breaking news
e-commerce portal
-
అమెజాన్ ‘కళా హాత్’లో 280 రకాల ఉత్పత్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ తన పోర్టల్లో ‘కళా హాత్’ పేరిట నిర్వహిస్తున్న స్టోర్లో 280 రకాల కళారూపాల తాలూకు ఉత్పత్తులు నమోదయ్యాయని ‘ప్రయాన్’ ఎండీ సందీప్ వరగంటి చెప్పారు. 2020 చివరి నాటికి 500 రకాల కళారూపాలను ఈ–కామర్స్ పోర్టల్లో పరిచయం చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారాయన. కాటమరాన్ వెంచర్స్, అమెజాన్ల సంయుక్త కంపెనీ అయిన ప్రయాన్... ఈ ‘కళా హాత్’ను ప్రమోట్ చేస్తోంది. ‘సాధారణంగా విక్రేతల నుంచి అమెజాన్ 16 శాతం కమిషన్ తీసుకుంటుంది. కళా హాత్ కింద నమోదైన విక్రేతలకు ఇది 8 శాతమే. ప్రతి క్లస్టర్లో మా ప్రతినిధి ఒకరు నిరంతరం ఉండి వారి వ్యాపార వృద్ధికి తోడ్పాటు అందిస్తారు. శిక్షణ కూడా ఇస్తారు. చేనేత, హస్త కళాకారులకు స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. వారి ఉత్పత్తుల లిస్టింగ్, 3డీ మోడలింగ్ ప్రక్రియ అంతా మేమే చూసుకుంటాం’ అని శుక్రవారమిక్కడ సాక్షి బిజినెస్బ్యూరో ప్రతినిధికి వివరించారు. పోచంపల్లి ఇక్కత్, మంగళగిరి, కళంకారీ, పశీ్మనా, మధుబని, రోగన్, లిప్పన్ కామ్, ధరీజ్ వంటి సంప్రదాయ చేనేత వ్రస్తాలన్నీ దీన్లో ఉన్నట్లు తెలియజేశారు. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,000 పైచిలుకు సంఘాలు, మాస్టర్ వీవర్స్, గోల్కొండ, లేపాక్షి వంటి సంస్థలతో చేతులు కలిపినట్లు చెప్పారు. రాష్ట ప్రభుత్వాలు తోడుంటే.. కళా హాత్ కింద నమోదైన చేనేత, హస్త కళాకారులకు ఒక్కొక్కరికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.10,000ల నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. ఇటువంటి విధానం అమలుకు ఆంధ్రప్రదేశ్, జమ్మూ,కాశ్మీర్, తమిళనాడు ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని సందీప్ వెల్లడించారు. తెలంగాణ నుంచి 180, ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మంది కళాకారులు ప్రస్తుతం కళా హాత్ కింద నమోదయ్యారన్నారు. -
ఇ-కామర్స్ పోర్టల్ మూత.. 4వేల ఉద్యోగాలు ఫట్
న్యూఢిల్లీ: లేటెస్ట్ ఈ కామర్స్ పోర్టల్ 'ఆస్క్ మీ డాట్ కాం' మూత పడింది. దీంతో దేశంలో దాదాపు నాలుగువేలమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తీవ్రమైన నగదులేమి, పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో తన కార్యకలాపాలను కార్యకలాపాలు స్తంభింప చేయాలని నిర్ణయించిందని జీ బిజ్ వెల్లడించింది. నిధుల సమీకరణలో చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో ఈ నిర్ణయం తీసుకుందని రిపోర్టు చేసింది. ఈ క్రమంలో ఆస్క్ మీ వెబ్సైట్ ఉనికిలో ఉన్నప్పటకీ ఎలాంటి కొత్త ఆర్డర్ లను అంగీకరించడంలేదు. ఆస్క్ మీ లో అతి పెద్ద వాటాదారు (97శాతం ) ఆస్ట్రో హోల్డింగ్స్ గత నెల నిష్క్రమణతో ఈ పరిణామం సంభవించింది. మలేషియాకు చెందిన ఆస్ట్రో హీలియన్ వెంచర్ కాపిటల్ సంస్థలు సంయుక్తంగా 'ఆస్క్ మీ' తన సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సంస్థకు 40 కార్యాలయాలు ఉన్న ఆస్క్ మీ డాట్ కామ్ ప్రతి నెలా 6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 39 కోట్లు) నష్టాన్ని సంస్థ భరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వేతనాలు చెల్లించ లేని పరిస్థితికి నెట్టబడిందని జాతీయమీడియా రిపోర్ట్ చేసింది. కాగా, కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న సంస్థ ఉద్యోగులకు వేతనాలు చెల్లించ లేని పరిస్థితిలో ఆస్ట్రో కి ఈమెయిల్స్ , సందేశాలు పంపాలని ఉద్యోగులను కోరింది. ఆస్క్ మీ పేరెంట్ కంపెనీ గెటిట్ ఇన్ఫో సర్వీసెస్ జోక్యం చేసుని అప్పులను చెల్లించకుండా సంస్థ ఉనికి కష్టమంటూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ని గెట్ ఇట్ సంస్థ ఆశ్రయించింది. అయినా ఫలితం దక్కలేదు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది మే లో 30-40 కొత్త నగరాలకు తన కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతమున్న 200 కేంద్రాలకు తోడుగా మరిన్నింటిని ప్రారంభించనున్నట్టు ప్రకటించిన ఆస్క్ మీ చివరికి అనూహ్యంగా మూడపడింది.