-
బ్లాక్స్టోన్ చేతికి కేర్ హాస్పిటల్స్ - వివరాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ తాజాగా హైదరాబాద్కు చెందిన కేర్ హాస్పిటల్స్లో మెజారిటీ వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. టీపీజీ రైజ్ఫండ్స్లో భాగమైన ఎవర్కేర్ హెల్త్ ఫండ్ నుంచి 72.5 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు మొత్తం మీద 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,827 కోట్లు) వెచ్చిస్తున్నట్లు వివరించింది. ఈ లావాదేవీ కోసం కేర్ హాస్పిటల్స్ సంస్థ విలువను రూ. 6,600 కోట్లుగా లెక్కగట్టారు. మరోవైపు, కేరళకు చెందిన కిమ్స్హెల్త్ సంస్థలో కేర్ హాస్పిటల్స్, టీపీజీ 80 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ కింద బ్లాక్స్టోన్ 300 మిలియన్ డాలర్లు, టీపీజీ 100 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు వివరించాయి. దీంతో బ్లాక్స్టోన్ దేశీయంగా ఆరోగ్య సేవల విభాగంలోకి ప్రవేశించినట్లవుతుంది. ఈ రెండు డీల్స్ ద్వారా మొత్తం 1 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. సంయుక్త నెట్వర్క్లో టీపీజీ చెప్పుకోతగ్గ స్థాయిలో వాటాలున్న మైనారిటీ షేర్హోల్డరుగా ఉంటుంది. భారత హెల్త్కేర్ సర్వీసుల రంగంలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టడం, దేశీయంగా అతి పెద్ద హెల్త్కేర్ నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు టీపీజీతో జట్టు కట్టడం తమకు సంతోషకరమైన అంశాలని బ్లాక్స్టోన్ ఎండీ గణేష్ మణి తెలిపారు. భారీ హాస్పిటల్స్ నెట్వర్క్లో ఒకటిగా.. కేర్ హాస్పిటల్స్కు హైదరాబాద్, వైజాగ్తో పాటు ఔరంగాబాద్, నాగ్పూర్ తదితర నగరాల్లో ఆస్పత్రులు ఉన్నాయి. కిమ్స్ హెల్త్కేర్ మేనేజ్మెంట్ సంస్థ .. కేరళలోనే అతి పెద్ద ప్రైవేట్ హెల్త్కేర్ ప్రొవైడర్గా ఉంది. కిమ్స్హెల్త్ చేరికతో దేశీయంగా భారీ హాస్పిటల్స్ చెయిన్లో ఒకటిగా కేర్ హాస్పిటల్స్ నెట్వర్క్ ఆవిర్భవించనుంది. ఈ సంయుక్త నెట్వర్క్కు 11 నగరాల్లో 23 ఆస్పత్రులు, 4,000 పైచిలుకు పడకలు ఉంటాయి. ప్రస్తుతం కిమ్స్హెల్త్కు నేతృత్వం వహిస్తున్న ఎంఐ సహాదుల్లా ఇకపైనా దాని సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు. -
Disney: డిస్నీ కొనుగోలుకు బ్లాక్స్టోన్తో చర్చలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్స్టోన్.. భారతదేశంలోని వాల్ట్డిస్నీ స్ట్రీమింగ్, టెలివిజన్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. వాల్ట్ డిస్నీ ఇండియాలోని తన కార్యకలాపాలను విక్రయించేందుకు గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్అంబానీతోపాటు ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే భారత మార్కెట్పై ఆసక్తి ఉన్న బ్లాక్స్టోన్.. డిస్నీ కొనుగోలుకు సిద్ధం అవుతుదని నివేదిక తెలుపుతుంది. ఒకవేళ బ్లాక్స్టోన్తో ఈ ఒప్పందం కుదరకపోయినా డిస్నీ భారతదేశంలో తన డిజిటల్, టీవీ వ్యాపారాన్ని విక్రయించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకా బ్లాక్స్టోన్, డిస్నీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. డిస్నీ సబ్స్క్రైబర్ అట్రిషన్ను ప్రభావం చేసేలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా స్మార్ట్ఫోన్లో ఉచిత క్రికెట్ కంటెంట్ను అందించడంతో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తుంది. -
బ్లాక్స్టోన్ చేతికి సింప్లిలెర్న్
న్యూఢిల్లీ: ఆధునిక తరం డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసే సింప్లిలెర్న్ సొల్యూషన్స్లో పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ మెజారిటీ వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ విలువ 25 కోట్ల డాలర్లు(రూ. 1,860 కోట్లు)కాగా.. ఎడ్యుటెక్ కంపెనీ సింప్లిలెర్న్లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన కలారి క్యాపిటల్, హెలియన్ వెంచర్ పార్ట్నర్స్, మేఫీల్డ్ ఫండ్ ఉమ్మడిగా 60 శాతం వాటాను విక్రయించనున్నాయి. అంతేకాకుండా మరో 10 శాతం వాటాను ప్రమోటర్లు, ఇతర యాజమాన్య వ్యక్తులు విక్రయించనున్నారు. వెరసి కంపెనీ విలువను 40 కోట్ల డాలర్ల(రూ. 2,976 కోట్లు)కు చేరింది. పలు కంపెనీలలో దేశీయంగా బ్లాక్స్టోన్గ్రూప్ ఇప్పటికే బైజూస్, ఆకాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, అసెండ్ లెర్నింగ్, ఎల్యుషియన్ అండ్ ఆర్టిక్యులేట్లలో ఇన్వెస్ట్ చేసింది. అయితే తొలిసారి సింప్లిలెర్న్లో మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా యాజమాన్య నియంత్రణను చేపడుతోంది. కాగా.. కంపెనీ నిర్వహణ బాధ్యతను కొనసాగించనున్నట్లు సింప్లిలెర్న్ సీఈ వో కృష్ణ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. లాభాలతో.. 2010లో ప్రారంభమైన సింప్లిలెర్న్ గత నాలుగేళ్లుగా లాభాలను ఆర్జిస్తోంది. తొలి దశ నుంచి మధ్యస్థాయి వృత్తి నిపుణుల వరకూ 100 రకాల ప్రోగ్రామ్స్ను కంపెనీ అందిస్తోంది. తద్వారా కొత్త తరం డిజిటల్ నైపుణ్యాల మెరుగులో సహకరిస్తోంది. దీనిలో భాగంగా క్లౌడ్, డెవాప్స్, డేటా సైన్స్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ తదితర శిక్షణను సమకూర్చుతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా వృత్తి నిపుణులు సింప్లిలెర్న్ ప్లాట్ఫామ్ను వినియోగించుకుంటున్నారు. పలు దేశ, విదేశీ యూనివర్శిటీలతో కంపెనీ సహకార ఒప్పందాలను కలిగి ఉంది. -
వినతీ కొత్త రికార్డ్- ఎస్సెల్ ప్రొ పతనం
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా రంగ కంపెనీ వినతీ ఆర్గానిక్స్ కౌంటర్కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. అయితే మరోవైపు పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ వాటాను విక్రయించనున్నట్లు వెల్లడికావడంతో ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి వినతీ ఆర్గానిక్స్ షేరు భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ఎస్సెల్ ప్రొప్యాక్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు ఇలా.. వినతీ ఆర్గానిక్స్ లాక్డవున్ల నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జోరందుకున్న వినతీ ఆర్గానిక్స్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత వినతీ షేరు 5 శాతం జంప్చేసి రూ. 1355ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 1325 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లోనే వినతీ షేరు 36 శాతం దూసుకెళ్లడం విశేషం! ఈ ఏడాది క్యూ1లో నికర లాభం 12 శాతమే క్షీణించి రూ. 72 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా తగ్గి రూ. 232 కోట్లకు చేరింది. అయితే ఇబిటా మార్జిన్లు 0.7 శాతం బలపడి 42 శాతంగా నమోదయ్యాయి. క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలు ఈ కౌంటర్కు జోష్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎస్సెల్ ప్రొప్యాక్ లామినేటెడ్ ట్యూబ్స్ ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్లో మెజారిటీ వాటా కలిగిన బ్లాక్స్టోన్ సంస్థ ఎప్సిలాన్ బిడ్కో 23 శాతం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సెల్ ప్రొప్యాక్లో ఎప్సిలాన్కు 75 శాతం వాటా ఉంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. బ్లాక్డీల్స్ ద్వారా 7.25 కోట్ల షేర్లను బ్లాక్స్టోన్ సంస్థ విక్రయించనున్నట్లు వివరించాయి. తద్వారా బ్లాక్స్టోన్ రూ. 1850 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎస్సెల్ ప్రొప్యాక్ షేరు 6.25 శాతం పతనమై రూ. 256 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252 దిగువకూ చేరింది. కాగా.. నేటి ట్రేడింగ్లో తొలి గంటన్నరలోనే బీఎస్ఈలో 7.68 కోట్లకుపైగా షేర్లు చేతులు మారినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 22,400 షేర్లు మాత్రమేకావడం గమనార్హం. తద్వారా బ్లాక్స్టోన్ గ్రూప్ 23 శాతం వాటాను విక్రయించినట్లు చెబుతున్నారు. -
బ్లాక్స్టోన్తో ‘ప్రెస్టీజ్’ మెగా డీల్!
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ గ్రూప్ తాజాగా రుణ భారం తగ్గించుకునేందుకు, భవిష్యత్ వృద్ధి ప్రణాళికల్లో భాగంగా వివిధ వాణిజ్య అసెట్స్ను విక్రయించే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్స్టోన్తో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 12,000 కోట్ల నుంచి రూ.13,500 కోట్ల దాకా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ భారీ ఒప్పందం ప్రస్తుత త్రైమాసికంలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రెస్టీజ్ ఎస్టేట్ సుమారు 8 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ పార్క్లు (నిర్మాణం పూర్తయినవి), దాదాపు 4 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న తొమ్మిది మాల్స్ (ఇప్పటికే కార్యకలాపాలు జరుగుతున్నవి) విక్రయించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక నిర్మాణంలో ఉన్న మరో 3–4 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ ప్రాజెక్టుల్లో 50 శాతం దాకా వాటాలను కూడా విక్రయించవచ్చని వివరించాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఈ అసెట్స్ ఉన్నాయి. మొత్తం 16 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ పార్కులు, తొమ్మిది మాల్స్, రెండు హోటళ్లతో కలిపి ఉన్న పోర్ట్ఫోలియో విలువ దాదాపు 1.6–1.8 బిలియన్ డాలర్ల మేర ఉండవచ్చని పేర్కొన్నాయి. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి.. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రుణభారం ప్రస్తుతం రూ. 8,000 కోట్ల స్థాయిలో ఉంది. ప్రతిపాదిత లావాదేవీ ద్వారా వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని రుణాలను తీర్చివేసేందుకు కంపెనీ ఉపయోగించనుంది. అలాగే, భవిష్యత్ వృద్ధి అవకాశాల కోసం మిగతా నిధులను వినియోగించనుంది. భారీ విలువ డీల్..: ఒకవేళ ప్రెస్టీజ్ గ్రూప్, బ్లాక్స్టోన్ మధ్య డీల్ కుదిరితే రియల్టీలో వేల్యుయేషన్పరంగా అత్యంత భారీ ఒప్పందంగా నిలవనుంది. కొన్నాళ్ల క్రితం డీఎల్ఎఫ్ తమ కమర్షియల్ పోర్ట్ఫోలియోలో 33% వాటాను సింగపూర్ సార్వభౌమ ఫండ్ జీఐసీకి రూ. 9,000 కోట్లకు విక్రయించింది. అమెరికాకు చెందిన బ్లాక్స్టోన్ ఇప్పటిదాకా భారత రియల్ ఎస్టేట్ రంగంలో 8 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement