టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పండి | teach lesson to congress,tdp and bjp | Sakshi
Sakshi News home page

టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పండి

Apr 15 2014 2:13 AM | Updated on Mar 29 2019 9:24 PM

టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పండి - Sakshi

టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పండి

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధిచెప్పాలని తెలగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు.

నిజామాబాద్ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధిచెప్పాలని తెలగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు.  సోమవారం ఆమె నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి నిజామాబాద్ మండలంలోని సారంగాపూర్, గూపన్‌పల్లి, గుండారం, ఖానాపూర్, జలాల్‌పూర్, మల్కాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
 
సారంగాపూర్‌లో ఆమె  ప్రసంగిస్తూ..  కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని  కోరారు.  40 యేళ్ళు పాలించిన కాంగ్రెస్, 20 యేళ్ళు పాలించిన టీడీపీలు తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశాయని ఆరోపించారు.   టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కృషి, అమరవీరుల త్యాగాల ఫలితంగానే  తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు.బీజేపీకి ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని అన్నారు. టీఆర్‌ఎస్ ఇంటి పార్టీని గెలిపించుకోవాలని కోరారు.
 
అనంతరం బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. నియోజక వర్గం అభివృద్ధికి కృషి చేస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు.  ప్రచారంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకులు  ఎండి. రహీం షఫీ, గడీల రామన్న తదితరులు పాల్గొన్నారు.  గ్రామంలోని గ్రామ దేవతలకు  కవిత పూజలు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement