లారీ, ట్రాక్టర్ ఢీ: ఐదుగురికి తీవ్ర గాయాలు | Five injured in road accident, lorry tractor hits | Sakshi
Sakshi News home page

లారీ, ట్రాక్టర్ ఢీ: ఐదుగురికి తీవ్ర గాయాలు

Aug 5 2015 10:15 PM | Updated on Sep 3 2017 6:50 AM

మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం తిమ్మాయిపల్లి స్టేజీ సమీపంలో దేవరకొండ - కల్వకుర్తి ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రోడ్డుప్రమాదం జరిగింది.

వంగూరు(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం తిమ్మాయిపల్లి స్టేజీ సమీపంలో దేవరకొండ - కల్వకుర్తి ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. మిర్యాలగూడ నుంచి కల్వకుర్తి వైపు గడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను తిమ్మాయి పల్లి స్టేజి సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది.

ఈ ఘటనలో ట్రాక్టర్ రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. డ్రైవర్ సహా ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న మిడ్జిల్ మండలం ఇప్పపాడు గ్రామానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆటోలో కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ రోడ్డుపైనే నిలిచి ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎస్‌ఐ నరేష్ ప్రమాదస్థలానికి వెళ్లి, జేసీబీ సాయంతో రోడ్డును క్లియర్ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement