breaking news
chrome os
-
అతి తక్కువ ధరకే క్రోమ్బుక్ ల్యాప్టాప్స్..!
తైవాన్కు చెందిన ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్ కొత్తగా క్రోమ్బుక్ ల్యాప్టాప్ మోడళ్లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఆసుస్ క్రోమ్బుక్ ఫ్లిప్ సీ214, క్రోమ్బుక్ సీ423, క్రోమ్బుక్ సీ523, క్రోమ్బుక్ సీ223 ల్యాప్టాప్ మోడళ్లను ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యంతో ఆసుస్ కంపెనీ ప్రారంభించింది. ఈ ల్యాప్టాప్ మోడళ్లు గూగుల్కు చెందిన క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్(Chrome OS)తో పనిచేయనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఆసుస్ కొత్తగా క్రోమ్బుక్లను మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. యుఎస్, ఇతర ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చిన తరువాత మొదటిసారిగా భారత మార్కెట్లోకి ఆసుస్ రిలీజ్ చేసింది. ఆసుస్ క్రోమ్బుక్ సీ423, క్రోమ్బుక్ సీ523 టచ్, నాన్-టచ్ డిస్ప్లే ఎంపికలతో రానున్నాయి. ఆసుస్ క్రోమ్బుక్ ఫ్లిప్ సీ214 ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ423 నాన్ టచ్ మోడల్ ధర రూ.19,999. టచ్ మోడల్ ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ523 నాన్ టచ్ మోడల్ ధర రూ.20,999, టచ్ మోడల్ ధర రూ. 24,999. ఆసుస్ క్రోమ్బుక్ సీ223 అతి తక్కువ ధర రూ. 17,999గా నిర్ణయించింది. ఈ ల్యాప్టాప్ క్రోమ్ బుక్ మోడళ్లు జూలై 22 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉండనున్నాయి. ఆసుస్ క్రోమ్బుక్ ఫ్లిప్ సీ214 ఫీచర్లు 11.6 అంగుళాల ఆంటీగ్లేర్ టచ్ డిస్ప్లే డ్యూయల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ ఎన్ 4020 ప్రాసెసర్ ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ 600 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 50Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్బుక్ సీ423 ఫీచర్లు 14 అంగుళాల టచ్ డిస్ప్లే(ఆప్షనల్) ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 500 ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్బుక్ సీ523 ఫీచర్లు 15.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంటెల్ హెచ్డీ గ్రాఫిక్స్ 500 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్బుక్ సీ223 ఫీచర్లు 11.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఇంటెల్ సెలెరాన్ ఎన్3350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంటెట్ హెచ్డీ గ్రాఫిక్స్ 500 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ -
హ్యాక్ చేయండి.. లక్షలు పట్టుకుపోండి!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ హ్యాకర్లకు ఈ ఏడాది కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్రోమ్ ఓఎస్(ఆపరేటింగ్ సిస్టమ్)తో పనిచేసే తమ బ్రౌజర్ను నియంత్రణలోకి తీసుకుంటే భారీ మొత్తంలో ప్రైజ్మనీని ఇస్తామంటూ ‘పోనియమ్ 4 హ్యాకింగ్ కాంటెస్ట్’ పేరుతో సవాల్ విసిరింది. మార్చిలో కెనడాలోని వాంకోవర్లో జరిగే ‘కాన్సెక్వెస్ట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్’లో ఈ పోటీని నిర్వహిస్తారు. క్రోమ్ని హ్యాక్ చేసినవారికి మొత్తం 2.7 మిలియన్ డాలర్ల (రూ.16.92 కోట్లు) బహుమతులు అందజేస్తారు. క్రోమ్ను గెస్ట్మోడ్లో లేదా లాగ్డ్-ఇన్ యూజర్ రూపంలో నియంత్రణలోకి తీసుకుంటే రూ.68 లక్షలు, హెచ్పీ, ఏసర్ క్రోమ్బుక్లను రీబూట్ తర్వాత హ్యాక్ చేస్తే రూ.94 లక్షలు అందుతాయి. గూగుల్ బ్రౌజర్లో లోపాలను తెలుసుకునేందుకే ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఇంటెల్ ఆధారిత క్రోమ్ ఓఎస్ డివైస్ల మీదే పోటీలు పెట్టగా.. ఈసారి ఏఆర్ఎం క్రోమ్ బుక్, హెచ్పీ క్రోమ్బుక్, ఏసర్ సీ720 క్రోమ్బుక్లపైనా హ్యాకింగ్కు అవకాశం కల్పించారు.