో తొలి ఎదురు దెబ్బతగిలింది. ఉద్గార నిబంధనలకు సంబంధించిన ఆరోపణలతో దేశంలో తొలిసారిగా కేసు నమోదైంది. నోయిడా నివాసి ఒకరు కంపెనీపైనా, కంపెనీకి చెందిన ఇతర ఉన్నతాధికారులపైనా తాజాగా ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర లాంటి ఆరోపణలతో సంస్థపై కేసు నమోదైంది. (ఆడి కొత్తకారు వచ్చేసింది) కాలుష్య నివారణకు సంబంధించి, ఉద్గారాల శాతాన్ని తక్కువగా చూపించే మోసపూరిత పరికరాలతో తనను మోసం చేశారని ఆరోపిస్తూ అనిల్ జిత్ సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫోక్స్ వ్యాగన్, ఆడి ఉన్నతాధికారులతోపాటు, జర్మనీలోని ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాల పైనా కూడా ఆయన కేసు పెట్టారు. ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ రాహిల్ అన్సారీ, ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్, ఆడి ఏజీ చైర్మన్ బ్రామ్ షాట్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2018లో కోట్ల రూపాయల విలువైన ఏడు ఆడి కార్లను కొనుగోలు చేసినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. డెలివరీ సమయంలో, భారతదేశంలో చీట్ డివైసెస్ గురించి తాను విచారించానని, అయితే అలాంటి దేమీ లేదని చెప్పి తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. దేశంలో నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలు అనుమతించిన పరిమితుల కంటే ఆడికార్లలో 5-8 రెట్లు ఉన్నాయని తేలడంతో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ ఫోక్స్ వ్యాగన్పై 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన నేపథ్యంలో తాను మేల్కొన్నాని పేర్కొన్నారు. తప్పుడు పత్రాలు, నకిలీ పరికరాలతో ఉద్దేశ పూర్వకంగానే ఈ కంపెనీలు తనను మోసం చేశాయని, తన కష్టార్జితాన్ని దోచుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాల్సింగా సింగ్ డిమాండ్ చేశారు. కాగా ఫోక్స్ వ్యాగన్ గ్లోబల్ ఉద్గార నిబంధనల ఉల్లంఘన కుంభకోణంలో చిక్కుకున్న నేపథ్యంలో దేశంలో తాజా కేసు నమోదు కావడం గమనార్హం. పరిమితికి మించి 10-40 రెట్లు ఉద్గారాలను ఉత్పత్తి చేసే పరికరాలను కార్లలో అమర్చుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్లో విడుదల చేసిన డీజిల్ కార్లలో ‘చీట్ డివైజ్’ కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందంటూ ఎన్జీటీ గత ఏడాది మార్చిలో ఫోక్స్ వ్యాగన్కు 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
ఫోక్స్వ్యాగన్కు ఎన్జీటీ షాక్
జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్కు ఊహించని షాక్ తగిలింది.. తప్పుడు డీజిల్ మీటర్లతో వినియోగదారులను మోసం చేశారంటూ దాఖలైన కేసుకు సంబంధించి న్యూఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) రూ.100కోట్లు చెల్లించాలని సూచించింది. ఒక్క 2006 ఏడాదిలోనే దాదాపు 3.17లక్షల వాహనాల ద్వారా వాస్తవానికంటే 40రెట్లు నైట్రస్ ఆక్సైడ్స్ (NOx) విడుదల చేసిందన్న ఫిర్యాదుపై 24 గంటలలోగా సెంట్రల్ కాలుష్య నియంత్రణ బోర్డుకు జరిమానా సొమ్మును డిపాజిట్ చేయాలని నేడు (జనవరి 17) ఆదేశించింది. లేని పక్షంలో సంస్థ భారత్ విభాగం ఎండీని అరెస్టు చేయడంతోపాటు సంస్థకు చెందిన ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులు బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య ఉద్గారాలపై , అనేక కేసులను ఎదుర్కొంటున్న ఫోక్స్ వ్యాగన్ ఇండియా భారతదేశంలో కూడా వాహనాల్లో నైట్రస్ ఆక్సైడ్ను అనుమతించదగిన పరిమితులను అధిగమించి వాడిందని, తద్వారా ఢిల్లీ నగరంలో అటు పర్యావరణానికి ఇటు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించిందని తెలిపింది. కాగా ఈ కేసులో 171.34 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా గత ఏడాది నవంబరు 16న ఆదేశించింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోపణలను సమర్ధించిన కమిటీ జరిమానా విధించాలని సిఫార్సు చేసింది. కానీ సంస్థ జరిమానా సొమ్మునుజమలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన100కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా తాజా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తమ వాహానాలు దేశంలో స్టేజ్4 నిర్దేశించిన ఉద్గార నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని ఫోక్స్వ్యాగన్ ఇండియా పేర్కొంది. -
ఆ వాహనాలను మార్చడం సాధ్యంకాదు
న్యూఢిల్లీ: దేశంలోని వాహన తయారీ సంస్థల వద్ద ప్రస్తుతమున్న బీఎస్–3 వాహనాలను కొత్త ఉద్గార నిబంధనలైన బీఎస్–4కు లోబడి అన్ని వాహనాలను మార్పు చేయడం సాధ్యమయ్యేది కాదని తయారీదారులు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా మార్చేందుకు ఎంతమేర ఖర్చు అవుతుందని తయారీదారులను గతంలో సుప్రీంకోర్టు అడిగిన నేపథ్యంలో తయారీదారులు సోమవారం ఈ మేరకు కోర్టుకు తెలియజేశారు. మరోవైపు బీఎస్–4 నిబంధనలను వాహన తయారీదారులు వ్యతిరేకించడంపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో సమాంతరంగా ఏమైనా వాదనలు జరుగుతున్నాయా..? లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) కేంద్రాన్ని ఆదేశించింది.