-
దగ్గుబాటి అందరికీ.. ఏలూరి కొందరికే సాయం
సాక్షి, పర్చూరు (ప్రకాశం): ప్రచార పర్వం ముగిసింది. తమకు నచ్చిన నేతను ఓటరు ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఓటు వేయబోయే ముందు ప్రధాన పార్టీల మేనిఫెస్టోలతో పాటు అభ్యర్థులు, వారి గుణగణాలపై ఓటర్లు చర్చించుకుంటున్నారు. గతంలో వారు చేసిన పనులు, సాయం కోసం వెళితే వారు స్పందించే తీరును బేరీజు వేసుకుంటున్నారు. తమకు అందుబాటులో ఉండి వెన్నుదన్నుగా నిలిచే నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల తరఫున పోటీలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుల గుణగణాలు, వ్యవహారశైలిపై ప్రజలు చెప్తున్న విషయాలు ఈవిధంగా ఉన్నాయి. ప్రజలతో దగ్గుబాటి మమేకం మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావుది సున్నిత మనస్తత్వం. ఎదుటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు చలించిపోతుంటారు. మొదటి నుంచి వారిది సంపన్న కుటుంబం. సాటివారి కష్టసుఖాలు పంచుకుంటూ గ్రామానికి పెద్దదిక్కువగా వ్యవహిరించేవారు. దీంతో అనేక మంది ఆయన వద్దకు వచ్చి సాయం పొందుతుండేవారు. ఆయన కూడా ప్రజల నాడిని ఎరిగిన వ్యక్తిగా వారికి ఏమి కావాలో అర్థం చేసుకుంటూ వారి అవసరాలకు అనుగుణంగానే మసులుకునేవారు. అధికారంలో ఉన్నా లేకున్నా అందరికీ అందుబాటులో ఉంటారు. తలుపుతట్టి సాయమడిగితే కాదనలేని వ్యక్తిత్వం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అనేక మందికి ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లుగా ఉద్యోగాలు ఇప్పించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజం. అధికారంలో లేకున్నా ఆయనను కలవడానికి ఎంతో మంది దగ్గుబాటి కుటీరానికి వస్తుంటారు. ఆయనను నమ్మిన నాయకులు, కార్యకర్తలు ఎవరైనా వెన్నంటే ఉంటారు. ఏలూరికి కలసిరాని సన్నిహితులు వ్యాపారవేత్తగా ఉన్న ఏలూరి సాంబశివరావు ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పర్చూరు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి ముందు గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు పెట్టి ఆకర్షించారు. 2014 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అధికారంలోకి వచ్చాక పార్టీకి మొదటి నుంచి ఎన్నుదన్నుగా ఉన్న వాళ్లను దూరంగా ఉంచారు. తన అనుకున్న వారిని మాత్రమే దగ్గరకుతీశారు. మొదట్లో సేవే నా ప్రాణమన్న వ్యక్తి.. ఆ తరువాత ఏ పని చేయడానికైనా అలోచించడం మొదలుపెట్టేవారు. ఏలూరితో కలిసి పనిచేయలేక అనేక మంది సీనియర్లు ఆయనను వీడి వేరు కుంపటి పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన సొంత మనుష్యల కంటే బైట వారినే నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది ప్రజల అభిప్రాయం. దగ్గుబాటి నైజం.. ♦ సాదాసీదాగా ఉంటారు. ♦ దేనికీ ప్రచారానికి ఇష్టపడరు. ♦ సాయం చేయడంలో ముందు వెనుకా ఆలోచించరు. ♦ ఎదుటివారి పరిస్థితులను అర్థం చేసుకుంటారు. కోపపడటం, గట్టిగా మాట్లాడటం ఉండదు. ♦ తన మనసుకు నచ్చింది చేస్తారు. మిగతా వాళ్లుకు పరిస్థితి వివరించి వారితోనూ చేయించుకుంటారు. ♦ ముక్కుసూటి మనిషి చేయగలిగింది చేస్తానని చెప్తారు. ♦ నచ్చకుంటే వారికి ఎడంగా ఉంటారు. ♦ ఏదైనా విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయరు. ♦ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఏలూరి తీరు.. ♦ ఆర్భాటాలకు పోతారు. ♦ పబ్లిసిటీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ♦ నమ్మిన వారికి మాత్రమే సాయం చేస్తారు. ♦ కోపం వచ్చినా తొందరగా బయటపడరు. ♦ ఏ నిర్ణయమైనా సొంతంగానే తీసుకుంటారు. ♦ నాయకులు, కార్యకర్తలు అవినీతికి పాల్పడ్డా కొమ్ముకాస్తారు. ♦ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తారు. ♦ సహకరించని వారిని ఎడంగా పెడతారు. ♦ ఏదైనా ముఖ్య కార్యక్రమాలప్పుడే అందుబాటులో ఉంటారు. ♦ ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారు. -
పోలవరం ప్రాజెక్టు ఎవరి స్వప్నం?
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్ నేత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోలవరం తన కలల ప్రాజెక్టు అని చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధం అని, నాటి ప్రధాని దేవేగౌడ ఈ ప్రాజెక్టుకు అత్యంత సుముఖంగా ఉన్నప్పటికీ ఆయన కోరిన ప్రకారం ప్రాజెక్టు అంచనాలు, మార్పులు గురించి వివరాలు పంపించకుండా తాత్సారం చేసింది చంద్రబాబేనని సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. ప్రధానితో మీటింగులో ఎర్రన్నాయుడు కూడా ఉన్నారని, తర్వాత తొమ్మిదేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం వివరాలు కేంద్రానికి పంపలేదని దీన్ని బట్టి పోలవరం ఎవరి కలో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. నేను నిప్పు, నిజాయితీ.. రాజకీయాల్లో నేను తప్పే చేయను అని బాబు చెప్పిన స్వోత్కర్ష ఓటుకు కోట్లు కేసులో మునిగిపోయిందని, ఆ నీతి నిజాయితీ దెబ్బకే అన్నీ వదులుకుని హైదరాబాద్ నుంచి పారిపోయారని హేళన చేశారు. ఎన్టీఆర్ మరో ఆరు నెలలు బతికి ఉంటే రాష్ట్ర చరిత్ర, బాబు చరిత్ర కూడా తేలిపోయేదంటున్న దగ్గుబాటి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు కదా. ఎలా ఫీలవుతున్నారు? రాజకీయాలకు దూరంగా ఉండటం ఏదో గొప్ప అని నేను భావించడం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడూ బాగానే అనిపించింది. లేనప్పుడు కూడా బాగానే అనిపిస్తోంది. రాజకీయాల్లోంచి నేను సంతృప్తిగా.. అంటే ఏ మచ్చా లేకుండా, అన్ని పనులూ నిర్వహించి మంచి అనిపించుకుని బయటకి వచ్చాను అనే తృప్తితోటే నేను జీవిస్తున్నాను. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సన్నివేశం ఏది? రామారావుగారిని పదవి నుంచి దించేసిన తర్వాత, ఏది ఎలా ఉన్నా నేనుచేసిన పని కరెక్టు కాదు. ఆయన ఒక ఉన్నతమైన శక్తి. జాతికి ప్రతీక ఆయన. ఎన్ని రకాలుగా ఆయన తప్పు చేసి ఉన్నా, నాకు అవి ఇష్టం లేకపోయినా నేను అటువంటి దానిలో భాగస్వామ్యం కావడం అనేది నా జీవితంలోనే అసహ్యకరమైన విషయంగా భావిస్తున్నాను. ఎన్టీరామారావుకు పార్టీ పెట్టమని మీరు ఎప్పుడూ చెప్పలేదా? ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టాలని ఎవరన్నా చెప్పడమంటే అంతకంటే హాస్యాస్పదమైన అంశం ఉండదు. అంతకంటే అబద్ధం కూడా ఉండదు. పార్టీ పెట్టాలని ఎన్టీఆర్కి తానే సలహా ఇచ్చానని బాబు మొన్ననే అన్నారే? బాబు రోజూ చెప్పేవన్నీ నిజాలేనా? ప్రతి రోజూ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే కదా. పార్టీని నేను పెట్టమన్నాను అని చెప్పడం అంటేనే పచ్చి అబద్ధం. 1982 మార్చి 29న హైదరాబాద్లో రామకృష్ణా సినీ స్టూడియోలో తాను పార్టీ పెడుతున్నట్లుగా ఎన్టీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 11న తొలి మహానాడును నిర్వహించారు. మహానాడు పూర్తయ్యాక బాబును నేను స్వయంగా కలిసి పార్టీలోకి వచ్చి ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుం దని ఆహ్వానించాను. దానికి ఆయన కాదన్నారు. మీకు పార్టీ పెట్టేంత ఇది ఉందా అనేశారు. పార్టీ నడపడానికి ఖర్చులు ఎలా వస్తాయి. ఆయన డబ్బులు తీయరు అనేశారు. రామారావు డబ్బులు పెట్టరు అనేదే చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అభిప్రాయం. బాబు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేం అనేది వారి విశ్వాసం. దాన్నే బాబు వ్యక్తం చేశారు. లేటుగా టీడీపీలోకి వచ్చిన బాబు ముందుకెళ్లిపోయారు.. మీరేమో వెనుకబడిపోయారు? పార్టీలోకి తను ఎలా వచ్చాడో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోయాక అక్కడ ఉండలేక వెంటనే టీడీపీలో చేరిపోయాడు. రాజకీయాల్లోకి మాది ఒకరకమైన ఎంట్రీ. బాబుది మరొక రకమైన ఎంట్రీ. తనకు అప్పటికే అధికారం ఏమిటో తెలుసు. ఏం చేయాలో తెలుసు. మేమేమో వ్యవస్థను బాగు చేయాలి అనే సంకల్పంతో పార్టీలోకి వచ్చాము. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో భాగమై డబ్బుల్లేకుండా రాజకీయాలు చేయొచ్చు అని నమ్మి వచ్చినవాళ్లం. కానీ బాబుకు రాజకీయమే జీవనం. దాని కోసం ఏదైనా చేయగలడు. ఎలాంటి సాహసానికైనా పూనుకోగలడు. ఏమైనా చేయగలడు అంటే అడ్డగోలు పనులు కూడా చేస్తాడనా? ఎందుకు చేయడు? మహానాడు, మినీమహానాడు అంటూ రకరకాలుగా సభలు పెట్టేవారు. ప్రతి సంవత్సరం మహానాడు పెట్టడం ఏమిటి, డబ్బు దండగ, దుబారా అనేది మా అభిప్రాయం. కానీ తాను మహానాడులు, మినీమహానాడులు పెట్టడానికి ఉత్సాహం చూపేవాడు. కాంగ్రెస్లో ఒక పని తీరు ఉండేది. నాయకులు వస్తారు. మీటింగు పెడతారు. దానికయ్యే ఖర్చులకు అందరూ ఊరిమీద పడతారు. డబ్బులు కలెక్ట్ చేస్తారు. డేరాలు కట్టడం, భోజనాలు పెట్టడం ఇలాంటివాటికే కాకుండా అదనంగా కూడా వసూలు చేస్తారు. టీడీపీలో కూడా ఇలా మహానాడులు, మినీనాడులు పేరు చెప్పేది. ఊరుమీద పడేది. ఇదేమిటన్నది 1987వరకు నాకు అర్థం కాలేదు. ఆ ఏడాది రామారావు గారు అలా విజయవాడలో జరిపిన మహానాడు కోసం వసూలు చేసిన మొత్తం తన ముందు హుండీలో వేయండి అది ఎవరికీ ఇవ్వవద్దు, నా స్వాధీనంలో ఉంచుకుంటాను అని ప్రకటించారు. అందరూ హుండీలో వేశారు. లెక్కిస్తే మహానాడు ఖర్చులు పోను 60 లక్షల రూపాయలు మిగిలింది. అంటే అంతకుముందు మహానాడుల సందర్భంగా మిగిలిన డబ్బుకు లెక్కా జమా లేదు. ఆ 60 లక్షలు పెట్టి గండిపేటలో పార్టీ ఆఫీసు కొన్నారు. మరి అంతకుముందు వసూలు చేసిన డబ్బులు ఏమైనట్లు? డబ్బుతో ముడిపడిన రాజకీయాలు అలా ఉంటాయి అని చెప్పడానికే ఇదంతా ఉదాహరణగా చెప్పాను. అంతకుముందంతా బాబే మహానాడులను నిర్వహించారా? సందేహమేముంది. వందశాతం కరెక్ట్ అది. 1989లో మహానాడును హైదరాబాదులో నేను స్వయంగా నిర్వహించి దాంట్లో 35 లక్షలు మిగిల్చి ఆ మొత్తాన్ని రామారావు గారికి ఇచ్చాను. మహానాడుకు నా ఆధ్వర్యంలో పెట్టిన ఖర్చు 15 లక్షలు. దాతలిచ్చిన దాన్ని పేర్లతో సహా తెలిపి ఆయన ముందు పెట్టాను. పోలవరం నిజంగా చంద్రబాబు కలేనా? పోలవరానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఉంది. దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై ఒక సమావేశం జరిగింది. వడ్డే వీరభద్రరావు అనే టీడీపీ ఎమ్మెల్యే ఆ సమావేశానికి హాజరయ్యారు. జలవనరుల మంత్రి, ప్లానింగ్ శాఖ మంత్రి, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ మధుదండావతే, ఎర్రన్నాయుడు, ఇంకా ప్లానింగ్, ఫైనాన్స్ శాఖ కార్యదర్శులతో ప్రధాని మీటింగ్ పెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలు, వాటిలో మార్పుల గురించిన వివరాలు పంపించమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని (బాబు సీఎం) అడుగుతున్నాం కానీ ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు ఎలాంటి స్పందనా అందలేదు. మీరు వెంటనే ఆ వివరాలు పంపిస్తే ప్రాజెక్టు మంజూరు చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను అని ఆరోజు ప్రధాని దేవేగౌడ స్వయంగా ప్రకటన ఇచ్చారు. ఆ నాటి మీటింగులో ఎర్రన్నాయుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి పోలవరం ఎవరి కలో? లోకేశ్ను ఎమ్మెల్సీ చేయడం, మంత్రి పదవి ఇవ్వడంపై మీ అభిప్రాయం? దాంట్లో ఏముందండీ, అది మన సొంత వ్యవహారం కదా. ఎన్టీఆర్ పుత్రులకు పదవి ఇవ్వడం వారసత్వమైనప్పుడు లోకేశ్ది వారసత్వం కాదా? ఎన్టీ రామారావు దగ్గర నుంచి మేం తీసేసుకోవచ్చు. కానీ మా దగ్గర నుంచి ఇంకొకరు తీసేసుకోకూడదు. అదీ విషయం. బాబు మాట మాట్లాడితే నేను నిప్పు, నిజాయితీ... అంటుంటారు కదా? ఓటుకు కోట్లు కేసు మాటేంటి? ఆ తర్వాతే కదా హైదరాబాద్ నుంచి పారిపోయింది? (దగ్గుబాటితో ఇంటర్వూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/PYhkkj https://goo.gl/eBKHq8
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
Advertisement