ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేశారు.
విశాఖపట్నం: ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేశారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. కాగా అధికారులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.
బీఎస్ఎఫ్ జవాన్లు చిత్రకొండ నుంచి జాన్బాయ్ వైపు వెళ్తుండగా మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. చిత్రకొండ సమీపంలో జవాన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.