అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలం కేంద్రంలోని తిర్మలాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Mar 9 2017 1:44 PM | Updated on Oct 1 2018 2:44 PM
రామడుగు(కరీంనగర్): అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలం కేంద్రంలోని తిర్మలాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాకాల హనుమంతు గౌడ్(52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండేళ్లుగా పంట దిగుబడి లేకపోవడంతో పాటు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో, పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
Advertisement