breaking news
Chikkudu Prabhakar
-
తెలంగాణలో చీకటి పాలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చీకటి పాలన సాగుతోందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అచ్యుతరామరావు అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలు, రచయితలు, ప్రజా సంఘాలపై నిర్బంధాలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత రామారావు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాలను అణిచివేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బలిదానాలతో తెలంగాణ వచ్చింది తప్ప యజ్ఞాలతో కాదన్నారు. టీపీఎఫ్ అధ్యక్షులు రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణలో తీవ్రమైన నిర్బంధం కొనసాగుతుందని విమర్శించారు. కశ్మీర్ తరహాలో ఇక్కడ అప్రకటిత నిర్బంధం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీఎఫ్ కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ప్రొఫెసర్లు లక్ష్మణ్, అన్వర్ఖాన్, కాసీం, అడ్వకేట్ రఘునాథ్, నారాయణరావు, నలమాస కృష్ణ, కోటి, దుడ్డు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మేధావుల గొంతులను అణచివేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేసిన విరసం కార్యవర్గ సభ్యులు ప్రజా సమస్యలపై ప్రశ్నించే మేధావుల గొంతులను అణచివేస్తున్నారని, దీనిలో భాగంగానే విరసం కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కె.జగన్పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో విరసం కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ కాశీం, తెలంగాణ సాహితీవేత్త భూపతి వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి వఝల శివకుమార్, జగన్ తల్లి లక్ష్మీ నర్సమ్మలు మాట్లాడారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్య మంలో జగన్ కీలకపాత్ర పోషించారని, అప్పుడు ఏర్పడిన విద్యార్ధి జేఏసీలో ప్రధాన నాయకుడిగా ఉన్నారని వారు తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పీజీ కాలేజీలో అర్ధశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జగన్ పనిచేస్తున్నారన్నారు. మఫ్టీలో ఉన్న గద్వాల పోలీసులు గురువారం ఉదయం 10.30 ప్రాంతంలో జగన్ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అనంతరం ఆయన కళ్లకు గంతలు కట్టి ఎక్కడెక్కడో తిప్పి సాయంత్రం 4 గంటలకు ఆయన ఇంటికి తీసుకువచ్చి పుస్తకాలు, ఇల్లు మొత్తం చిందరవందర చేశారన్నారు. బేషరతుగా జగన్ తోపాటు చైతన్య మహిళా సంఘం నాయకురాలు శిల్ప, తెలంగాణ విద్యార్ధి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి తదితరులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విరసం కార్యదర్శి పాణి, కార్యవర్గ సభ్యులు రాంకీ, రాము, క్రాంతి, సభ్యులు అరవింద్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
కోవర్టు ద్వారా పెళ్లి భోజనంలో విషం పెట్టి..
కరీంనగర్ జిల్లా : మహరాష్ట్రలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ పచ్చిభూటకమని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఎటపల్లి తాలూకాలోని సింలి గ్రామంలో కోవర్టు ద్వారా పెళ్లి భోజనంలో విషం పెట్టి 33 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆరోపించారు. ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. దీనిని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. -
ఏపీఎన్జీవో సభలను తరిమికొట్టండి: ప్రభాకర్
సమైక్యాంధ్రకు మద్దతుగా 'సేవ్ ఆంధ్రప్రదేశ్'అంటూ పెట్టుడిదారులైన ఏపీఎన్జీవోల నిర్వహిస్తున్న మహాసభలను తరిమికొట్టాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్ శుక్రవారం తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి నుంచి రేపు అర్థరాత్రి వరకు టీ జేఏసీ బంద్కు పిలుపు నివ్వడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు.తెలంగాణ బంద్కు ఆయన మద్దతు పలికారు. రాజకీయ ఖైదీల నాయకుడు శ్రీరాముల శ్రీనివాస్ కూడా తెలంగాణ బంద్కు మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు ఏపీఎన్జీవోలు ఈ నెల 7న నగరంలోని ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది.ఆ సభకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. అయితే ఆదే రోజు నగరంలో తెలంగాణావాదులు శాంతిర్యాలీ నిర్వహించేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.ఆ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అందుకు నిరసనగా ఈ నెల 7న 24 గంటల బంద్ నిర్వహించాలని టీజేఏసీ తెలంగాణవాదులకు పిలుపు నిచ్చింది.