భారీగా ఇసుక లారీల సీజ్ | sand lorries seized in nalgonda district | Sakshi
Sakshi News home page

భారీగా ఇసుక లారీల సీజ్

Oct 26 2015 8:42 AM | Updated on Aug 29 2018 4:16 PM

నల్గొండ జిల్లాలో సోమవారం ఉదయం మూసీ నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీలను పోలీసులు పట్టుకున్నారు.

నార్కట్‌పల్లి: ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న వాటిని అక్రమార్కులు ఏమాత్రం భేఖాతరు చేయటం లేదు. తాజాగా నల్గొండ జిల్లాలో సోమవారం ఉదయం మూసీ నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీలను పోలీసులు పట్టుకున్నారు.


నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు సమీపంలోని మూసీ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఐదు లారీలను సీజ్ చేసి, స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement