Top Stories
ప్రధాన వార్తలు
టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అన్నమయ్య జిల్లా: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసిందన్నారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.అవ్వాతాతలకు ఇంటివద్దకే అందే పెన్షన్ను ఆపిన దుర్మార్గుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. మీ బిడ్డకు(జగన్) మంచి పేరు వస్తుందనే బాబు పెన్షన్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. తన మనిషిని నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పనెన్షన్ను అడ్డుకున్నాడని.. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తన కుట్రలను మనపై నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పూర్తి ప్రసంగంఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్.జగన్కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు.చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే.పొరపాటున బాబుకు ఓటేస్తే..పసుపుపతి నిద్రలేస్తాడు.వదల బొమ్మాళి అంటూ పేదల రక్తం తాగుతాడు..బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పెట్టుబడి సాయం కింద బాబు ఏనాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు.బాబు ఏనాడైనా రైతుభరోసా కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా.14 ఏళ్లలో బాబు ఏనాడు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు..చేశాడా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?అక్కాచెల్లెమ్మలను మోసం చేసి రోడ్డుపై నిలబెట్టాడుఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?గర్భిణీ స్త్రీలకు రూ. 10 వేలు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?గ్యాస్ సిలిండర్పై రూ. 100 సబ్సిడీ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు.. విడిపించాడా?ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?మీ బిడ్డ జగన్ రైతన్నకు అండగా నిలబడ్డాడు.పెట్టుబడి సాయం కింద మీ బిడ్డ ప్రతియేటా రూ. 13, 500 ఇచ్చాడు.జగన్కు, చంద్రబాబుకు ఉన్న తేడా గమనించండని కోరుతున్నా.అక్కా చెల్లెమ్మలకు మీ బిడ్డ జగన్ తోడుగా ఉన్నాడుఅక్కాచెల్లెమ్మల కోసం మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చా.అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ఆదుకున్నాం.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఆబీసీ నేస్తం తీసుకొచ్చా.31 లక్షల ఇళ్లపట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్.ఇంటి వద్దకే అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తున్నాం.పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ, ,500లకు పెంచుకుంటూ పోతాం.14 ఏళ్లలో చంద్రబాబు ఏనాడైనా పెన్షనర్లను పట్టించుకున్నాడా? చంద్రబాబు మోసాలను ఓడించడానికి మీరంతా సిద్ధమేనా.రైతుభరోసాగా ఏడాదికి రూ.16 వేలు.. ఐదేళ్లకు రూ.80 వేలు ఇస్తాడు మీ జగన్.చంద్రబాబు వల్ల రాష్ట్రంలోని మహిళలందరికీ కొన్ని రూ.వేల కోట్ల నష్టం జరిగింది. పిల్లలను బడులకు పంపే తల్లులకు ఇచ్చే అమ్మఒడిని రూ.17 వేలుకు పెంచాం. చంద్రబాబు ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో అలవిగాని హామీలను చూసిన బీజేపీ.. నీ ఫోటో పెట్టుకోగానీ మోడీ గారి ఫొటో మాత్రం పెట్టుకోవద్దని తేల్చి చెప్పేసింది. ముగ్గురున్న కూటమిలో కనీసం ఆ ముగ్గురి ఫొటోలు కూడా మేనిఫెస్టోలో పెట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో మన… pic.twitter.com/SrcrNnBYWQ— YS Jagan Mohan Reddy (@ysjagan) April 30, 2024
బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుంది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.మోదీ, నడ్డా, అమిత్, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ టీడీపీ చెప్పింది. మీడియాను మూడు పార్టీల మేనిఫెస్టో అంటూ పిలిచారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు.మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఒప్పుకోలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. హామీలు అమలు కాకపోవడంతో మోదీకి చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వద్దని గట్టిగా చెప్పడంతోనే మోదీ ఫొటో పెట్టేందుకు చంద్రబాబు సాహసించలేదు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఆ విషయంలో బీజేపీ, టిడిపి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు బీజేపీ అధికారికంగా దూరం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
ఉత్తర్ప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట అమేథీ లోక్సభ అభ్యర్ధి ఎవరనేది స్పష్టత రాలేదు. అయితే అభ్యర్థి ప్రకటన కోసం ఎదురు చూసి విసిగిపోయిన కార్యకర్తలు అమేథీ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో పార్టీ కార్యలయం బయట అభ్యర్ధిని ప్రకటించాలని ప్లకార్డ్లతో నిరసన చేపట్టారు. అమేథీ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్మృతి ఇరానీ 4,68,514 ఓట్లు సాధించగా, రాహుల్ గాంధీ 4,13,394 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఈ సారి ఎన్నికల్లో మరోసారి తాను గెలుస్తామంటూ స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేయలేదు. అమోథీ, వయనాడ్ ఈ రెండు స్థానాల్లో ఒకచోటే గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని, ఇద్దరూ పోటీ చేస్తారని, అమేఠీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారని ఇలా రకరకాలుగా కాంగ్రెస్ వర్గాల నుంచి లీకులు కొనసాగుతున్నాయి.మరో రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతుండగా.. సహనం కోల్పోయిన కార్యకర్తలు తమ లోక్సభ స్థానానికి అభ్యర్ధిని ప్రకటించాలని ఆందోళన చేపట్టడం ఆసక్తికరంగా మారింది.
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో మంగళవారం (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అదరగొట్టారు.డూ ఆర్ డై లా జరిగిన మ్యాచ్లో ముంబై కేవలం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు ముంబైకి చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు కూడా రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా ముంబై జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. దాంతో పాయింట్ల జాబితాలో లక్నో మూడో స్ధానానికి చేరింది. ఇక ప్లే ఆఫ్ అవకాశాలు ముంబై జట్టు దాదాపు కోల్పోయింది.స్కోర్లు: ముంబై 144/7, 145/6(19.2 ఓవర్లు)ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్స్: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్
‘‘జేడీఎస్తో ఇంకా పొత్తెందుకు’’ బీజేపీకి డీకే శికుమార్ ప్రశ్న
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ వెలుగు చూసిన తర్వాత కూడా జేడీఎస్తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తులో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్ కాంగ్రెస్తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్ షా చెప్పాలి’అని డీకే డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్ కార్తిక్ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు.
IPL 2024: పుట్టిన రోజున ఆసక్తికరమైన స్కోర్లు చేసిన రోహిత్
ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ ఇవాళ (ఏప్రిల్ 30, 2024) 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. లక్నో ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ముంబై.. రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ (5) వికెట్ కోల్పోయింది.ఆతర్వాత ముంబై బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. 18 పరుగుల వద్ద సూర్యకుమార్ (10).. 27 పరుగుల వద్ద తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (0) ఔటయ్యారు. 11 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 65/4గా ఉంది. ఇషాన్ కిషన్ (27), నేహల్ వధేరా (11) క్రీజ్లో ఉన్నారు. లక్నో బౌలర్లలో స్టోయినిస్, మొహిసిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ పడగొట్టగా.. తిలక్ వర్మను రవి బిష్ణోయ్ అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. A match on his birthday is not usually a good one for Rohit Sharma.#IPL2024 #RohitSharma pic.twitter.com/Lsi7q7hSr6— CricTracker (@Cricketracker) April 30, 2024 కాగా, పుట్టిన రోజున జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ చెత్త షాట్ ఆడి ఐదు బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. హిట్మ్యాన్ తక్కువ స్కోర్కే పెవిలియన్కు చేరడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొహిసిన్ ఖాన్ బౌలింగ్లో స్టొయినిస్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్కు చేరాడు. అయితే హిట్మ్యాన్ ఔటై పెవిలియన్కు చేరాక ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. రోహిత్ తన పుట్టిన రోజున ఆడిన గత నాలుగు మ్యాచ్ల్లో వరుసగా 1, 2, 3, 4 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ స్కోర్లన్నీ యాదృచ్చికంగా 5 బంతుల్లో చేసినవి కావడం విశేషం. 2014 జన్మదినాన సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 5 బంతుల్లో ఒక్క పరుగు చేసిన రోహిత్.. 2022వ సంవత్సరపు పుట్టిన రోజున రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 5 బంతుల్లో 2 పరుగులు చేశాడు.ఆతర్వాత గతేడాది పుట్టిన రోజున రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 5 బంతుల్లో 3 పరుగులు చేసిన రోహిత్.. 2024వ సంవత్సరపు పుట్టిన రోజున లక్నోతో జరిగిన మ్యాచ్లో 5 బంతుల్లో 4 పరుగులు చేసి ఔటయ్యాడు. బర్త్ డే రోజున రోహిత్ చేసిన స్కోర్లు వరుస క్రమంలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ స్కోర్ల సీక్వెన్స్ చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. 1 (5), 2 (5), 3 (5), 4 (5). ఈ సీక్వెన్స్ చూసిన తర్వాత కొందరు నెటిజన్లు సోషల్మీడియాలో ఇలా కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ వచ్చే ఏడాది బర్త్ డే రోజున 5 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటవుతాడంటూ సెటైర్లు వేస్తున్నారు.
అలాంటి వాటితోనే మరింత భయం: టాలీవుడ్ డైరెక్టర్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని తాజాగా ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రకటించడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోవిషీల్డ్ తీసుకున్నవారు మరింత భయపడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై టాలీవుడ్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. వ్యాక్సిన్పై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. కోవిషీల్డ్ గురించి వస్తున్న వార్తలపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్ భయం కంటే.. ఇలాంటి సగం సగం నాలెడ్జ్ కథనాలతో కలిగే ఒత్తిడి మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా దెబ్బతీస్తుందని తెలిపారు. ఇలాంటి వార్తలను అస్సలు పట్టించుకోవద్దని.. ప్రశాంతంగా, సరదాగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అంతే కాకుండా వ్యాక్సిన్ ప్రభావం గురించి ఓ క్లిప్ను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ ఏడాది శైలేశ్ కొలను తెరకెక్కించిన సైంధవ్ సంక్రాంతి రిలీజైన సంగతి తెలిసిందే. For people who have been terrified after the news about Covishield broke out. The stress from all the memes and half baked articles will damage you more than anything else. Stay calm and have fun. pic.twitter.com/DGgxn4mGXG— Sailesh Kolanu (@KolanuSailesh) April 30, 2024
దొంగ హామీల ‘చంద్రబాబు’.. బీజేపీకి అర్థమైపోయింది: పేర్ని నాని
సాక్షి, మచిలిపట్నం: చంద్రబాబు, పవన్ చెప్పే మాటలు అమలయ్యేవి కావని బీజేపీకి అర్థమైపోయిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘అరచేతిలో వైకుంఠం చూపించే మాటలని కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడు. కూటమి మేనిఫెస్టోలో కనిపించింది మూడు కాదు.. రెండు ఫొటోలే. కూటమి సర్కస్ మొదలైంది’’ అంటూ ఎద్దేవా చేశారు.‘‘చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసింది. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారు?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.‘‘2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారు.. ఇప్పుడెందుకు కలిశారు. కళకళలాడుతుండే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయి. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే:⇒బాబూ...నీలో నిజాయితీ ఉంటే 2014 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశావో చెప్పు⇒జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన తీరు చూడండి. 2019లో నా మేనిఫెస్టో ఇదిగో.. దీనిలో 99 శాతం నేను అమలు చేశానని ధైర్యంగా చెప్పారు.⇒రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ..ఎన్ని ఇబ్బందులున్నా ఏటా రూ.71 వేల కోట్లు నేను పేదల కోసం ఖర్చు పెట్టానని చెప్పారు.⇒రెండు గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం చెప్పిన చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ అదేమీ చెప్పలేకపోయాడు. ⇒చంద్రబాబునాయుడు నిజంగా నిజాయితీపరుడైతే 2014లో మూడు పార్టీలు కలిసి సంతకం పెట్టి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమేమి అమలు చేశాడో చెప్పాల్సింది. ⇒ఇళ్లు లేని ప్రతి పేదవానికీ 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాం..ఎవరికన్నా ఇచ్చాడా? ఎన్ని లక్షల మందికి ఇచ్చాడు? ⇒ఇంట్లో ఆడపిల్ల పుడితే ప్రతి ఆడపిల్లకు రూ.25వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అన్నాడు. ఎంత మందికి చేశారు? ⇒డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తీసుకున్న రూ.14వేల కోట్లు బేషరతుగా రుణమాఫీ చేస్తాం అన్నారు. చేశారా? రైతులకు రూ.85 వేల కోట్ల అప్పులను తీర్చి బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని కూడా తెప్పిస్తానన్నారు. ఎంత మందికి చేశారు?⇒పాత మేనిఫెస్టో చూపించి ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడారా?⇒అదే ముగ్గురం మేం మళ్లీ వస్తున్నాం...ఇన్ని హామీలిచ్చాం..ఇన్ని నెరవేర్చాం..మళ్లీ హామీలు ఇస్తున్నాం..అని చెప్పే సత్తా లేకపోయింది⇒ఇదే మోసగాళ్లు ఈ రోజు మాట్లాడిన మాటలు కూడా మనం చూశాం⇒ఇప్పుడొచ్చి నేను పంచాయతీరాజ్ వ్యవస్థను ఉద్దరిస్తానంటున్నాడు. 2014–19 మధ్యలో ఆ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఎవరు? ⇒పంచాయతీల్లో సర్పంచ్లు, పాలకవర్గం ఉండగా..అధికారమంతా జన్మభూమి కమిటీలకు ఇచ్చి ఏ పథకం కావాలన్నా వారు టిక్ పెడితేనే కాని ఇవ్వకుండా ఆ పంచాయతీలను సర్వనాశనం చేసింది ఎవరు?మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు?⇒నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే బీజేపీతో కలిశాను అని చంద్రబాబు చాలా గర్వంగా చెప్పాడు. ⇒ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి నువ్వేం ఇచ్చావ్..? ⇒ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? విభజన హామీల గురించి ఏమైనా రాశావా? ⇒కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా రాశావా? విశాఖ స్టీల్స్ను అమ్మేయకుండా నిలబెడతాం అని ఏమైనా రాశారా? ⇒మరి మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు? ⇒కేవలం అధికారం కోసమే మీరు ముగ్గురు జట్టు కట్టారు. ⇒ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది మీ మేనిఫెస్టోలో ఏముంది? ⇒2019లో మీరంతా తిట్టుకున్నారు కదా.? నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ ఒకరినొకరు తిట్టుకున్నారు కదా!⇒మీకు మీరే ఒకర్ని ఒకరు దొంగలు అన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు?⇒అదేమంటే జనం కోసమే మేం ముగ్గురం కలిశాం అంటారు. మీరిచ్చిన మేనిఫెస్టోలో జనం కోసం ఏముంది? ⇒జగన్ అమ్మ ఒడి రూ.15వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.20వేలిస్తానంటాడు. ⇒జగన్ మహిళలకు చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా పెంచి ఇస్తానంటాడు. ⇒జగన్ మత్స్యకారులకు రూ.10 వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.15వేలు ఇస్తానంటాడు.⇒ ఇదే హామీలను 2014లో కూడా ఇచ్చారు కదా? అవేమయ్యాయి? ⇒ ఈ మేనిఫెస్టోలో 90 శాతం జగన్ గారి మేనిఫెస్టోను కాపీ కొట్టారు. 10 శాతం కర్నాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారు.⇒జగన్ ఆదాయం గురించి చెప్పిన విధంగా మీకు చెప్పే దమ్ముందా? ⇒ మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత..నేను ఖర్చు పెట్టింది ఎంత అని స్పష్టంగా జగన్ చెప్పారు. ⇒ ఇన్ని కష్టాలు పడి జగన్ గారే రూ.71 వేల కోట్లు ఏటా ఖర్చు చేశారు. ⇒ మీ మేనిఫెస్టో ప్రకారం ఏటా రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాలి. ⇒ 2014లో మూడు సెంట్లు స్థలం ఇస్తానని ఇవ్వకుండా..ఇప్పుడు రెండు సెంట్లు అంటున్నాడు. ⇒ జగన్ గారు 31 లక్షల మందికి స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్ను గుర్తుపెట్టుకుంటారో అని రెండు సెంట్లు ఇస్తానంటున్నారు. ⇒ పాత మూడు సెంట్లు సంగతి ఏంటి? అది కూడా కలిపి ఐదు సెంట్లు ఇస్తావా? ⇒ పాత మూడు సెంట్లు బాకీ ఉన్నావు కదా? డ్వ్రాక్రా అక్క చెల్లెమ్మలకు రూ.14వేల కోట్లు బాకీ ఉన్నావు కదా? ⇒ నీ మూలంగా పచ్చగా ఉన్న డ్వాక్రా సంఘాలు నాశనం అయ్యాయి కదా?సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రమేమన్నా అక్షయపాత్రా?⇒సరే హామీలిచ్చారు. ఈ హామీలకు ఎంత ఖర్చు అవుతుందని ఖర్చుల వివరాలు కూడా చెప్పాలి కదా? ⇒రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంత ఉంది? నువ్విచ్చిన హామీలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావ్? దొంగనోట్లు ముద్రిస్తావా? ⇒అప్పు తీసుకురాను అంటున్నాడు. మరి అప్పు తేకుండా రాబడి ఎంత?⇒ ఈ రోజుకీ ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్ ఉద్యోగుల పెన్షన్ కలిపి ఏటా రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతోంది.⇒రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పుల ఇన్స్టాల్మెంట్లు, వడ్డీలు అన్నీ కలిపి ఏటా రూ.55 వేలు కట్టాలి.⇒నీకు నిజాయితీ ఉంటే ఎంత ఆదాయం వస్తుంది..ఎలా ఖర్చు చేస్తావు అనేది చెప్పాల్సింది. ⇒అదేమంటే నేను సంపద సృష్టిస్తాను అంటాడు. ఆ సంపదలో నుంచి పథకాలు అమలు చేస్తాడట. ⇒సంపద సృష్టించాలంటే అదేమన్నా అక్షయపాత్రా? లంకెబిందెలా? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ⇒ ఈ పథకాలన్నీ అమలు చేయడానికి నువ్వు డబ్బెక్కడి నుంచి తెస్తావో ప్రజలకు చెప్పాలి కదా? ⇒ 2014లో ఎలాగైతే పచ్చి దగా, మోసం చేశావో..మళ్లీ ఈ మేనిఫెస్టోను అదే దగాతో విడుదల చేశావు.ఎన్డీయేకి 400 సీట్లు దేనికీ..? ఎవరి పౌరసత్వాలు తీసేయబోతున్నారు?:⇒ఎన్డీయేకి 400 సీట్లు కావాలట. దేనికోసం? ఎంత మందిని కాల్చుకు తినడానికి? ⇒ మైనార్టీలను ఈ దేశంలో లేకుండా తరిమేస్తారా? అత్యధిక మెజార్టీ దేనికి మీకు? ⇒ అత్యధిక మెజార్టీ ఇవ్వడం వల్ల మీరు ఏమేం చేయబోతున్నారు? ⇒ ఎవరివైనా పౌరసత్వాలు, ఓట్లు తీసేయబోతున్నారా? ఏం దుడుకు చర్యలు చేయడానికి 400 సీట్లు అడుగుతున్నారు? ⇒ మీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ⇒ నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు జన్మలో ఒక్కసారి కూడా జరగలేదు.⇒ ఎంత సేపు మోసం, దగా. అవసరం ఉన్నప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించడం..అవసరం తీరాక తగలబెట్టేయడం. ⇒ మనిషి అన్నాక వంద మాటలు చెప్తే కనీసం 90 మాటలన్నా అమలు చేయాలి కదా? ⇒ మనిషి అన్నాక కనీసం విశ్వసనీయత ఉండాలి కదా? ⇒ చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ లాంటి వల్లే కదా..దేశంలో, రాష్ట్రంలో రాజకీయ నాయకుల విలువ పోతున్నది? ⇒ అవసరం ఉంటే ఓట్ల కోసం ఎన్ని పచ్చి మోసపు మాటలైనా చెప్తారు అనే భావన ప్రజల్లో ఉన్నది మీలాంటి వాళ్ల వల్లనే.⇒ జగన్ పథకాలు అమలు చేయడానికి నువ్వెందుకు బాబూ?:⇒ మీ మేనిఫెస్టో అన్నీ జగన్ గారి పథకాలే కదా? జగన్ గారి పథకాలు అమలు చేయడానికి మీరు కావాలా? జగనే ఉన్నాడుగా..!⇒ మొన్నటి వరకూ వాలంటీర్లు అమ్మాయిలను అమ్మేస్తున్నారు..మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడు తలుపులు కొడుతున్నారు అన్నారు. ⇒ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాం అన్న వాళ్లు ఇప్పుడు వాళ్లను కొనసాగిస్తాం..పదివేలు గౌరవ వేతనం ఇస్తాం అంటున్నారు. ⇒ మీకు అధికారం ఇస్తే వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారో జనానికి తెలియదా? ⇒ ఈ రోజు చంద్రబాబుకు కొత్తగా ముస్లింలు, మైనార్టీలపై ప్రేమ వచ్చేసింది. ⇒ నీ ఐదేళ్ల పరిపాలనలో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేడు.⇒ అధికారంలో ఉంటే రాజ్యాధికారంలో మైనార్టీలకు వాటా ఇవ్వవు. ⇒ ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు సంక్షేమం చేసేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు.⇒ 2014 మేనిఫెస్టోలో రజకులు, మత్స్యకారులను ఎస్సీలుగా, బోయలను ఎస్టీలుగా, కాపులను బీసీలుగా చేస్తానన్నాడు. ఎవరినన్నా చేశాడా? ⇒ ఎస్సీ వర్గీకరణ చేస్తానంటూ మాల, మాదిగలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.⇒ 1999 నుంచి ఢిల్లీలో చక్రం తిప్పాను అంటావు..ఎస్సీల వర్గీకరణ చేశావా? ⇒ మళ్లీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ఎస్సీల వర్గీకరణ చేస్తానంటున్నాడు.⇒ మొన్నటి వరకూ రజకులకు ఇస్త్రీ పెట్టె ఇస్తానన్నాడు..ఇప్పుడు కరెంట్ ఇస్త్రీ పెట్టె ఇస్తాడట.⇒ మొన్నటి వరకూ వడ్డెరలకు డ్రిల్లింగ్ మిషన్ ఇస్తానన్నాడు. ఇప్పుడు కరెంట్ డ్రిల్లింగ్ మిషన్ ఇస్తాడట. ⇒ చేనేతలకు మరమగ్గాలు ఇస్తాడట. మరి యాదవులకు కూడా కరెంట్ గొర్రెలను ఇస్తావా?⇒ ఎంత సేపూ వెనుకబడిన వర్గాలు చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా కులవృత్తులు చేసుకుంటూనే ఉండాలా? ⇒అసలు ఈ వెనుకబడిన వర్గాలకు చదువు ఎందుకు చెప్పించవు? ⇒ఇంగ్లీషులో చదువు చెప్పించి మీ జీవితాలు బాగుచేస్తానని చెప్పాలి కదా? ⇒ నాయీ బ్రాహ్మణులకు అంతకు ముందు కత్తెర్లు ఇస్తానన్నాడు. ఇప్పుడు ట్రిమ్మర్లు ఇస్తాడట. ⇒వాళ్లకు నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించి దమ్ముగా పెద్దింటి పిల్లలతో పోటీ పడేటట్లు చేయాలి కదా?⇒ఎందుకు ఒక్క రోజన్నా జగన్ గారిలా ఆలోచించలేకపోతున్నావ్..?నీలో నిజాయితీ ఉంటే నీ దగా మేనిఫెస్టోకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు:⇒బుర్రకథ బ్యాచ్లా చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ తయారయ్యాయి. ⇒ఒకరు తానా అంటే మరొకరు తందానా అంటారు. ⇒ చంద్రబాబును నేను చాలెంజ్ చేస్తున్నా. నిజంగా నువ్వు నిజాయితీ గల రాజకీయ నాయకుడివైతే నా సవాల్ను స్వీకరించు.⇒ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత? నువ్వు చెప్పిన ఈ దగా మేనిఫెస్టోకు ఖర్చు ఎంతవుతుందో చెప్పాలి. ⇒ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో చెప్పే నిజాయితీ నీలో ఉందా?⇒అందుకే నువ్వు పింఛన్ 4వేలు ఇస్తానన్నా..జగన్ 3,500 ఇస్తానంటే జనం జగన్వైపే ఉన్నారు. ⇒ 4వేలు చెప్పినా ఇచ్చేది లేదని వాళ్లకి స్పష్టంగా తెలుసు.⇒ జగనంటే ఐదు పదుల నడుస్తున్న నమ్మకం. ⇒ ఈ బుర్రకథ బ్యాచ్ అంటే ఏడున్నర పదుల తిరుగాడే అపనమ్మకం. ⇒ మనకు వయసు ఎంత వచ్చిందనేది కాదు..ఒక్క రోజన్నా నిజాయితీగా బతికామా అన్నదే చూడాలి..⇒ దమ్ముగా జగన్ గారిలా దీనికి ఎంత ఖర్చు అవుతుందో నిజాయితీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ⇒పేదల్లో పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల చదువుల ద్వారానే పోతుందనేది జగన్ గారు గట్టిగా నమ్ముతారు.⇒ అందుకే ఆయన చదువు మీద దృష్టి పెట్టి నాణ్యమైన చదువును అందిస్తున్నారు.⇒ అందుకే ఇప్పటి వరకూ విద్యపై జగన్ గారు రూ.73వేల కోట్లు ఖర్చు చేశారు.⇒ నిజాయితీగా గత ఐదేళ్లలో నేనేం చేశానో మళ్లీ అదే చేస్తాను అని జగన్ చెప్తున్నాడు. దానికి ఎంత గుండె ధైర్యం కావాలి? ⇒ మోసం చేయడానికి ధైర్యం అవసరం లేదు. ఏ వెదవైనా మోసం చేయగలడు.⇒ అమ్మ ఒడి గతంలో కంటే నేను రెండు వేలు పెంచగలను అని చెప్తున్నాడు. చెప్తే నిజాయితీగా అమలు చేయాలి కదా?మోసం చేయడం కంటే చచ్చిపోవడం మేలన్నారు జగన్..!:⇒ పింఛన్ రూ.3,500 ఒకే సారి చెప్పు అంటే లేదంటే లేదన్నాడు జగన్.⇒ దమ్ముగా నేను రూ.3,500 వేలే ఇవ్వగలను. అది కూడా రెండు విడుతల్లో పెంచుతాను అని ఖచ్చితంగా చెప్పాడు.⇒ మోసం చేసే మాటలు చెప్పడం కంటే చచ్చిపోవడం మేలన్నాడు. అలాంటి మోసపు మాటలు నేను చెప్పను అన్నాడు.⇒ అలా చెస్తే ప్రజలు నమ్మకం పెంచుకుంటారు. జగన్ చెప్తే చేస్తాడని ఆశలు పెంచుకుంటారు. అలా మోసం చేయలేను అన్నాడు.⇒ ఈ రాష్ట్రంలో 80 శాతం కుటుంబాలకు మేలు జరిగేలా నేను పరిపాలన చేశానని జగన్ చెప్తున్నారు. ⇒ మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని కూడా దమ్ముగా చెప్తున్న నాయకుడు వైఎస్ జగన్. ⇒ చంద్రబాబుకు అలాంటి ధైర్యం ఉందా? 2014–19లో తానే పరిపాలన చేశాడో అదే పరిపాలన తెస్తానని చెప్పే ధైర్యం, దమ్ము ఉందా? ⇒ 2014–19 మధ్య ప్రజలు మీకు అధికారం ఇస్తే మేం దిక్కుమాలిన పరిపాలన చేశాం అని మీ నోటితో మీరే సాక్ష్యం చెప్తున్నారు.⇒ 2014లో కోటి పేద, మద్యతరగతి కుటుంబాలున్నాయి. ఇంటికో ఉద్యోగం అన్నాడు..లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు.⇒ ఎంత మందికి ఇచ్చారు..కోటి ఉద్యోగాలు ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అయినా ఇచ్చాడా? ⇒ నీ కొడుకు లోకేశ్కు ఉద్యోగం ఇచ్చుకున్నావు తప్ప ఎవరికి ఇచ్చావ్? ⇒ మళ్లీ ఇప్పుడు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాను..లేదంటే 3వేల నిరుద్యోగ భృతి అంటున్నాడు.⇒ అతని మేనిఫెస్టో అంతా పాపాల పుట్ట.. అసత్యాల బొంత.
పుష్ప-2 ఫస్ట్ సింగిల్.. రిలీజ్ టైమ్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ను రిలీజ్ డేట్ అండ్ టైమ్ను ప్రకటించారు మేకర్స్.మే 1వ తేదీన ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024
కేజ్రీవాల్ అరెస్టు: ఈడీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తొలిసారి షాక్ తగిలింది. కేజ్రీవాల్ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది. ఈ ప్రశ్నకు శుక్రవారం సమాధానంతో రావాలని ఈడీ తరపున వాదిస్తున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది. లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడం అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం(ఏప్రిల్30) విచారించింది. అంతకుముందు కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్నాయర్ను ఈడీ 2022లో అరెస్టు చేసిందని, కేజ్రీవాల్ను మాత్రం 2024 దాకా ఆగి ఇప్పుడు అరెస్టు చేసిందన్నారు.ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనేదానిపై క్లారిటీ లేదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ను అరెస్టు చేశారని చెప్పారు. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవకు ఈ కేసులో బెయిల్ వచ్చిందన్న విషయాన్ని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి మొదట్లో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, తర్వాతే మాట మార్చారని వాదించారు.
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
సినిమా
కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన మెహ్రీన్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేందుకు ప్లానే చేసేసింది. అదేనండి మొన్నీ మధ్య 'ఎగ్ ఫ్రీజింగ్' అని హీరోయిన్ మృణాల్ ఠాకుర్ చెప్పిందిగా. ఇప్పుడు దాన్ని మెహ్రీన్ చేసి చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే దీనికి గల కారణాల్ని కూడా చెప్పుకొచ్చింది.'ఎగ్ ఫ్రీజింగ్' అంటే ఏంటి?ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు పెళ్లి లేటుగా చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అందుకే చాలామంది హీరోయిన్లు.. వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరుచుకుని, కావాల్సినప్పుడు పిల్లల్ని కనే ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని 'ఎగ్ ఫ్రీజింగ్' అంటారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు 'ఎగ్ ఫ్రీజింగ్' చేసుకోగా, ఇప్పుడా లిస్టులోకి మెహ్రీన్ చేరింది.(ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక)మెహ్రీన్ ఏమని చెప్పింది?'గత రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా. చివరకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇది నా వ్యక్తిగత విషయం కదా దీన్ని అందరికి చెప్పాలా? వద్దా? అని ఆలోచించాను. కానీ నాలాంటి చాలామంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. పెళ్లి, బిడ్డని కనే విషయంలో వాళ్లు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నేను మాత్రం భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను. దీని గురించి మనం పెద్దగా మాట్లాడట్లేదు. కానీ టెక్నాలజీ సాయంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం''తల్లి కావడమనేది నా కల. కాకపోతే అది కొన్నేళ్లు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆస్పత్రులంటే భయముండే నాలాంటి వాళ్లకు ఇది సవాలే. ఎందుకంటే ఇంజెక్షన్స్ కారణంగా ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ నేను కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఇక ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే.. కచ్చితంగా మంచిదే అని చెబుతాను. మీరు ఏం చేసినా సరే మీకోసం చేయండి. అలానే ఈ జర్నీలో నాకు అండగా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు థ్యాంక్స్' అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
అలాంటి 'దర్శకనిర్మాతల' వల్లే తెలుగులో ఛాన్సులు రాలేదు: ఇలియానా
'దేవదాసు'లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇలియానా.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ గోవా బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగునాట టాప్ హీరోయిన్గా కొనసాగింది.ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె కొన్నేళ్లుగా టాలీవుడ్కు దూరంగా ఉంది. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో మళ్లీ మెరిసింది. సౌత్ ఇండియా చిత్రాలకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పింది. ఇక్కడ ఆమెకు ఎందుకు అవకాశాలు రాలేదో కూడా ఓపెన్గానే చెప్పింది.2012లో ఇలియానాకు బాలీవుడ్లో నటించేందుకు అవకాశం దక్కింది. ఆ సినిమా విడుదల తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని ఇలియానా ఇలా చెప్పింది. 'అనురాగ్ బసు' దర్శకత్వం నుంచి 2012లో 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయానికి దక్షిణాదిలో చాలా సినిమాలతో బిజాగా ఉన్నాను. కానీ 'బర్ఫీ' కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ను వదలుకోవాలనిపించలేదు. నా అంచనా నిజమైంది. సినిమా సూపర్ హిట్ అయింది. ఈ వార్తతో ఇక సౌత్ ఇండియాలో నేను సినిమాలు చేయనని అందరూ భావించారు. ఆపై నేను బాలీవుడ్కు షిఫ్ట్ అయ్యానని కూడా అనుకున్నారు. ఈ కారణంతో దక్షిణాది నిర్మాతలతో పాటు దర్శకులు కూడా నా పట్ల ఆసక్తి చూపించలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ సినిమా అయినా సరే చాలా నిజాయితీగా నేను పనిచేశాను. కానీ నాకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈ విషయంపై ఇన్నేళ్లైనా నాకు క్లారిటీ రాలేదు. దో ఔర్ దో ప్యార్, తేరా క్యా హోగా లవ్లీ వంటి బాలీవుడ్ చిత్రాలతో ఏడాదిలో ఇలియానా నటించింది.
ట్రెండింగ్లో 'ఫ్యామిలీ స్టార్'.. అలాంటి రూమర్స్కు చెక్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఫ్యామిలీ స్టార్". ఇప్పటికే థియేటర్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమా రీసెంట్గా అమోజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్, మృణాల్ జోడీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశమని తెలుపుతున్నారు. కథలో హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం అనే కాన్సెప్ట్ అందరూ ఆలోచించతగినట్లూ ఉందంటూ వారు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని ఈ సినిమా పట్ల తప్పుగా ప్రచారం చేసినా కూడా విజయ్ క్రేజ్తో ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్కు రీచ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్తో ఆ దుష్ప్రచారం అంతా తేలిపోయింది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడనుంది. అమెజాన్ ప్రైమ్లో టాప్ వన్లో ఫ్యామిలీ స్టార్ చిత్రం దూసుకుపోతుంది.
బిజినెస్
టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు
టెక్ కంపెనీలు జనరేటివ్ ఏఐపై దూకుడుగా పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వీటిలో అపార అవకాశాలున్నట్లు గుర్తించి ఆదిశగా ముందుకుసాగుతున్నాయి. తాజాగా జనరేటివ్ ఏఐలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కృత్రిమమేధ రంగంలో కంపెనీ చాలా మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే సుమారు 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఏడాదిలో ట్రెయినింగ్ పూర్తి చేస్తామన్నారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 2700 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగిగే కనీసం 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామన్నారు. భవిష్యత్తులో ఏదైనా మార్పులు ఏదురైతే నియామకాల సంఖ్యలోనూ తేడాలుండవచ్చని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థకంపనీ మార్చి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి రేటు 5.4%గా నమోదైంది. టెక్ కంపెనీలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీలపై క్లౌడ్, జనరేటివ్ఏఐ ప్రాజెక్టులు పెరుగుతాయని విజయ్ అంచనా వేశారు. అయితే ఆర్థిక సేవల విభాగంలో మాత్రం కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ ఆధారిత సైబర్ భద్రత, డేటా, క్లౌడ్ ఇమిగ్రేషన్, ప్రైవేటు ఏఐ స్టాక్ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
గ్రీన్లో ఓపెన్ అయిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 22,670కు చేరింది. సెన్సెక్స్ 57 పాయింట్లు దిగజారి 74,751 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.32 శాతం లాభపడింది. నాస్డాక్ 0.35 శాతం ఎగబాకింది.అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్ను బలపరిచాయి. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డా.కృష్ణ ఎల్లా ఎంపిక
కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.ఈ పదవిలో ఇప్పటి వరకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనావాలా ఉన్నారు. ఐవీఎంఏ ఉపాధ్యక్షురాలిగా బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, కోశాధికారిగా భారత్ బయోటెక్ సీఎఫ్ఓ టి.శ్రీనివాస్లను ఎన్నుకున్నారు. ఐవీఎంఏ డైరెక్టర్ జనరల్గా డాక్టర్ హర్షవర్థన్ కొనసాగుతారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థఅందరికీ అవసరమయ్యే టీకాలు అందించడమే ఐవీఎంఏ ప్రధాన లక్ష్యమని డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో టీకాల తయారీ సంస్థలు సిద్ధం కావాలన్నారు. ఆఫ్రికా వంటి దేశాలకు టీకా అవసరాలు అధిమన్నారు. టీకా తయారీలో వస్తున్న అంకుర సంస్థలకు సరైన ప్రోత్సాహకాలు అందించాలన్నారు.
కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం 'ఆస్ట్రాజెనెకా' (AstraZeneca) కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆస్ట్రాజెనెకా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్లెట్ కౌంట్కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. TTS (థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువవుతుందని అంగీకరించింది.
వీడియోలు
స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు
టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!
చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్
చంద్రబాబును ఉతికారేసిన జగన్
ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!
కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం
మైదుకూరులో జనసునామి