లారీ ఢీకొని వ్యక్తి మృతి | man died in lorry accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Nov 6 2015 2:00 PM | Updated on Sep 3 2017 12:08 PM

రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

కరీంనగర్:  రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరి ఖని గంగానగర్ లో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న లింగయ్య (55) , కొమరయ్య(54) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కొమరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement