breaking news
Cyber Security Solutions
-
హైదరాబాద్లో సీజీఎస్ నూతన కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన సాంకేతిక రంగ కంపెనీ కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్స్ (సీజీఎస్) హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిన్నరలో 800 మందికి, ఐదేళ్లలో 2 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఫిలిప్ ఫ్రైడ్మన్ తెలిపారు. త్వరలోనే ఈ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ (సీఎస్ఓఎస్)ను కూడా నెలకొల్పుతామని.. ఇందులో ఆగ్యుమేటెడ్ రియాలిటీ (ఏఐ) ఆధారిత సేవలందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయిల్ రీఫ్మన్, సీజీఎస్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఫిలిప్ ఫ్రైడ్మన్, సీజీఎస్ ఇండియా ఎండీ జీతు భట్టు గురువారం సీజీఎస్ హైదరాబాద్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సెంటర్ నుంచి మా కస్టమర్లకు ఆర్ అండ్ డీ, అప్లికేషన్ డెవలప్మెంట్, కస్టమర్కేర్ సెంటర్ సేవలను అందిస్తున్నామని, మైక్రో సాఫ్ట్, ఐబీఎం, డెల్, ఏటీఅండ్టీ, అవయ, తోషిబా, రెమాండ్స్ వంటి కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోని టాప్ టెక్నాలజీ కంపెనీ కాల్సెంటర్ను ఈ సెంటర్ నుంచే నిర్వహిస్తున్నామని చెప్పారు. సీజీఎస్ గ్లోబల్కు యూఎ స్, యూకే, కెనడా, ఇజ్రాయిల్, రొమానియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కార్యాలయాలున్నాయి. 45 దేశాల్లో ఫ్యాషన్, అపెరల్, ఈ– కామర్స్, హెల్త్కేర్, రిటైల్ వంటి పరిశ్రమలకు ఎంటర్ప్రైజెస్ సొల్యూ షన్స్ను అందిస్తుంది. ప్రస్తు తం 8 వేల మంది ఉద్యోగులన్నారని.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 వేల మందికి చేరుకుంటామని తెలిపారు. -
నాస్కామ్ సైబర్ సెక్యూరిటీ టాస్క్ఫోర్స్
న్యూఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ రూపకల్పనకు భారత్ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తాజాగా సైబర్ సెక్యూరిటీ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్సీఐ)తో చేతులు కలిపింది. భారత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోతగిన చర్యలు, ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి ఈ టాస్క్ఫోర్స్ అధ్యయనం చేసి 12 వారాల్లోగా నివేదికనిస్తుంది. ఎన్ఐఐటీ చైర్మన్ రాజేంద్ర పవార్ సారథ్యంలో ఏర్పాటైన సైబర్ సెక్యూరిటీ టాస్క్ఫోర్స్లో ఐటీ, బ్యాంకింగ్, టెలికం రంగాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉంటారు.