మద్దతు ధరకు ఢోకా ఉండదు: కేంద్రం | No problem for support price, assures centre | Sakshi
Sakshi News home page

మద్దతు ధరకు ఢోకా ఉండదు: కేంద్రం

Aug 27 2013 2:56 AM | Updated on Oct 2 2018 8:49 PM

ఆహార భద్రత బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రైతుల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) లభిస్తుందని కేంద్రం హామీ ఇచ్చింది.

న్యూఢి ల్లీ: ఆహార భద్రత బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రైతుల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) లభిస్తుందని కేంద్రం హామీ ఇచ్చింది. బిల్లుపై చర్చలో వ్యక్తమైన ఆందోళనలపై ఆహార మంత్రి కేవీ థామస్ స్పందించారు. ‘ఎంఎస్‌పీలను దె బ్బతీయం. మండీలకు వచ్చిన ఏ ధాన్యాన్నయినా సేకరిస్తాం, పంపిణీ చేస్తాం’ అని చెప్పారు. ఎంఎస్‌పీలను నిర్ధారించే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేసినా ప్రభుత్వం అంగీకరిస్తుందని తెలిపారు. దేశంలో ధాన్యాల నిల్వ సామర్థాన్ని 5.5 కోట్ల టన్నుల నుంచి 7.5  కోట్ల టన్నులకు పెంచామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement