సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కరోనా నియంత్రణను, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ప్రజల్లో నెలకొన్న ఆందోళన తొలగిం చాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును కోరారు. ఈమేరకు ఆయన సీఎం కేసీఆర్ కు మంగళవారం లేఖ రాశారు. తెలంగాణతో స హా కొన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ జంట నగరాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనిపై ప్రజల్లో అభద్రతాభావం, భయం అధికంగా ఉన్నట్లు అర్థమవుతోందని, ప్రజల్లో నెలకొన్న ఈ ఆందోళనలను దూరం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీసూదన్ సోమవారం దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల అధికారులతో మాట్లాడార ని, ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా వైద్యాధికారి, ప్రధాన వైద్యశాలల సూపరింటెండెంట్లు, రాష్ట్ర వైద్యశాఖ కార్యదర్శితో మాట్లాడారని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన సూచనలు చేశారని, వాటిని పక్కాగా అమలుచేయాలన్నారు. ఇంటింటి సర్వే చేపట్టి సకాలంలో రోగులను గుర్తించి, సత్వరం పరీక్షలు చేసి, బాధితులకు చికిత్స అందించాలని కోరారు.
కట్టడి చర్యలు పటిష్టం చేయండి: వైద్య, ఆరోగ్య సిబ్బందికి సహాయంగా ఉండేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థలు ఏర్పాటు చేయడంతోపాటు కంటైన్మెంట్ జోన్లలో ప్రభుత్వ సిబ్బంది, వైద్య రంగ ప్రముఖు లను నియమించాలని కిషన్రెడ్డి కోరారు. జంటనగరాల్లో వీధుల్ని, కరోనా వచ్చిన గృహాలను యం త్రాల ద్వారా శానిటైజ్ చేయాలన్నారు. కరోనా కట్టడిలో భాగంగా..వారియర్స్గా పనిచేస్తున్న సి బ్బంది రక్షణ చర్యలు తీసుకుంటూ వారికి ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో నమూనా పరీక్షలు అధికం చేస్తూ పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలని పేర్కొన్నారు.
లక్ష్మణ్కు అటల్ ఫౌండేషన్ ప్రశంసాపత్రం: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ లాక్డౌన్ సమయంలో చేసిన సేవలకుగాను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని అటల్ ఫౌండేషన్ తరఫున ప్రశంసా పత్రం పంపించిందని బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో వ్యక్తులు, సంస్థలు చేసిన సేవలను గుర్తించి అటల్ ఫౌండేషన్ ప్రశంసలు అందజేస్తుందని తెలిపారు.
కరోనాపై ప్రజల్లో ఆందోళన తొలగించండి
Published Wed, Jun 10 2020 5:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement