పోల్కంపల్లిలో కొండారెడ్డి బురుజు

Kondareddy Buruju Setting In Polkampally - Sakshi

సాక్షి, సంగారెడ్డి : ఆంధ్రప్రదేశ్‌ కర్నూలులో ఉండాల్సిన కొండారెడ్డి బురుజు మన జిల్లాకు వచ్చింది. అదెలా సాధ్యమనుకుంటున్నారా..? ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో మహేష్‌బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ కోసం ఏర్పాటుచేశారు. గతంలో ‘ఒక్కడు’ సినిమాలో కొండారెడ్డి బురుజు వద్ద మహేష్‌బాబు, ప్రకాష్‌రాజ్‌తో ఫైట్‌ సీన్‌ గుర్తుంది కదా. ఇక్కడ ‘మీనాక్షి’, ‘మహర్షి’ తదితర సినిమాలకు భారీ సెట్టింగ్‌లు వేశారు. మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా కోసం కొండారెడ్డి బురుజు సెట్టింగ్‌ తీర్చిదిద్దారు. 25 నుంచి షూటింగ్‌ ప్రారంభంకానుంది. – ఇబ్రహీంపట్నం రూరల్‌ 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top