గవర్నర్తో ముగిసిన కేసీఆర్ భేటీ | kcr meets governor | Sakshi
Sakshi News home page

గవర్నర్తో ముగిసిన కేసీఆర్ భేటీ

Jun 17 2015 3:45 PM | Updated on Aug 15 2018 9:27 PM

గవర్నర్తో ముగిసిన కేసీఆర్ భేటీ - Sakshi

గవర్నర్తో ముగిసిన కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్తో సమావేశం ముగిసింది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్తో సమావేశం ముగిసింది. బుధవారం మధ్యాహ్నం రాజ్భవన్ వెళ్లిన కేసీఆర్ దాదాపు 20 నిమిషాలు సమావేశమయ్యారు.

ఓటుకు కోట్లు కేసు పురోగతిని కేసీఆర్ గవర్నర్కు వివరించారు. ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసే విషయం గురించి కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు హైదరాబాద్లో శాంతిభద్రతల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన విషయం గురించి గవర్నర్కు వివరించినట్టు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్పై నమోదైన కేసుల గురించి చర్చించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement