భూముల రీసర్వేకు 600 కోట్లు ఇవ్వండి | telangana asks centre 600 crores for lands reservey | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వేకు 600 కోట్లు ఇవ్వండి

Jul 20 2014 3:01 AM | Updated on Sep 2 2017 10:33 AM

తెలంగాణలో భూములను రీ సర్వేచేసి, అన్ని స్థాయిల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని అమలుచేసేందుకు 600 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటూ రాష్ర్ట రెవెన్యూశాఖ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసింది.

 కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూములను రీ సర్వేచేసి, అన్ని స్థాయిల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని అమలుచేసేందుకు 600 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటూ రాష్ర్ట రెవెన్యూశాఖ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణలో భూముల సర్వే నిజాం కాలంలో, 80 ఏళ్ల క్రితం జరిగిందని, భూముల రికార్డులు కూడా అప్పుడే తయారయ్యాయని, అందులో వివరాలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ ఇటీవల కేంద్రానికి పంపిన లేఖలో వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement