పోలీసులు పట్టించుకోలేదని... | the man attempted to commit suicide At the police station, | Sakshi
Sakshi News home page

పోలీసులు పట్టించుకోలేదని...

Oct 31 2015 6:07 PM | Updated on Nov 6 2018 7:56 PM

కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే.. పోలీసులు పట్టించుకో లేదని మనస్తాపం చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యా యత్నం చేశాడు.

కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే.. పోలీసులు పట్టించుకో లేదని మనస్తాపం చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం జరిగింది.


వివరాల్లోకి వెళితే..  కొత్తూరు గ్రామానికి చెందిన గూగులోత్ లచ్చానాయక్(48) కొడుకుతో ఆర్థిక లావాదేవిలకు సంబంధించి గత కొన్ని రోజులుగా గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో కొడుకు పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఈరోజు ఠాణా కు వచ్చాడు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement