breaking news
dimond jublee
-
నేడు, రేపు కేఎంసీ వార్షికోత్సవం
–హాజరుకానున్న డీఎంఈ సుబ్బారావు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల(కేఎంసీ) 59వ వార్షికోత్సవాన్ని ఈ నెల 28, 29వ తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. లక్ష్య–16 పేరుతో 28వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల 1975 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థి, ఆనాటి మిస్టర్ కేఎంసీ డాక్టర్ ఎ. శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరవుతారన్నారు.మయూక–16 పేరుతో 29వ తేదిన సాయంత్రం నిర్వహించే వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ ఎన్. సుబ్బారావు హాజరవుతారన్నారు. సినీ సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ ఎల్వీ. గంగాధరశాస్త్రి హాజరై వైద్యులు–మానవతావిలువల గురించి ప్రసంగిస్తారని వివరించారు. వీరితో పాటు గౌరవ అతిథులుగా రిటైర్డ్ డీఎంఈ డాక్టర్ ఎస్ఏ సత్తార్, డీఐజీ రమణకుమార్, శ్రీశైలం దేవస్థానం ఈవో, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ ఎన్.భరత్గుప్తా, నాటా ఓవర్సీస్ కో ఆర్డినేటర్ ఎస్. వెంకటరమణ హాజరవుతారన్నారు. వచ్చే ఏడాది 60వ వార్షికోత్సవాన్ని డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్గా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఏడాది పొడవునా ప్రతి నెలా రెండు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జోజిరెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ కష్ణానాయక్, డాక్టర్ పి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్జీ కాలేజీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు
నల్లగొండ : నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు సెమినార్ హాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి జి.జగదీశ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రత్యే క ఆహ్వానితులుగా ఎంజీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, ఎస్పీ ప్రకాశ్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సిహెచ్ ప్రభాకర్, ఎన్కాలేజీ స్థాపన సభ్యులు టి.వెంకటనారాయణ, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎం.రామానుజాచార్యులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కాలేజీ ప్రి న్సిపల్ డా.ఆర్.నాగేందర్ రెడ్డి వ్యవహరిస్తారు.