ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మోమిన్పేట్ మండలం మేకవాన్పల్లి దగ్గర సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.