Drink and drive case
-
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్.. వార్నర్ పరిస్థితి ఇదీ!
స్వల్ప విరామంలో స్వదేశానికి వెళ్లి, అనూహ్య పరిణామాల మధ్య డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టైన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో కరాచీ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న వార్నర్.. రీఎంట్రీలో తొలి మ్యాచ్లోనే దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్గానూ చేతులెత్తేసి తన జట్టు ఘోర పరాజయానికి కారకుడయ్యాడు.నిన్న (ఏప్రిల్ 9) పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్లో వార్నర్ తొలి బంతికే గోల్డెన్ డకౌటై నిరాశపరిచాడు. అతని జట్టు 247 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసి 87 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 159 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో బెయిల్పై విడుదలై పాకిస్తాన్కు వచ్చిన వార్నర్ ఇంకా ఆ తాలూకా బాధలోనే ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. అతనిలో పూర్వపు జోష్ కనిపించలేదు. ఈ సీజన్లో కరాచీ కింగ్స్కు ఇదే తొలి ఓటమి. వ్యక్తిగతంగానూ డ్రింక్ అండ్ డ్రైవ్ ఘటనకు ముందు వార్నర్ ఓ మోస్తరు ఫామ్లో ఉన్నాడు. 3 మ్యాచ్ల్లో ఓ హాఫ్ సెంచరీ, ఓ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు.అయితే డి అండ్ డి కేసులో అరెస్ట్ తర్వాత వార్నర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పాక్షిక ఉపశమనం పొందినప్పటికీ.. మే 7న సిడ్నీ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. కొద్ది రోజుల కిందట వ్యక్తిగత పనుల నిమిత్తం స్వదేశానికి వెళ్లిన వార్నర్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో చట్టబద్ధ పరిమితి కంటే రెండింతలు ఎక్కువ. దీంతో పోలీసులు వార్నర్ను వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆతర్వాత కేసు నమోదు చేశారు. వార్నర్ అరెస్ట్పై క్రికెట్ సమాజంలో చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ బౌలర్ డొమినిక్ కార్క్ వార్నర్పై తీవ్ర విమర్శలు చేశాడు. జట్టు విజయవంతంగా ఉన్నప్పుడు ఆటగాళ్లకు సెలవులు ఇవ్వకూడదని అన్నాడు. ఇది జట్టు మోమెంటమ్ను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. -
మందు కొట్టి.. ఫ్యామిలీని బలిపెట్టాడు
జిన్నారం (పటాన్చెరు): మద్యంమత్తులో డ్రైవింగ్ ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఓ వ్యక్తి తాగి బైక్ నడుపుతూ డివైడర్ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన భార్యకూతురు ప్రాణాలు కోల్పోయారు. అతడితోపాటు కుమారుడు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. జిన్నారం మండలం గుమ్మడిదల గ్రామానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి, కల్పన(25)దంపతులకు లాస్య, కృతిక, కార్తీక్ సంతానం. బ్రహ్మచారి దినసరి కూలి. బొల్లారంలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆదివారం సాయంత్రం ఐదుగంటల సమయంలో బ్రహ్మచారితోపాటు భార్య కల్పన, కుమారుడు కార్తీక్(3), కూతురు కృతిక బైక్పై బయలుదేరారు. అప్పటికే తాగి ఉన్నాడు. గుమ్మడిదల నుంచి దోమడుగు మీదుగా వెళ్తుండగా బైక్ కిందపడటంతో కల్పన, చిన్నారులకు గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుని అదే బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. దోమడుగు సమీపంలోని ప్రధాన మూలమలుపు వద్ద వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టాడు. కల్పనతోపాటు చిన్నారి కృతిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పటాన్చెరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మచారి, కార్తీక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్తీక్ పరిస్థితి విషమంగా ఉంది. -
జోష్లో జాగ్రత్త
* ఏటా పెరుగుతున్న ‘డ్రింక్ అండ్ డ్రైవ్’ కేసుల సంఖ్య * తాగినడిపిన వారితో పాటు అమాయకుల ప్రాణాలు బలి * ‘న్యూ ఇయర్ పార్టీ’లో డ్రింక్ అండ్ డ్రైవ్కి కాస్తంత దూరంగా * ఉండాలంటున్న పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సాక్షి, బెంగళూరు : న్యూ ఇయర్ను సరికొత్త జోష్తో స్వాగతించేందుకు ఉద్యాననగరి వాసులు సన్నద్ధమవుతున్నారు. మరి ఈ జోష్లో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఉండాలంటే మాత్రం ‘డ్రింక్ అండ్ డ్రైవ్’కి దూరంగా ఉండమని సూచిస్తున్నారు పోలీసు అధికారులు. మద్యం మత్తులో వాహనాలను నడుపడం వల్ల రాష్ట్రంతో పాటు నగరంలో కూడా ప్రతి రోజూ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. బాధ్యతారాహిత్యంగా తాగి వాహనాలను నడపడం వల్ల వారి కుటుంబాలతో పాటు అమాయకులైన మరికొంత మంది ప్రాణాలను సైతం హరించి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అందుకే ఈ కొత్త ఏడాది సంబరాల్లో ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోకుండా ఉండేందుకు గాను ఁడ్రింక్ అండ్ డ్రైవ్*కి తప్పని సరిగా దూరంగా ఉండమని పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలను కోరుతున్నారు. ఏడాది కేడాదికి పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య... డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల సంఖ్య రాష్ట్రంలో ఏడాదికేడాదికి పెరుగుతోంది. ఈ తరహా సంఘటనల్లోను ద్విచక్రవాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమైన సంఘటనలే ఎక్కువని కూడా ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తుంది. 2010లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య 76,232, కాగా అందులో ద్విచక్రవాహన దారుల సంఖ్య 46,156, ఇక 2011లో నమోదైన కేసుల సంఖ్య 76,833కాగా ద్విచక్రవాహన దారుల సంఖ్య 47,006, ఇక 2012లో మొత్తం 78,371కేసులు నమోదు కాగా వాటిలో 51,998 కేసులు ద్విచక్ర వాహనాలపై నమోదైనవే. ఇలా ఏడాదికేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్యా పెరుగుతోంది రాష్ట్రంలో ఏడాదికేడాదికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య మాత్రమే కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. 2010లో రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 20గా నమోదుకాగా, 2011కు అది 22కు పెరిగింది. ఇక 2012 నాటికి ఈ సంఖ్య 28కి చేరుకుం దని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే అనేక సందర్భాల్లో ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడి, కొన్ని రోజుల తర్వాత మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం లెక్కించదు కాబట్టి ప్రభుత్వ గణాంకాల కన్నా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చనేది విశ్లేషకుల వాదన. ఇలా చేయవచ్చుగా... - డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను నిరోధించడానికి నిపుణులు కొన్ని సూచనలను ఇస్తున్నారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే... - ఈ న్యూయర్ పార్టీ వేడుకలో స్నేహితుల బృందంతో పార్టీల్లో పాల్గొంటే స్నేహితుల బృందంలో ఎవరో ఒకరు మద్యానికి దూరంగా ఉండి మిగతా వారిని క్షేమంగా ఇంటికి చేర్చవచ్చు. - మద్యం సేవించిన సమయంలో సెల్ఫ్ డ్రైవింగ్కు బై బై చెప్పి ఏ ఆటోలోనో, క్యాబ్లోనో ఇంటికి చేరితే ప్రమాదాలను నివారించవచ్చు.


