-
నాసా శాస్త్రవేత్తలు సౌర కిరీటం అద్భుతాన్ని చూశారు..!
నాసా శాస్త్రవేత్తలు ఈ మధ్య ఓ అద్భుతాన్ని చూశారు! సూర్యుడిపై కార్యకలాపాల వీడియో ఒకటి చూస్తూండగా ధ్రువ ప్రాంతంలోంచి ప్లాస్మా పోగు ఒకటి బయటకొచ్చింది! కుతకుత ఉడుకుతూండే ఈ పోగు చూస్తూండగానే విడిపోయింది! అది అలా అలా ఎగురుతూ ఓ రింగు ఆకారాన్ని సంతరించుకుంది! సూర్యుడి ఉత్తర ధ్రువ ప్రాంతంలో గిరికీలు కొట్టడం మొదలుపెట్టింది!! సూర్యుడి నుంచి ఓ ప్లాస్మా పోగు విడిపోవడమేమిటి, ధ్రువ ప్రాంతంలో రింగులా చక్కర్లు కొట్టడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాసా శాస్త్రవేత్తలూ కాసేపు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇలా జరగడం ఇదే తొలిసారని అంటున్నారు కూడా! సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్ అవుతూండటం ఒక కారణం కావచ్చునని అంచనా వేస్తున్నారు... సూర్యుడు భగభగ మండే అగ్నిగోళమని మనందరికీ తెలుసు. హైడ్రోజన్, హీలియం మూలకాలు ఒకదాంట్లో ఒకటి లయమైపోతూ విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేస్తూంటాయి. ఈ క్రమంలో అక్కడి పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ఆవేశంతో కూడిన వాయువన్నమాట. అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడం, ఫలితంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్లాస్మా పోగులు ఎగసిపడటం మామూలే. వీటిల్లో కొన్ని సూర్యుడి నుంచి విడిపోతూంటాయి కూడా. అయితే ఏ ప్లాస్మా పోగు కూడా ఇప్పటిదాకా ఇలా రింగులా మారి తిరగడం చూడలేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పోగు సూర్యుడి 55 డిగ్రీల అంక్షాంశం వద్ద మొదలై ధ్రువ ప్రాంతాల వైపునకు ప్రయాణిస్తూంటుందని అమెరికాలో కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫరిక్ రీసెర్చ్ డైరెక్టర్ స్కాట్ మాకింతోష్ వివరించారు. ‘‘పదకొండేళ్లకోసారి ఇలా జరగడం, పోగు కచ్చితంగా ఒకే ప్రాంతం నుంచి మొదలై ధ్రువం వైపు ప్రయాణించడాన్ని పరిశీలించాం. ఈ పోగు పదకొండేళ్ల సోలార్ సైకిల్లో ఒకే చోట ఎందుకు పుడుతోంది? కచ్చితంగా ధ్రువాలవైపే ఎందుకు ప్రయాణిస్తోంది? ఉన్నట్టుండి మాయమైపోయి, మూడు నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా అదే ప్రాంతంలో మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? ఇవన్నీ ఎంతో ఆసక్తి రేపే విషయాలు’’ అని వివరించారు. కారణాలు మిస్టరీయే! సూర్యుడి నుంచి ప్లాస్మా పోగులు విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు. 2015లో కొద్ది వ్యవధిలోనే రెండు భారీ పోగులు విడిపోయాయి. మొదటిది సూర్యుడి ఉత్తర భాగంలో సంభవించింది. ప్లాస్మా కిలోమీటర్ల ఎత్తుకు ఎగసింది. తరువాత కింది భాగంలోకి కలిసిపోయింది. రెండు గంటల తరువాత మరో పోగు విడిపోయింది. అయితే రెండు సందర్భాల్లోనూ ప్లాస్మా పోగు రింగులా మారడం, చక్కర్లు కొట్టడం జరగలేదు. తాజాగా మాత్రమే అలా జరగడానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో సూర్యుడిపై కార్యకలాపాలు చాలా చురుకుగా సాగుతున్నాయని.. పదకొండేళ్ల సోలార్ సైకిల్లో కీలకదశకు ఇది నిదర్శమని వారంటున్నారు. ‘‘ఈ సోలార్ సైకిల్ 2024లో పతాక స్థాయికి చేరుతుంది. అప్పుడు సూర్యుని ఉత్తర, దక్షిణ ధ్రువాలు తారుమారవుతాయి. బహుశా ఆ క్రమంలోనే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ప్లాస్మా రింగ్ ఏర్పడి ఉండవచ్చు’’ అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్య వయస్సులోకి ఆదిత్యుడు... సూర్యుడిప్పుడు మధ్య వయసులోకి అడుగుపెట్టాడు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త గియా అంతరిక్ష నౌకతో చేసిన ప్రయోగాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం సూర్యుడి వయసు 457 కోట్ల సంవత్సరాలని, ఇంకో 500 కోట్ల ఏళ్ల తర్వాత నశించిపోతుందని గత ఆగస్టులో శాస్త్రవేత్తలు ప్రకటించారు. చివరి దశలో సూర్యుని సైజు విపరీతంగా పెరుగుతుందని, రెడ్జెయింట్గా మారి భూమితోపాటు ఇతర గ్రహాలనూ మాడ్చి మసి చేసేస్తుందని అంచనా. ఆ తర్వాత వేడి తగ్గిపోయి మరుగుజ్జు నక్షత్రంగా మారిపోతుందట. ఏమిటీ సోలార్ సైకిల్? సూర్యుడు విద్యుదావేశంతో కూడిన భారీ వాయుగోళం. ఈ విద్యుదావేశపు వాయువు కదలికల వల్ల సూర్యుడి చుట్టూ శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దీని ఉత్తర, దక్షిణ ధ్రువాలు పదకొండేళ్లకోసారి తారుమారవుతూంటాయి. ఇదే సోలార్ సైకిల్. దీని ప్రభావం సూర్యుడి ఉపరితలంపై జరిగే కార్యకలాపాలపైనా ఉంటుంది. సూర్యుడిపై జరిగే పేలుళ్ల ఫలితంగా నల్లటి మచ్చల్లాంటివి (సన్ స్పాట్స్) కనిపిస్తూంటాయి. ఒక ఏడాదిలో వీటి సంఖ్యను బట్టి సూర్యుడిపై కార్యకలాపాల తీవ్రత తెలుస్తూంటుంది. సన్స్పాట్స్ ఎక్కువ అవుతున్నాయంటే పదకొండేళ్ల సోలార్ సైకిల్ పతాక స్థాయికి చేరుతోందని అర్థం. ఆ తర్వాత ఏటా ఇవి తగ్గుతూ దాదాపుగా శూన్యమవుతాయి. తర్వాత మళ్లీ ఇంకో సోలార్ సైకిల్ ప్రారంభానికి సూచికగా క్రమంగా పెరుగుతాయి. సూర్యుడిపై నుంచి పదార్థం అంతరిక్షంలోకి ఎగసిపడే తీవ్రత కూడా సోలార్ సైకిల్కు అనుగుణంగానే హెచ్చుతగ్గులకు గురవుతూంటుంది. వీటి ప్రభావం అంతరిక్షంలోని ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ పరికరాలను నాశనం చేసేంత తీవ్రంగా ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరణానంతరమూ బోధించిన ఆచార్యులు
ఆశ్రమం దరిదాపుల్లో అనేక మంది జనం గుమికూడి ఉండడంతో మహాపూర్ణులు కీడు శంకిస్తున్నారు. దగ్గరికి రాగానే ఆచార్యులవారి ఆరోగ్యం ఎలా ఉంది అని ఆతృతగా అడిగారు. విన్నవారు మౌనం వహించారు. ఆళవందార్ ఇక లేరని అర్థమైంది. కూలబడిపోయారు. తేరుకుని రామానుజుని తీసుకుని లోనికి వెళ్లారు. రామానుజుని దుఃఖం అలవికాకుండా ఉంది. ఇంతటి మహానుభావుడిని చూసే భాగ్యం లేకపోయిందే అని, వారి మాట వినకముందే పరమపదించారే అనీ, అంతటి ఆచార్యునికి శిష్యుడిగా శుశ్రూష చేయకుండా మిగిలిపోయానే అని పరితపించారు. రోదిస్తున్న రామానుజుని దగ్గరికి తీసుకుని ఊరడించి, ‘‘శాంతించు నాయనా, విధి బలీయమైంది, కాలాన్ని అతిక్రమించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన మనసులో నీవున్నావు. అదే మహాభాగ్యమనుకో నాయనా. వారిని ఈ విధంగానైనా చూడగలిగావు కదా అని ఊరడిల్లు రామానుజా’’ అని వెన్నుతట్టారు మహాపూర్ణులు. ‘‘అవును స్వామీ’’ అని, యామునాచార్యులకు చివరిసారిగా పాదాభివందనం చేశారు. కళేబరాన్ని తరలించడానికి ముందే వారికి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలనిపించింది. కుడివైపునుంచి చుట్టూ తిరుగుతూ రామానుజుడు జాగ్రత్తగా ఆయన శరీరాన్ని గమనించారు. ఒక చోట ఆగిపోయారు. ‘‘ఇదేమిటి ఆచార్యుల వారి కుడిచేతి మూడు వేళ్లు ముడుచుకుని ఉన్నాయి. ఎప్పుడూ ఇలాగే ఉండేవారా?’’ అనడిగారు.శిష్యులు కూడా అప్పుడే ఆ విషయం గమనించారు. ‘‘లేదు లేదు ఎప్పుడూ ఈ విధంగా వేళ్లు ముడుచుకుని లేరు.’’ అని జవాబిచ్చారు. మహాపూర్ణులు కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటన్నట్టు? వారేమయినా చెప్పాలనుకుని చెప్పలేక ఈ విధంగా వేళ్లు ముడిచారా? అనుకుంటూ ‘‘ఏం జరిగిందో చెప్పండి’’ అక్కడివారిని అడిగారు.‘‘అయ్యా మీరు గురువుగారి ఆజ్ఞమేరకు కాంచీపురం వెళ్లిన తరువాత వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. మమ్మల్ని పిలిచి ‘‘శ్రీరంగని సేవకు లోటు రానివ్వకండి అన్ని ఉపచారాలూ చేస్తూ ఉండండి. రంగడి ప్రసాదాన్ని అందరికీ ఇవ్వండి. గురువులకు తీసుకువెళ్లి అందించండి’’ అని ఉపదేశించారు. మేమంతా తప్పకుండా చేస్తామని గురువుగారికి విన్నవించాం. ఆ తరువాత యామునాచార్యుల వారు పద్మాసనంలో కూర్చున్నారు. సమాధిలోకి వెళ్లే ముందు ఒక్కసారి ద్వారం వైపు చూసారు, మీరు రామానుజులను తోడ్కొని వస్తున్నారేమోనన్నట్టుగా.. ఆ తరువాత తమ ఆచార్యులైన మణక్కాల్ నంబిని తలచుకున్నారు, మనసును గురువుగారి పాదాలపైన నిలిపారు, మమ్మల్ని తైత్తరీయోపనిషద్ లోని బ్రహ్మవల్లి భృగువల్లి పురుష సూక్తాలను గొంతెత్తి గట్టిగా పఠించమన్నారు.మేం పఠిస్తూనే ఉన్నాం. వైయాసి నెల, శ్రావణ షష్ఠి, అభిజిత్ లగ్నంలో, ఆ విధంగానే ధ్యానముద్రలోనే ఉంటూ పరమపద నిత్యవిభూతిని చేరుకున్నారు’ అని వాక్యం పూర్తిచేయలేక కూలబడ్డాడు ఆ శిష్యుడు. ‘‘అంతకుముందు మాకోసం ఏదైనా సందేశం చెప్పారా నాయనా.’’ ‘‘లేదు స్వామీ.. మీ తిరుగు ప్రయాణం మొదలైందా, రామానుజుల వారు మీతో వస్తున్నారా’’ అని మాత్రం ఒకటికి రెండు సార్లు అడిగారు. వారి మనసునిండా మీరిద్దరే స్వామీ...మొత్తం శిష్యబృందానికి మహాపూర్ణులకు అర్థం కావడం లేదు, గురువు యామునాచార్యులు ఎందుకు వేళ్లు ముడిచారు. ఈ పని వెనుక అంతరార్థం ఏమిటి? ఆయన ఎప్పుడూ ఇంత నిగూఢంగా లేరే. ఇంతమంది శిష్యులలో ఎవరైనా ఒకరికి తన ఆశలు ఆశయాలేమో వివరిస్తే ఈ రోజు ఇంత అన్వేషణ ఉండేది కాదు. పోనీ చివరి నిమిషంలో ఏదైనా ఆలోచించుకున్నారా అంటే అదీ తెలియదు. అని కలవరపడుతున్నారు. రామానుజులు ఆలోచిస్తున్నారు. ఇది ఏమై ఉంటుంది. ఏది ఏమైనా ఇది తేలేదాకా యామునాచార్యుల అంత్యక్రియలు జరపకూడదు. అదే విషయాన్ని మహాపూర్ణులవారికి విన్నవించారు. అవునవును. మనం ఆలోచించాల్సిందే. అందాకా ఆగాల్సిందే అన్నారు. రామానుజునికి ఇది ఒక జటిలమైన సమస్య. యామునాచార్యుల మనసులో ఏముందో తెలుసుకోవడం. వారి ఆశయాలు ఏమిటో సరిగ్గా ఊహించడం. ఒకవేళ సరిగ్గా ఊహించినా అవి సరైనవో కాదో ఎవరు సమర్థించాలి? ఏమో. ముందుగా ఆలోచిద్దాం. ఆయన మూడు వేళ్ల ముడి రహస్యాలేమిటో.యామునాచార్యుల జనన కాలంనుంచి జరిగిన వారి అపురూప జీవన సంఘటనలను, వారి ఎదుగుదలను నెమరు వేసుకున్నారు రామానుజులు. ఆచార్యత్వం, ఆయన బోధించిన దివ్యతత్వం, ఆ ఆచార్యుని ఆలోచనలో వెల్లివిరిసిన వైష్ణవ సిద్ధాంతం, దాన్ని ఆయన వివరించిన తీరు, ద్రవిడ వేదం పైన యామునుల భావాలు, విష్ణుభక్తి పరివ్యాప్తం చేయడంపైన ఆయనకున్న ప్రణాళికల గురించి వారి శిష్యులైన కాంచీపూర్ణులు చెప్పిన అనేకానేక అంశాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నారు. తనను తీసుకుని వెళ్లడానికి యామునుల ఆజ్ఞపై కాంచీపురం వచ్చిన మహాపూర్ణులను దారిపొడుగునా తాను ప్రశ్నల ద్వారా వేధించి చెప్పించుకున్న విశేషాంశాలను గుర్తు చేసుకున్నారు. వారు తనను ఎందుకు తన చెంతకు రమ్మన్నారో నేరుగా అడగకుండా, కాంచీపురంనుంచి శ్రీరంగం వచ్చేవరకు దారిలో మహాపూర్ణులతో సాగించిన వివరమైన సంభాషణద్వారా లోతుగా గ్రహించే ప్రయత్నం చేశారు. సుదీర్ఘ ప్రయాణ సమయంలో ఈ అంశాలనన్నింటినీ వివరంగా చర్చించుకునే అవకాశం కలిగింది. తనకు భవిష్యత్ కార్యక్రమంపైన తన విధ్యుక్త ధర్మనిర్వహణ గురించి ఒక స్పష్టమైన అవగాహనా ఏర్పడింది, యామునాచార్యుల ఆశయాలేమిటో కొంత అర్థమైంది. నిజానికి వారు తన ద్వారా ఏం సాధిద్దామని అనుకున్నారో కూడా తెలుసుకోవడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తూనే ఉన్నారు. రామానుజుని కుశాగ్రబుద్ధికి అది తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టకూడదు. కాని భౌతికంగా లేని ఆచార్యుల మనసులో దూరడం ఏ విధంగా? ఆయన మూడు వేళ్ల ముడుల వెనుక ఉన్న వేదన ఏమిటి? కనీసం ఒక్క గంటైనా మాట్లాడలేదే? కొంచెం ముందు వచ్చినా బాగుండేది. తెలుసుకోగలడా? ‘‘వరదా శక్తినివ్వు. రంగనాథా, ఆలోచననివ్వు, అమ్మా శారదాంబా... కరుణించు. దారి చూపించు......భర్గోదేవస్య ధీమహీ... నారాయణా... నా బుద్ధి వికసింపజేయి’’ అని రామానుజుని అంతరంగం అర్థిస్తున్నది. కాస్సేపటికి ఒక నిర్ణయానికి వచ్చారు. నాలో రూపు కట్టిన ఆలోచనను అంచనాను వారికే విన్నవిస్తాను. ఇక గురువుగారి దయ. అని రామానుజుడు ముందడుగు వేసాడు. నిర్జీవంగా ఉన్నా విజ్ఞాన తేజం ఉట్టిపడుతున్న యామునాచార్యుల శిరస్సు చెంతకు కదిలాడు రామానుజుడు. మహాపూర్ణులు ఆతృతతో చూస్తున్నారు. ఈ యువకుడు ఏం చేయబోతున్నాడు? ఎవరికీ చెప్పని రహస్యాలు చిక్కబట్టుకున్న చిక్కుముడులను వ్రేళ్లతో చూపుతున్న యామునాచార్యులదగ్గరికి వెళ్లి రామానుజుడు ఏంచేస్తాడు?యామునాచార్యులకు నమస్కరించి, దగ్గరగా వెళ్లి, చెవుల చెంత చేరి, రామానుజుడు ఇలా అంటున్నాడు. ‘‘ఆచార్యవర్యా, యామునాచార్య తిరువడిఘళే శ్శరణం, అడియేన్ దాసోహం...అత్యంతగహనమైన మీ అంతరంగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రతిపాదన సరైనదైతే ఏదో ఒక సంకేతం ద్వారా మీ ఆమోదం తెలపండి. ఏ సూచనా రాకపోతే, నా ప్రతిపాదన మార్చి ఆలోచనకు మరింత పదును పెడతాను. నన్ను రమ్మని ఆదేశించిన మీరు నాతో ఏదో చెప్పడానికి ఆలోచించే ఉంటారు. ఇది నా మొదటి ప్రతిపాదన. మీకు ఆదినుంచీ మన మహారుషులు వ్యాసుడు, పరాశరుడు చెప్పిన అద్భుత అంశాలను లోకానికి వివరించాలనే ఆలోచన ఉన్నట్టు నేను విన్నాను. మీ అనుగ్రహం చేత నేను మన వ్యాస పరాశరులు విష్ణు పురాణంలో చెప్పిన విశ్వతత్వాన్ని, జీవతత్వాన్ని పరమాత్మ తత్వాన్ని, ఈ తత్వత్రయ వైభవాన్ని ఈ లోకానికి వెల్లడిస్తాను, వ్యాస, పరాశరుల ప్రబోధాలను పునర్వ్యవస్థీకరించి వారి కీర్తిని శాశ్వతం చేస్తాను’’ అని ప్రకటించారు. ఆశ్చర్యం .. యామునాచార్యుల వారు ఒక వేలు ముడి విడిచారు. శిష్యగణం అంతా అచ్చెరువొంది చూస్తున్నారు. మహాపూర్ణుల వారూ ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. యామునాచార్యుల అంతరంగాన్ని తనతో సంభాషణ ద్వారా పూర్తిగా గ్రహించిన రామానుజుని ప్రతిభ అనితర సాధ్యం అని దిగ్భ్రాంతితో ఆ మహానుభావుడినే నిశితంగా పరిశీలిస్తున్నాను. విస్తరించిన యామునాచార్యుల వేలు రేపటి వెలుగును చూపుతున్నట్టు అనిపించింది. మిగిలిన రెండు వ్రేళ్ల ముడులను విప్పగలడీ విప్రయువకుడు రామానుజుడు ...సందేహం లేదు అనుకున్నాడు. రామానుజుని మేధోశక్తితో విప్పని రహస్యాలు విచ్చుకుంటున్నాయి. ఏమి మహత్యం? రామానుజుడు కూడా సంతోషించాడు. తన మొదటి ఆలోచన లక్ష్యాన్ని చేరింది. తనకు యామునాచార్యుల తొలి గురోపదేశం ఏమిటో అర్థమైంది. ప్రాణం ప్రయాణిస్తున్నా ఆశయాలను వీడని దివ్యాత్మ యామునాచార్యులవారిది. ఎంత గొప్ప జీవనం ఆయనది? యామునుల ఆత్మ, అంతరంగం ఇక్కడే ఎక్కడో ఈ పంచభూతాలను ఆవహించి ఉన్నాయి. తన మాటలను వింటున్నాడా ఆచార్యుడు. తనకు సమాధానం చెబుతున్నాడు. భౌతికంగా చెవిలో ఊదవలసిన మహామంత్రాల వంటి అద్భుత ఆశయాలను అంతరాత్మలో దాచుకుని ఆత్మసంభాషణ ద్వారా నానోటితోనే పలికించి, సమాధానాలు సాంకేతికంగా ప్రకటిస్తున్నారు. అంతేకాదు, అందరిముందూ ఈ ఆశయాలేమిటో తెలిపేందుకు ఈ ప్రక్రియను యామునాచార్యులు ఎంచుకున్నారేమో. ఎంత అద్భుతం ఆయన ఆలోచన? అనుకున్నారు. ఇంకా రెండు విషయాలను కూడా నేను ఆలోచించి ఊహించి వారి మనసుకు తగినట్టు చెప్పగలనా; వాగ్దేవి కృప ఉంటే సాధ్యమే. హయగ్రీవుని దయ అని ప్రార్థించి రెండో మాట చెప్పడానికి ఉద్యుక్తులైనారు రామానుజులు. మళ్లీ వంగి యామునాచార్యుల చెవి దగ్గరకు చేరి, ‘‘ఇది నా రెండో ప్రతిపాదన... ఆచార్యవర్యా, మీరు నమ్మాళ్వార్ ద్రవిడ వేదాన్ని లోకానికి అవగతం చేయడానికి ప్రయత్నాలను ప్రారంభించారు. సంస్కృతంలో ఉన్న వేదం దక్షిణ భారతంలోని సామాన్యులకు అర్థం కావడం లేదని, అందుకే అనుసరించలేకపోతున్నారని మీ ఆలోచన కదా. ఆ ద్రవిడవేదాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు తమిళ భాషలో ఆధ్యాత్మిక వైభవాన్ని జనపథంలోకి తెచ్చేందుకు మీ అనుగ్రహంతో ప్రయత్నిస్తాను. అడుగడుగునా మీరు నన్ను ప్రేరేపించి, ముందుకు నడిపిస్తారనే ఆశతో, ప్రజానీకం నాలాయిర ప్రబంధాలను అవగాహన చేసుకునే మార్గాలను అన్వేషిస్తాను... సాధిస్తాను....’’ అంటూ దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించగానే రెండో వేలు ముడి కూడా వీడింది. శిష్యగణంలో ఆశ్చర్యానందాలు వెల్లువెత్తాయి. అంత దుఃఖంలో కూడా హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. తన రెండో సూచన కూడా ఫలించినందుకు రామానుజుడు ధన్యతాభావాన్ని పొందాడు. ఇక మూడో అంశం. ఏమై ఉంటుంది. ఆ... గుర్తుకు వచ్చింది. మిగిలిపోయిన కర్తవ్యాలగురించి యామునాచార్యుల వారేమనేవారని నేను పదేపదే అడిగినప్పుడు మహాపూర్ణుల వారు అన్నారు. దాదాపు అవే ఆలోచనల గురించి కాంచీ పూర్ణుల వారు కూడా తనకు వివరించారు. యామునాచార్యులంతటి గురువు చేయాలనుకున్న అంతటి మహత్కార్యాన్ని ఈ లఘువు, శిష్యుడు చేయగలడా... చూద్దాం ఆ విషయం ఆయనే విన్నవిస్తారు. అనుకున్నారు. - ఆచార్య మాడభూషి శ్రీధర్ -
ప్రదక్షిణలు ఎలా చేయాలి?
భగవంతునిపై భక్తిని చాటుకోవడానికి ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. ప్రదక్షిణలో భక్తి, ఆరోగ్యం రెండూ ఉన్నాయి. ప్రదక్షిణలో ఎంత నిదానంగా నడిస్తే అంత ఫలితం పొందవచ్చు అని స్మృతులు తెలియజేస్తున్నాయి. ఆంజనేయునికి ఐదు ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. శివాలయంలో ఏమైనా ప్రత్యేకమైన కోరికతో చేసే ‘చండీ ప్రదక్షిణ విధి’ తప్ప మిగతా అన్ని ప్రదక్షిణలు ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి ధ్వజస్తంభం వద్దనే ముగించాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తి అయినట్లు. నవగ్రహ ప్రదక్షిణలు చేసే వారు ఆలయంలో ప్రవేశించగానే ముందు పూర్తి ప్రదక్షిణం చేసి ప్రధాన దేవత దర్శనానికి వెళ్ళాలి. కేవలం నవగ్రహాలను పూజించేవాళ్ళు ఇంటికెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి. గణపతికి ఒక ప్రదక్షిణ, సూర్యునికి రెండు ప్రదక్షిణలు, శివునికి మూడు ప్రదక్షిణలు, విష్ణువుకు నాలుగు ప్రదక్షిణలు, అశ్వత్థవృక్షానికి (రావిచెట్టుకు) ఏడు ప్రదక్షిణలు చేయాలని ఆగమాలు చెబుతున్నాయి. శివాలయంలో నందీశ్వరుణ్ణి, ధ్వజస్తంభాన్ని కలుపుకొని ప్రదక్షిణ చేస్తే విశేషఫలం ఉంటుందని శాస్త్రోక్తి. ప్రద„ì ణ ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. పరుగులు పెడుతూ చేసేది ప్రదక్షిణ అనిపించుకోదు. భగవంతుని ఊపిరి భగవంతుని ఉచ్ఛ్వాశ, నిశ్వాసలే వేదం. అనగా వేదం భగవంతుని ఊపిరి. కనుక వేదానికి నిగమం, ఆగమం అని రెండు పేర్లు. వేదాన్ని శృతి అని కూడా అంటారు. అలా చెప్పడానికి గల ఇంకొక కారణం, వేదం గురువుగారి దగ్గర విని నేర్చుకునేది. గురువు ఉచ్చరించినదాన్ని విని అదే విధంగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు కానీ పుస్తకం చూసి చదువుకుని, నేర్చుకునేది కాదు. ఎందుకంటే వేదానికి స్వరం ప్రధానం. ఉచ్చరించడంలో దోషం వచ్చినా, స్వరంలో దోషం వచ్చినా, అక్షర దోషం వచ్చినా, అర్థాలు మారిపోతాయి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వేదోచ్చారణలో జరిగే చిన్న పొరపాటు విపత్తులకు దారి తీస్తుంది. అందువల్ల శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి, గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదే విధంగా ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు ఉంటాడు. అందుకే వేదం అనుశ్రవమైంది. -
వడ్డాది వెంకన్న గిరి ప్రదక్షిణకు శ్రీకారం
బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. సింహాచలంలో మాదిరిగా గిరిజాంబ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి నిర్ణయించారు. అందులో భాగంగా వేంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ రోడ్డు నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. ఆలయం చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర తుప్పలు, డొంకలను పొక్లెయిన్తో తొలగిస్తున్నారు. గుడి మెట్ల వద్ద పనులు ప్రారంభించారు. పది రోజుల్లో కొండ చుట్టూ రోడ్డు పోల్చడానికి, మొక్కలు పెంచేందుకు, సిమెంట్ రోడ్డు వేసేందుకు అధికారులు, నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. రహదారి నిర్మాణం అనంతరం గిరి ప్రదక్షిణకు తేదీ ప్రకటిస్తామని, ఏటా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
వడ్డాది వెంకన్న గిరి ప్రదక్షిణకు శ్రీకారం
బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. సింహాచలంలో మాదిరిగా గిరిజాంబ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి నిర్ణయించారు. అందులో భాగంగా వేంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ రోడ్డు నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. ఆలయం చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర తుప్పలు, డొంకలను పొక్లెయిన్తో తొలగిస్తున్నారు. గుడి మెట్ల వద్ద పనులు ప్రారంభించారు. పది రోజుల్లో కొండ చుట్టూ రోడ్డు పోల్చడానికి, మొక్కలు పెంచేందుకు, సిమెంట్ రోడ్డు వేసేందుకు అధికారులు, నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. రహదారి నిర్మాణం అనంతరం గిరి ప్రదక్షిణకు తేదీ ప్రకటిస్తామని, ఏటా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement