
14 ఏళ్ల తర్వాత 'మృతుడు' గుర్తింపు
అమెరికాలో ఆల్ఖైదా తీవ్రవాదులు 9/11 దాడులు చేసి దాదాపు 14 ఏళ్లు అయింది.
న్యూయార్క్: అమెరికాలో ఆల్ఖైదా తీవ్రవాదులు 9/11 దాడులు చేసి దాదాపు 14 ఏళ్లు అయింది. ఆ దాడిలో మరణించిన వ్యక్తిని దాదాపు 14 ఏళ్ల తర్వాత న్యూయార్క్ మెడికల్ ఎగ్జామినర్లు గుర్తించారు. ఆ దాడిలో మరణించినది మాథ్యు డేవిడ్ యెర్నెల్ అని వారు స్పష్టం చేశారు. యెర్నెల్ స్వస్థలం పొరుగున ఉన్న న్యూజెర్శి అని తెలిపారు. కొత్తగా రూపొందించిన డీఎన్ఏ పరీక్ష ద్వారా యెర్నెల్ను గుర్తించడం సాధ్యమైందని వారు వివరించారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి అనంతరం దాదాపు 2,753 మంది ఆచూకీ తెలియకుండా పోయారని... వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నామన్నారు. అయితే యెర్నెల్ను గుర్తించడంతో వారి సంఖ్య 1640కు చేరిందన్నారు. మరో 1,113 మంది ఆచూకీ మాత్రం లభ్యం కాలేదన్నారు. సైన్స్ రంగంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న నవీన పరిణామాల ద్వారా మృతులను గుర్తించడం సాధ్యమైందని న్యూయార్క్ మెడికల్ ఎగ్జామినర్లు వివరించారు.