'విభజన చట్టం హామీలన్నీ అమలు చేయాలి' | cpi, cpm wrote letter to narendra modi | Sakshi
Sakshi News home page

'విభజన చట్టం హామీలన్నీ అమలు చేయాలి'

Oct 21 2015 6:14 PM | Updated on Aug 15 2018 2:20 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా ఓ లేఖ రాశాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా ఓ లేఖ రాశాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలుచేయాలని రెండు పార్టీలు ఈ లేఖలో కోరాయి. వెనకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి.

ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 16 నెలలు గడుస్తున్నా, హామీల అమలుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని సీపీఐ, సీపీఎం గుర్తుచేశాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలుచేసే విషయంపై.. అమరావతి శంకుస్థాపన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని సీపీఐ, సీపీఎం తమ ఉమ్మడి లేఖలో కోరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement