breaking news
Chennai incident
-
సిరిపురపు రాము కుటుంబంతో...
దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము చెన్నై ఘటనలో మృతి చెందారు. ఆయన భార్యాపిల్లలు అనాథలయ్యారు. ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. వివరాలు అడిగితెలుసుకున్నారు. ఆ సంభాషణ ఇలా సాగింది. జగన్: తల్లీ నీ పేరేంటి? బాధితురాలు: నా పేరు లక్ష్మి అండి. జగన్:ఎంతమంది పిల్లలమ్మా నీకు? బాధితురాలు: ఇద్దరు పిల్లలు. జగన్: అక్కడ ఎంత కూలి ఇచ్చేవారు? బాధితురాలు: నాకు తెలీదండి. అంతా ఆయనే చూసుకొనేవారు. జగన్: తమిళనాడు ప్రభుత్వం మీకు ఏమైనా సాయం చేసిందా? బాధితురాలు: నాకు తెలీదండి. జగన్: తమిళనాడు బిల్డర్ మీతో ఏమైనా మాట్లాడారా? బాధితురాలు:మాతో ఎవరూ మాట్లాడలేదండి. జగన్: కోర్టులో కేసు వేయండి వాళ్లే రాజీకి వస్తారు. మీకు డబ్బులు ఇస్తారుగా. బాధితురాలు:నాకు ఏటీ తెలీదు సారూ. జగన్: అక్కడ మన తెలుగు ఎంపీలు ఉన్నారు. వారి ద్వారా మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాను. బాధితురాలు: అంతా మీ దయండి. జగన్: పిల్లలను బాగా చదివించు తల్లి. (అంటూ పిల్లలు వేదశ్రీ, ఐశ్వర్యలను పలకరించారు). బాధితురాలు: అలాగేనండి. బాగా చదివించుకుంటానండి. -
ఇంకా శిథిలాల కిందే !