పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి- మోదీ | Modi, Merkel inaugurate India pavilion at Hannover fair | Sakshi
Sakshi News home page

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి- మోదీ

Apr 13 2015 2:08 PM | Updated on Aug 21 2018 9:33 PM

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి- మోదీ - Sakshi

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి- మోదీ

జర్మనీ హన్నోవర్లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శను ప్రధానమంత్రి మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఏంజెల్ మోర్కెల్ ప్రారంభించారు.

హన్నోవర్:  జర్మనీ హన్నోవర్లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శను  ప్రధానమంత్రి మోదీ, జర్మనీ ఛాన్సలర్   ఏంజెల్ మోర్కెల్  ప్రారంభించారు.  ఈ  ప్రదర్శనలో భారతీయ స్టాల్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ   తయారీ రంగంలో ప్రపంచానికి భారత్ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులపై ప్రపంచ దేశాలన్నీ  భారత్ వైపు  చూస్తున్నాయన్నారు.    ఈ సదస్సులో తమ దేశానికి భాగస్వామ్యం కల్పించినందుకు  ప్రధాని సంతోషం వ్యక్తం  చేశారు.  భారత్‌ లో  పెట్టుబడులు పెట్టేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాననీ, ఇందుకోసం జర్మనీతోపాటు ప్రపంచదేశాలు ముందుకురావాలని ఆయన కోరారు. నాలుగు వందల భారత కంపెనీలు  పాల్గొంటున్న ఈ  ప్రదర్శనలో నిర్మలా సీతారామన్  కూడా హాజరయ్యారు. అయితే
కాగా  మూడు దేశాల్లో తొమ్మది రోజుల పర్యటనలో భాగంగా  ఫ్రాన్స్ పర్యటనను  ఇప్పటికే ముగించిన ప్రధాని మోదీ జర్మనీలో రెండురోజుల పర్యటన అనంతరం కెనడాకు బయలుదేరి వెళ్ళనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement