మరో రెండు రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానున్న క్రమంలో నగరంలో పోలీసుల ముందస్తు చర్యలు జోరందుకుంటున్నాయి.
చైతన్యపురి (హైదరాబాద్): మరో రెండు రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానున్న క్రమంలో నగరంలో పోలీసుల ముందస్తు చర్యలు జోరందుకుంటున్నాయి. నగరంలోని పలు సూపర్ మార్కెట్, మాల్స్లలో ఈ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
నగరంలోని కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో పలు మాల్స్లో డాగ్స్ స్క్వాడ్ల తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భద్రతా కారాణాల దృష్ట్యా ఇలాంటి చర్యలు చేపడుతున్నామని ఒక ఉన్నతాధికారి తెలిపారు.