ఎస్బీఐ, ఎయిర్ ఇండియాల క్రెడిట్ కార్డ్
ఎస్బీఐ, ఎయిర్ ఇండియాలు కలిసి కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ను అందిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఎస్బీఐ, ఎయిర్ ఇండియాలు కలిసి కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ను అందిస్తున్నాయి. ఎవరైనా వినియోగదారుడు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏడాదికి రూ. 5 లక్షలు ఖర్చుచేస్తే ఢిల్లీ-ముంబై రిటర్న్ ఎయిర్ ఇండియా టికెట్లు మూడు పొందవచ్చు. ప్రారంభ కానుకగా 20 వేల రివార్డ్ పాయింట్లు అందిస్తున్నామని ఎస్బీఐ తెలిపింది. ఇక ప్రతి రూ.100 కొనుగోలుపై 4 రివార్డ్ పాయింట్లు, ఎయిర్ ఇండియా టికెట్ల బుకింగ్కు సంబంధించి ప్రతి రూ.100కు 20 రివార్డ్ పాయింట్లు అందిస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ ప్రతీప్ చౌధురి మాట్లాడారు. నగదు నిల్వల నిష్పత్తి, రెపోరేట్లను తగ్గించాలని ఆర్బీఐకి సూచించామని పేర్కొన్నారు.