
'అన్ని మతాలు మాకు సమానం'
ఆర్ఎస్ఎస్ ఆరోపణలను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఖండించారు.
హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ ఆరోపణలను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఖండించారు. హిందువులకు వామపక్షాలు వ్యతిరేకం అన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు అన్ని కులాలు, మతాలు సమానమే అని సురవరం తెలిపారు. అబద్ధపు ప్రచారాలతో ఘర్షణలు సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏవోబీ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.