
జయలలిత
ఎన్నికల వ్యయం జమాఖర్చుల విషయమై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎలక్షన్ కమిషన్పై మండిపడ్డారు.
చెన్నై: ఎన్నికల వ్యయం జమాఖర్చుల విషయమై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎలక్షన్ కమిషన్పై మండిపడ్డారు. ఆమె పర్యటన, ర్యాలీల ఖర్చులను అభ్యర్థుల ఖర్చుల జాబితాలో ఎన్నికల కమిషన్ జమచేసేసింది. దాంతో ఆమెకు కోపం వచ్చింది.
తన పర్యటన ఖర్చులు కూడా అభ్యర్ధుల ఖాతాలో కలిపితే ఎలా? అని ఆమె ఎన్నికల కమిషన్ను ప్రశ్నించారు. తన ర్యాలీకి ప్రజలే స్వచ్ఛందగా వస్తున్నారని ఆమె తెలిపారు. ఆ ఖర్చులనూ అభ్యర్ధి ఖర్చుల్లో ఎలా చూపిస్తారు? అని జయలలిత ప్రశ్నించారు.