breaking news
devi reddy
-
ప్రభుత్వ పథకాల కోసం సమగ్ర వెబ్సైట్: దేవిరెడ్డి
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ పథకాల కోసం సమగ్రమైన వెబ్సైట్ ఏర్పాటు చేస్తున్నామని.. ఇది ప్రభుత్వానికి, జర్నలిస్టులకు వారధిలా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని.. ఆన్లైన్లో శిక్షణకు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. ‘‘జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించే బాధ్యత అకాడమీ చేపట్టింది. అకాడమీ పుస్తకాలు కూడా రాయించాం. వాటిని పీడీఎఫ్ రూపంలో అందుబాటులోకి తెచ్చాం. కొత్తగా జర్నలిజంలోకి ప్రవేశించిన వారికి యూనివర్సిటీలో కోర్సులు స్పాన్సర్ చేస్తున్నాం. దీనికోసం మూడు యూనివర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకున్నామన్నారు. కోర్సు చేసిన వారితో ఇంటర్నషిప్ కూడా చేయిస్తాం. అకాడమీ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నాం. గ్రామీణ జీవనం, సమాజం, సమస్యలపై రాసిన కథనాలపై ఉత్తమ కథనాలకు అవార్డులు ఇస్తాం. సాంకేతిక అంశాలపై కూడా శిక్షణ తరగతులు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. బిజినెస్, స్పోర్ట్స్ అంశాలపై కూడా శిక్షణ ఇప్పిస్తాం. నైతిక విలువలు కలిగిన రచనలు చేసినప్పుడే సంపూర్ణ జర్నలిస్టులుగా నిలుస్తామని’’ దేవిరెడ్డి శ్రీనాథ్ పేర్కొన్నారు. చదవండి: సురక్షిత తాగునీటి సరఫరాలో ఏపీ భేష్ సీఎం జగన్పై తప్పుడు కథనాలా.. అర్నాబ్ జాగ్రత్త -
చేనేతకు గోకూప్ చేయూత..!
ఆన్లైన్లో చేనేత ఉత్పత్తుల విక్రయం • 10 రాష్ట్రాల్లోని 275 సంఘాలతో ఒప్పందం • చీరలు, బ్యాగులు, నగల వంటి 20 వేలకుపైగా ఉత్పత్తులు • నెలకు 5 వేల ఆర్డర్లు; 30 శాతం విదేశాల నుంచే • 2017 ముగింపు నాటికి రెండో విడత నిధుల సమీకరణ • గుజరాత్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విస్తరణ కూడా.. • ‘స్టార్టప్ డైరీ’తో గోకూప్ ఫౌండర్ అండ్ సీఈఓ శివ దేవిరెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేనేత కార్మికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాల్లో చాటిచెప్పే చీరలను నేసేదీ వీళ్లే! మరి, నిజంగా దేశంలో నేత కార్మికులకు అంతటి గౌరవం దక్కుతోందా..? సమాధానం కష్టమే! గౌరవం సంగతి పక్కన పెడితే కనీసం వారి కష్టానికి తగిన ప్రతిఫలమూ దక్కట్లేదు. ఒక్క చీరలే కాదు! నేత కార్మికులు తయారు చేసే ప్రతి ఉత్పత్తీ ప్రజాదరణ ఉన్నదే. కాకపోతే వారికి తెలియం దల్లా... ఆయా ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలని!! ఇదిగో.. అలాంటి కష్టాలకు చెక్ చెబుతోంది ‘గోకూప్’! రూ.80 లక్షల పెట్టుబడితో 2011లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన గోకూప్ సొల్యూషన్స అండ్ సర్వీసెస్ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి సంస్థ వ్యవస్థాపక సీఈఓ శివ దేవిరెడ్డి ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ‘‘గోకూప్ అంటే ‘గో’ అంటే విశ్వమంతా(గ్లోబల్); ‘కూప్’ అంటే నలుగురం కలిసి (కో-ఆపరేటివ్) అని అర్థం. మొత్తంగా కలిపితే.. విశ్వమంతా నలుగురం కలిసి ముందుకెళదామని దానర్థం. దేశంలోని అన్ని చేనేత సంఘాలు, కార్మికుల దగ్గరకు స్వయంగా గోకూప్ వెళుతుంది. వారి ఉత్పత్తులను ఆన్లైన్ వేదికగా విక్రరుుంచేందుకు వారితో ఒప్పందం చేసుకుంటుంది. తయారైన ఉత్పత్తులను ఫొటోలు తీసి.. ధరలను నిర్ణరుుంచి.. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది. కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే గోకూప్ ఉద్యోగి ఆయా ఉత్పత్తులుండే ప్రాంతానికి వెళ్లి ఉత్పత్తిని పరీక్షించి, ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తాడు’’ అని. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే. 10 రాష్ట్రాలు.. 275 సంఘాలు..: ప్రస్తుతం గోకూప్ 10 రాష్ట్రాల్లోని 275 చేనేత సంఘాలతో ఒప్పందం చేసుకుంది. ఆప్కో, బోయంక, కేహెచ్డీసీ, ఇంద్రయాని, పోచంపల్లి, కోయల్గూడెం, ఉత్కళ్ వంటి దేశంలోని ప్రముఖ సంఘాలన్నీ ఒప్పందాలు చేసుకున్నారుు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని సుమారు 60 వేల మంది చేనేత కార్మికులు ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. ఆయా ఉత్పత్తులను గోకూప్ వేదికగా ఆన్లైన్లో విక్రరుుంచడమే మా వ్యాపారం. ఒక్కో ఆర్డర్పై కొనుగోలుదారు నుంచే 5-10 శాతం కమిషన్ రూపంలో తీసుకుంటాం. 30 శాతం ఆర్డర్లు విదేశాల నుంచే.. మహిళలు, పురుషుల విభాగంలో అన్ని రకాల చేనేత దుస్తులు, బ్యాగులు, పర్సులు, నగలు, హోం ఫర్నిచర్, హస్త కళలు వంటి ఉత్పత్తులున్నారుు. సుమారు 20 వేలకు పైగా ఉత్పత్తులు నమోదయ్యారుు. ప్రస్తుతం నెలకు 4-5 వేల ఆర్డర్లొస్తున్నారుు. ఇందులో 30% ఆర్డర్లు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల నుంచి వస్తున్నవే. మా మొత్తం వ్యాపారంలో 60 శాతం వాటా చీరల విభాగానిదే. పోచంపల్లి, మంగళగిరి, సంబల్పురి, ఇక్కల్, తుస్సార్ వంటి అన్ని రకాల సంప్రదాయ చేనేత చీరలున్నారుు. ఉత్పత్తుల డెలివరీ కోసం ఇండియా పోస్ట్, ఫెడెక్స్, డీటీసీపీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. మరో 3 రాష్ట్రాలకు విస్తరణ.. ప్రస్తుతం గోకూప్లో 50 మంది ఉద్యోగులున్నారు. ప్రతి ఏటా 100 శాతం వ్యాపారం వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఏంజిల్స్, సాహా ఫండ్స, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు గోకూప్లో పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టారు. 2017 ముగింపు నాటికి రెండో విడత నిధుల సమీకరణ చేయాలని నిర్ణరుుంచాం. వీసీ ఫండ్స కోసం చూస్తున్నాం. వీటి సహాయంతో గుజరాత్, చత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ విస్తరించాలని లక్ష్యించాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
పోలీస్కస్టడీకి భరత్సింహారెడ్డి
హైదరాబాద్: బీటెక్ విద్యార్థిని దేవి రెడ్డి మృతి కేసులో నిందితుడిగా ఉన్న భరత్సింహారెడ్డిని 5 రోజుల పోలీస్కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అతడు రిమాండ్లో ఉన్నాడు. ఈ కేసులో మరింత విచారణ జరిపి వివరాలు రాబట్టేందుకు అతడిని కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు చేసిన వినతిని కోర్టు పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు ఆదేశాలిచ్చింది.