-
Catastrophe Insurance: మీ ఇంటికి బీమా ఉందా..?
దీపావళి రోజున హైదరాబాద్కు చెందిన రామన్ కుటుంబం ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. స్కై షాట్ క్రాకర్ గతితప్పి ఎనిమిదో అంతస్తులోని రామన్ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లింది. దాంతో మంటలు మొదలయ్యాయి. ఇంట్లోని ఫరి్నచర్, విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వ్రస్తాలు కాలిపోయాయి. ఒకింత అదృష్టం ఏమిటంటే రామన్ కుటుంబ సభ్యులు అందరూ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, ఇంట్లోని విలువైన వస్తువులు కాలిపోవడం వల్ల రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇది ఊహించని నష్టం. ఇలాంటి ప్రమాదం ఏర్పడుతుందని ఎవరూ అనుకోరు. కానీ, ప్రమాదాలు అన్నవి చెప్పి రావు. అందుకే ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ఉండాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. కానీ, దీన్ని పాటించే వారు చాలా తక్కువ మందే అని చెప్పుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటితోపాటు, ఇంట్లోని విలువైన వస్తువులకు ప్రమాదాలు, విపత్తుల కారణంగా ఏర్పడే నష్టం నుంచి రక్షణనిస్తుంది. చౌక ప్రీమియానికే వస్తుంది. రోజుకు ఒక టీకి పెట్టేంత ఖర్చు కూడా కాదు. హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి అనేది వివరంగా చూద్దాం... ‘‘ప్రజలు తమ జీవిత కాల పొదుపును ఇంటి కొనుగోలు కోసం వెచి్చస్తున్నారు. మరి అంతటి విలువైన ఆస్తిని కాపాడుకునేందుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఎంతో విలువైన ఆస్తికి ఎల్లప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్రైటింగ్ , ప్రాపర్టీ క్లెయిమ్స్ చీఫ్ గౌరవ్ అరోరా తెలిపారు. నిజానికి ప్రతి 20 ఇళ్లల్లో కేవలం ఒక ఇంటికే ప్రస్తుతం బీమా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సగటు వ్యక్తికి ఇల్లు అనేది పెద్ద పెట్టుబడి అవుతుంది. అందుకే ఆ విలువైన ఆస్తికి తప్పకుండా రక్షణ తీసుకోవాలి. ‘‘విపత్తులు రావడం అన్నది అరుదే. కానీ, వచి్చనప్పుడు వాటిల్లే నష్టం భారీగా ఉంటుంది’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది పేర్కొన్నారు. అనుభవాలను మర్చిపోవద్దు.. జీవిత బీమా తీసుకోవాలని చాలా మంది ఏజెంట్లు అడగడం వినే ఉంటారు. కానీ, అదే స్థాయిలో హోమ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కనిపించదు. దీన్ని తీసుకున్నామని, తీసుకోవాలని సూచించే వారు కూడా అరుదు. విపత్తులు, ప్రమాదాలే హోమ్ ఇన్సూరెన్స్ దిశగా అడుగులు వేయించేవిగా భావించాలి. నిజానికి ప్రకృతి విపత్తుల సమయాల్లో హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. 2018లో కేరళను వరదలు తీవ్రంగా నష్టపరిచాయి. ఆ తర్వాతి ఏడాదిలో హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆదాయం 34 శాతం పెరిగింది. ఇంటి బీమా కోసం ఆసక్తి పెరిగింది. 2020లో యాంఫాన్ తుపాను పశి్చమబెంగాల్ను నష్టపరచగా ఆ తర్వాతి ఆరి్థక సంవత్సరంలో పై ప్రీమియం ఆదాయం 27 శాతం పెరగడం గమనించొచ్చు. కానీ, ఇదంతా తాత్కాలిక ధోరణిగానే ఉంటోంది. విపత్తులు లేదా ప్రమాదాలు తలెత్తినప్పుడు సహజంగా హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. తిరిగి ఏడాది రెండేళ్ల తర్వాత అక్కడి ప్రజలు వాటిని మరిచిపోతుంటారు. దీంతో విక్రయాలు మళ్లీ తగ్గుతుంటాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోనూ కనిపిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో వైద్య బిల్లులు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆరోగ్య బీమా తీసుకునే వారిలో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. ఇప్పుడు కరోనా విపత్తు బలహీనపడింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ విక్రయాలు తిరిగి సాధారణ స్థాయికి చేరాయి’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్కు చెందిన చతుర్వేది తెలిపారు. ఫ్లాట్ యజమానులు హౌసింగ్ సొసైటీ తీసుకున్న హోమ్ ఇన్సూరెన్స్పై ఆధారపడడం సరికాదని నిపుణుల సూచన. తమ ఫ్లాట్తోపాటు, అందులోని విలువైన వస్తువులకు విడిగా కవరేజీ తీసుకోవడం అన్ని విధాలుగా మెరుగైన నిర్ణయం అవుతుంది. ఇంటికి భూకంపాలు, తుపాను, వరదల ముప్పు మాత్రమే కాదు, ఎత్తయిన భవనాలు, ఖరీదైన గాడ్జెట్ల వినియోగం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల ముప్పు కూడా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. ముంబైలో ఏటా 5,000 వరకు అగ్ని ప్రమాదాలు నమోదవుతున్నట్టు ఒక అంచనా. ఇందులో 70 శాతానికి విద్యుత్తే కారణంగా ఉంటోంది. ఢిల్లీ, బెంగళూరు తదితర పట్టణాల్లో ఏటా 2,500 మేర అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ గాడ్జెట్ల వినియోగం పెరిగిపోవడంతో, ఎలక్ట్రికల్ వైరింగ్పై భారం అధికమై అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ చతుర్వేది తెలిపారు. అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదానికి సంబంధించి అలారమ్ మోగిన వెంటనే, స్ప్రింక్లర్ సిస్టమ్ నుంచి నీరు ఎంతో ఒత్తిడితో ఎగజిమ్మడం మొదలవుతుంది. ఈ నీటి కారణంగా ఇంట్లోని విలువైన గాడ్జెట్లు, ఇంటీరియర్ దెబ్బతింటాయి. కనుక అగ్ని ప్రమాదం జరగకపోయినప్పటికీ, ఇంటి యజమా ని చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్దె ఇంట్లో ఉంటే హోమ్ ఇన్సూరెన్స్ అవసరం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది ఎంత మాత్రం సరైనది కాదు. హోమ్ ఇన్సూరెన్స్ అన్నది కేవలం ఇంటి నిర్మాణానికి జరిగిన నష్టానికే పరిమితం కాదు. ఇంట్లోని వస్తువులు దెబ్బతింటే ఏర్పడే నష్టం నుంచి గట్టెక్కడానికి బీమా అక్కరకు వస్తుంది. దోపిడీ, దొంగతనాల వల్ల ఏర్పడే నష్టాన్ని సైతం భర్తీ చేసుకోవచ్చు. కవరేజీ చాలినంత.. హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. తమ అవసరాలకు తగిన పాలసీ కీలకం అవుతుంది. భారత్ గృహ రక్ష (బీజీఆర్) అన్నది ఐఆర్డీఏఐ ఆదేశాల మేరకు అన్ని సాధారణ బీమా సంస్థలు తీసుకొచి్చన ప్రామాణిక నివాస బీమా. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలతోపాటు అగ్ని ప్రమాదాలు, చెట్టు విరిగి పడడం, వాహనం డ్యాష్ ఇవ్వడం కారణంగా ఇంటికి వాటిల్లే నష్టానికి ఈ పాలసీలో పరిహారం లభిస్తుంది. శిధిలాల తొలగింపునకు, ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్ట్ ఫీజులకు అయ్యే మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. కానీ, ఇందులో పరిమితులు కూడా ఉన్నాయి. రూ.10 లక్షలు లేదా తీసుకున్న కవరేజీలో 20 శాతం ఏది తక్కువ అయితే అంత మేరే ఈ పాలసీ కింద పరిహారం లభిస్తుంది. ఓ సాధారణ మధ్య తరగతి ఇంటికి రూ.10 లక్షలు బీమా సరిపోదు. ఇంట్లో అధిక విలువ కలిగిన వస్తువులు ఉంటే, వాటి కోసం ప్రత్యేక కవరేజీ తీసుకోవాలని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ అండ్ రైటింగ్ హెడ్ గురుదీప్ సింగ్ బాత్రా సూచించారు. ఇంటి మార్కెట్ విలువ ఆధారంగా బీమా కవరేజీపై నిర్ణయానికి రావద్దు. ఇంటి నిర్మాణం దెబ్బతింటే, పునరుద్ధరించడానికి అయ్యే వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చదరపు అడుగుకు ఎంత వ్యయం అవుతుందో ఇంజనీర్లను అడిగితే తెలుస్తుంది. ఇంట్లో విలువైన ఫిట్టింగ్లు ఏర్పాటు చేసుకున్న వారు, ఆ విలువను కూడా బీమా కవరేజీకి అదనంగా జోడించుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏటా ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక ఏడాదికి కాకుండా ఒకేసారి రెండు, మూడేళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. ‘‘ఇంటికి తీసుకునే బీమాని ఏటా రెన్యువల్కు ముందు ఆ కవరేజీని సమీక్షించుకోవాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటా ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిపోతుంటుంది. అందుకు అనుగుణంగా ఏటా నిర్ణీత శాతం మేర కవరేజీని పెంచుకోవాలి. ఏటా 10 శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళ్లే వాటిని పరిశీలించొచ్చు. ఇంట్లో ఉన్న ఒక్కో పరికరం, కొనుగోలు చేసిన సంవత్సరం, మోడల్ నంబర్, దాని విలువ ఈ వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ సంస్థలు ఈ వివరాల ఆధారంగానే పరిహారాన్ని నిర్ణయిస్తాయి. అవి ఎన్నేళ్ల పాటు వాడారన్న వివరాల ఆధారంగా ప్రామాణిక తరుగును అమలు చేస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాల విలువ ఏటా తగ్గుతూ ఉంటుంది. రూ.50 వేలు పెట్టి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన వస్తువు విలువ ఇప్పుడు సగానికి తగ్గిపోతుంది. కనుక పాడైపోయిన దాని స్థానంలో కొత్తది కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుందని అనుకోవద్దు. ఇంట్లో విలువైన కళాకృతులు ఉంటే, వాటికి సైతం బీమా కవరేజీ కోరుకుంటే.. సరి్టఫైడ్ ఏజెన్సీ నుంచి వ్యాల్యూషన్ సరి్టఫికెట్ తీసుకోవాలి. ఒకవేళ కళాఖండాల మొత్తం విలువ రూ.5 లక్షలు, విడిగా ఒక్కోటి విలువ రూ.లక్ష మించకపోతే వ్యాల్యూషన్ సరి్టఫికెట్ అవసరం పడదు. ఎలాంటి కవరేజీ..? ప్రతి ఇంటికి కనీసం హోమ్ ఇన్సూరెన్స్ బేసిక్ పాలసీ అయినా ఉండాలి. భూకంపాలు, పిడుగులు, తుపానులు, వడగళ్లు, వరదలు తదితర ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదం, విధ్వంసం, అల్లర్ల కారణంగా ఇంటి నిర్మాణానికి నష్టం ఏర్పడితే బేసిక్ పాలసీలో పరిహారం లభిస్తుంది. మరమ్మతులు లేదంటే తిరిగి నిర్మాణం వీటిల్లో సరైన దానికి కవరేజీనిస్తుంది. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం రూ.30 వరకు ఉంటుంది. ఇక ఇంటి నిర్మాణానికి అదనంగా, ఇంట్లోని వస్తువులకు కూడా రక్షణ తీసుకోవచ్చు. ఈ తరహా కవరేజీకి ప్రతి రూ.లక్షకు గాను ప్రీమియం రూ.60 వరకు ఉంటుంది. దోపిడీ, దొంగతనాల నుంచి సైతం రక్షణ అవసరం. ఇంట్లోని ఫరి్నచర్, కళాఖండాలు, వ్రస్తాలు, గృహోపకరణాలు, గాడ్జెట్ల వంటి వాటికి దొంగతనాల నుంచి రక్షణ కోరుకుంటే ప్రతి రూ.లక్షకు రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇంట్లో గాడ్జెట్లు పనిచేయకుండా పోవడం చూస్తుంటాం. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో పరికరం పనిచేయకుండా పోతే, పరస్పర అంగీకారం మేరకు పరిహారం అందించే ‘బ్రేక్డౌన్’ కవర్ కూడా ఉంటుంది. దీనికి ప్రీమియం రూ.లక్షకు రూ.200–300 వరకు ఉంటుంది. రుణంపై ఇంటిని తీసుకున్న వారు ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణం వరకు రుణ ఈఎంఐని బీమా కంపెనీ చెల్లించాలని కోరుకుంటే ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఆరు నెలల ఈఎంఐ రక్షణకు ప్రీమియం రూ.2,500 వరకు ఉంటుంది. ఇంటి నిర్మాణం దెబ్బతిన్నప్పుడు అందులో ఉండే కిరాయిదారు ఖాళీ చేయాల్సి రావచ్చు. అదే జరిగితే అప్పటి వరకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వస్తున్న అద్దె ఆదాయానికి బ్రేక్ పడుతుంది. ఇలా అద్దె ఆదాయాన్ని నష్టపోకుండా, బీమా సంస్థ చెల్లించేలా యాడాన్ కవర్ తీసుకోవచ్చు. దీనికి ప్రతి నెలా రూ.25వేల అద్దె చొప్పున ఆరు నెలల పాటు చెల్లించే కవర్కు ప్రీమియం రూ.2,000 ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా ప్రత్యేకంగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్తో తీసుకోవాల్సిన అవసరం లేదు. భారం తగ్గాలంటే..? హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇల్లు, ఇంట్లోని వస్తువులకు నష్టం వాటిల్లినప్పుడు, కొంత మొత్తాన్ని తామే భరించేట్టు అయితే ప్రీమియం తగ్గుతుంది. కొన్ని కంపెనీలే ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. ఇంట్లో అన్నింటికీ బీమా అవసరం ఉండదు. బాగా పాత పడిపోయిన వాటికి, పెద్దగా వ్యాల్యూ లేని (తరుగు బాగా పడే) వాటికి బీమా అనవసరం. అగ్ని ప్రమాదం జరిగితే హెచ్చరించి, అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే, అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసే పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. స్వయం ఉపాధిలోని నిపుణులు లేదా వ్యాపారులు అయితే హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. వేతన జీవులకు ఈ వెసులుబాటు లేదు. ఏడాదికి కాకుండా, ఏడాదికి మించి ఎక్కువ కాలానికి పాలసీ తీసుకుంటే ప్రీమియంలో 10 శాతం తగ్గింపు వస్తుంది. -
విపత్తులు సరే... నివారణ ఎలా?
ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏటా 560 ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అంచనా. అంటే రెండు రోజులకు మూడు విపత్తులన్నమాట! వీటి పరిధి, తీవ్రత కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఆసియా, ప్రత్యేకించి దక్షిణాసియా ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ బాధితురాలిగా ఉంటున్నందున, భారత్ ఈ ఆకస్మిక విపత్తుల పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే ప్రకృతి విపత్తు ప్రమాద సూచికలో అత్యధిక స్థాయిల సమాచారాన్ని నమోదుచేసే నాలుగో అతిపెద్ద దేశం భారతదేశమే. ఈ సూచికకు సంబంధించి భారత్ స్కోర్ 7.7గా ఉంది. దేశ జనాభాలో 32 శాతంమంది జాతీయ దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారన్న వాస్తవం మర్చిపోకూడదు. మునుపటి అయిదేళ్ల కాలంకంటే ప్రస్తుత అయిదేళ్ల కాలంలోనే ఎక్కువ మంది ప్రజలు చనిపోయారు లేదా విపత్తుల బారిన పడ్డారు. విపత్తుల ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, లేదా అంచనా వేయడంలో సమకాలీన పద్ధతులు యథాతథ స్థితినే తరచుగా పరిగణిస్తున్నాయి తప్ప వ్యవస్థల్లో ప్రమాదాలు ఎలా రూపొందుతున్నాయి అనే అంశాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు, కోవిడ్–19 నేప థ్యంలో అహ్మదాబాద్ ఓల్డ్ సిటీలో, ఒకే గది ఉన్న ఇంట్లో నివసిస్తున్న వారు లేదా ఒకే ఇంట్లో అయిదుమందికి పైగా నివసిస్తున్న వారే ఎక్కువగా కరోనా వైరస్ని వ్యాపింపజేస్తున్నట్లు కనిపించింది. ఇవి చారిత్రక, సామాజికార్థిక వాస్తవికతలు. కాబట్టి, సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించకపోతే, ఇలాంటి ఆకస్మిక వ్యాధులు పదేపదే పునరావృతమవుతూ ఒకేరకమైన పర్యవసానాలకు దారి తీస్తుంటాయి. దీనికి సంబంధించి విధాన నిర్ణేతలు– సామాజిక, ఆర్థిక దౌర్బల్యాలకు వెనుక గల సమకాలీన, చారిత్రక కారణాలను పరిశోధించాలి. విపత్తు ప్రమాద తగ్గింపుపై అంతర్జాతీయ అంచనా నివేదిక, కోవిడ్–19 ప్రపంచం ముందు సంధించిన సవాలును చర్చిస్తూనే ఆరోగ్య వ్యవస్థలలో ఉనికిలో ఉన్న దుర్బలత్వాలని మహమ్మారి ఎత్తిచూపిన కోణాన్ని ప్రపంచానికి గుర్తు చేసింది. అంతకుమించి అది అసమా నత్వం, నిరుద్యోగితను బలంగా ప్రదర్శించి చూపింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో విద్య, పోషకాహారం, ఆహార భద్రత వంటి విషయాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. మహమ్మారి వ్యవస్థీకృత ప్రభావాలు, దాని క్రమాలను భారత్లోని ప్రపంచ చారిత్రక నగరమైన అహమ్మదాబాద్ ఓల్డ్ సిటీలో నిర్వహించిన తాజా నివేదిక (2022) వెల్లడించింది. శరవేగంతో జరుగుతున్న పట్టణీకరణ ప్రమాదాలను ఈ నివేదిక ఎత్తిచూపింది. పట్టణీకరణ వేగ ప్రక్రియే వాతావరణ మార్పు ప్రభావాలకు ప్రజలను బలిజీవులుగా మారుస్తోందని నివేదిక తెలిపింది. తీర ప్రాంతంలోని అతిపెద్ద నగరాల్లో జనాభా సాంద్రీకరణ కారణంగా సముద్ర మట్టాల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. ఐపీసీసీ తాజా నివేదిక ప్రకారం 2006 నుంచి సగటు సముద్ర మట్టం పెరుగుదల రేటు సంవత్సరానికి 3.7 మిల్లీ మీటర్లుగా ఉంటోందని వెల్లడయింది. ఈ లెక్కన 2100 నాటికి 20 కోట్లమంది ప్రజలు దీని ప్రభావానికి గురవుతారని ఈ నివేదిక తెలుపుతోంది. ఆసియా ప్రజలే ప్రధానంగా దీని బారిన పడనున్నారని, ప్రత్యేకించి చైనాలో (4 కోట్ల 30 లక్షల మంది), బంగ్లాదేశ్లో (3 కోట్ల 20 లక్షలమంది), భారతదేశంలో (2 కోట్ల 70 లక్షలమంది) దీని ప్రభావానికి గురవుతారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే, 2015 నుంచి 2030 నాటికి, ప్రతి సంవత్సరం విపత్తుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మేరకు పెరగవచ్చు. ఇక కరువుల విషయానికి వస్తే 2001 నుంచి 2030 నాటికి 30 శాతం పెరుగుతాయని ప్రస్తుత ధోరణులు సూచిస్తున్నాయి. అలాగే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు సంభవిస్తున్న ఘటనల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. విపత్తుల వల్ల ఎక్కువమంది దెబ్బ తినడమే కాకుండా, దారిద్య్రం కూడా పెరుగుతుంది. 1990లలో విపత్తుల వల్ల ఆర్థిక నష్టాలు సగటున 70 మిలియన్ డాలర్లమేరకు సంభవించగా, 2020 నాటికి సంవత్సరానికి 170 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఆర్థిక నష్టాలకు సంబంధించి బహుశా 40 శాతానికి మాత్రమే బీమా సౌకర్యం ఉంది. అయితే ఈ బీమా రక్షణ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోనే చాలావరకు కేంద్రీ కృతం అయింది. (చదవండి: ఎంత వేసవైనా ఇంత వేడేమిటి!) వాతావరణ అత్యవసర పరిస్థితి, కోవిడ్–19 మహమ్మారి వ్యవస్థీకృత ప్రభావాలు ఒక కొత్త వాస్తవికతను ముందుకు తీసుకొచ్చాయి. ఇలాంటి అనిశ్చిత ప్రపంచంలో, నిజమైన, నిలకడైన అభివృద్ధిని సాధించటానికి నష్టభయాన్ని అవగాహన చేసుకోవడమే ప్రధానం. భవిష్యత్తు షాక్లకు వ్యతిరేకంగా ఉత్తమమైన రక్షణ ఏమిటంటే, ఇప్పుడు వ్యవస్థలను పరివర్తన చెందించి, వాతా వరణ మార్పు, తదితర అవరోధాలను పరిష్కరిస్తూ స్థితిస్థాపకతను నిర్మించుకోవడమే. హానికర పరిస్థితులను తగ్గించి, విపత్తులవైపు నెట్టే అసమానత్వాన్ని తగ్గించే ప్రయత్నం కూడా దీంట్లో భాగమే. ఇలా చేయగలిగితేనే కార్యాచరణ సాధ్యం అవుతుంది. (చదవండి: సామాజిక పరివర్తనే సంఘ్ లక్ష్యం) తప్పుల నుంచి నేర్చుకోవడానికీ, అనిశ్చితి పట్ల మరింత స్పష్టంగా కమ్యూనికేట్ కావడం ఎలాగో తిరిగి అంచనా వేసుకోవడానికీ పాలనా వ్యవస్థలు లక్ష్యాల సాధనకు అవసరమైన పద్ధతులను తక్షణం అలవర్చు కోవాలి. పాలనా వ్యవస్థలు తప్పుడు విషయాలను మదిస్తూ వాటి విలువను లెక్కిస్తున్నాయి. మానవ మనస్సు – వ్యవస్థలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయి, ఉత్పత్తి – సేవలు ఎలా పనిచేస్తాయి, నష్టభయాన్ని అర్థం చేసుకుని వాటిని నిర్వహించడంలో ప్రస్తుత పద్ధతులు ఎలా విఫలమయ్యాయనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రభావిత ప్రజలతో సంప్రదింపుల ద్వారా మన పాలనా, ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడం అవసరం. - డాక్టర్ జ్ఞాన్ పాఠక్ ప్రసిద్ధ కాలమిస్ట్ -
బస్సుల్లో భద్రత డొల్ల
⇒ ఇష్టారాజ్యంగా తిప్పుతున్న ప్రైవేటు బస్సులు ⇒ ఆదాయమే ముఖ్యం ⇒ ప్రయాణం గాలిలో దీపం ⇒ రిజిస్ట్రేషన్ ఒక చోట.. తిప్పేది మరోచోట ⇒ అవసరాలను బట్టి రెట్టింపు చార్జీల వసూలు ⇒ అధికార పార్టీ నాయకుల అండతో నిబంధనలకు తిలోదకాలు ⇒ పెద్దల ఒత్తిడితో చోద్యం చూస్తున్న రవాణా శాఖాధికారులు తిరుపతి క్రైం : ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల దూకుడు తగ్గడం లేదు. ఘోర ప్రమాదాలు జరిగినా కనువిప్పు కలగడం లేదు. కనీస జాగ్రత్తలు పాటించకుండా చట్టవ్యతిరేకంగా రాకపోకలు సాగి స్తున్నా అ«ధికారులు అడ్డుకట్ట వేయడంలేదు. తాజాగా కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద అదుపుతప్పి కల్వర్టులో పడిపోయింది. ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రైవేటు బస్సుల ప్ర యాణమంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు నామమాత్రమే నంటూ ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ అధికార పార్టీ నేతలవే కావడం వల్ల రవాణా శాఖాధికారులు ఈబస్సులపై కన్నెత్తి చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ బస్సుల్లో ప్రయాణం గాలిలో దీపంలా మారింది. జిల్లాలో కండీషన్ లేని బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బస్సుల యజమానులు ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్లు లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారు. సీజన్ను బట్టి ప్రయాణికులు రద్దీగా ఉంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప రక్షణపై కనీస శ్రద్ధ చూపడం లేదు. ఒకరోజు డ్రైవర్ లేక బస్సు ఆగితే వేలాది రూపాయలు ఆదాయం పోతుందని లైసెన్స్ లేని డ్రైవర్లను దూర ప్రాంతాలకు పంపుతున్నారు. అనుమతులు లేకున్నా అంతర్ రాష్ట్ర సర్వీస్లని భారీగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు రవాణా సంస్థలు ఆదాయమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. నిత్యం తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాలకు వోల్వా బస్సులు, ఇతర ప్రైవేటు బస్సులు కలిపి సుమారు 80కిపైగా నడుస్తున్నాయి. వీటిలో ఎక్కువ బస్సులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల రిజిస్ట్రేషన్ కు చెందినవే ఉన్నాయి. పన్నుల భారం తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నారు. నాయకులే కొండంత అండ విజయవాడ, అనంతపురం ప్రాంతాలకు చెందిన అ«ధికార పార్టీ లోక్సభ సభ్యులు ట్రావెల్స్ వ్యాపారానికి పెద్ద దిక్కుగా ఉంటున్నారు. వారిద్దరూ రాష్ట్రంలోని ప్రముఖ ట్రావెల్స్కు యజమానులుగా ఉన్నారు. వ్యాపారలోకానికి నాయకులు కొండంత అండగా ఉండడంతో తమకు అడ్డు పడేది ఎవరని ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు మీసాలు మెలివేస్తుండడం గమనార్హం. దురుసు డ్రైవింగ్తో ప్రమాదాలు డ్రైవర్ల దురుసుతనంతో ప్రమాదాలు జరిగినట్టు పలు పరిశోధనల్లో తేలింది. సర్వేలు కూడా అదే విషయం స్పష్టం చేస్తున్నాయి. డ్రైవర్లు బాధ్యతతో మెలగాలని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా తీరు మారడంలేదు. డ్రైవర్ల కొరతతో యజమానులు లైసెన్స్ ఉంటే చాలు ఎటువంటివారికైనా ఉద్యోగాలు ఇస్తున్నారు. పనితీరు, గతంలో ప్రమాదాలతో సంబంధాలపై ఆరా తీయడంలేదు. ప్రతి నెల రవాణా అధికారులు డ్రైవర్లకు అవగాహన కల్పించాలని ఆంక్షలున్నా అమలు కావడంలేదు. కలవరపరుస్తున్న వంతెనలు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వంతెనలు, కల్వర్టులు ప్రయాణికులను కలవరపరుస్తున్నాయి. వంతెనలు నిర్మించిన అనంతరం కనీసం పక్కన పిట్టగోడలు కూడా నిర్మించడం లేదు. కొన్నిచోట్ల వాటిని గుర్తించేందుకు సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడంలేదు. కనీస నిబంధనలు కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. అధికస్థాయిలో ప్రమాదాలు ఇలాంటి ప్రాంతాల్లోనే చోటుచేసుకుటుండడం గమనార్హం. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తిరుపతి నుంచి నడిచే ప్రైవేటు వోల్వో బస్సులు 45 సాధారణ బస్సులు 24 రోజూ ప్రయాణించేవారు 3,800మంది
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
పార్థుని ఎదుటే ‘తమ్ముళ్ల’ ముష్టి యుద్ధం
ప్రత్యేక పరిశీలకుడితో జిల్లా ఎన్నికల అధికారి భేటీ
సినీ ఫక్కీలో నగదు అపహరణ
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం
No Headline
అనంతపురం డీఐజీ బదిలీ
రాప్తాడులో మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
తమ్ముళ్లకు ఓటమి భయం
ముస్లింలే వారి టార్గెట్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement