వివాహిత అనుమానాస్పద మృతి | The mysterious death of a married woman | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Apr 7 2016 1:20 PM | Updated on Sep 3 2017 9:25 PM

వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. భర్తా, అత్తమామలే హత్య చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అరోపిస్తున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న దాసరి గోపికి రెండేళ్ల క్రితం కవిత(21)తో వివాహమైంది. వీరికి ఐదు నెలల బాబు ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం కవిత మృతిచెందిందని గోపి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అక్కడికి వచ్చిన కవిత తల్లిదండ్రులు ఆమె వంటి పై గాయాలు ఉండటంతో.. భర్తే హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement