జర్మన్‌ సమావేశానికి కేటీఆర్‌కు ఆహ్వానం | Invitation to KTR for German Conference | Sakshi
Sakshi News home page

జర్మన్‌ సమావేశానికి కేటీఆర్‌కు ఆహ్వానం

Feb 19 2018 1:47 AM | Updated on Aug 30 2019 8:24 PM

Invitation to KTR for German Conference - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జర్మన్‌ ఏషియా పసిఫిక్‌ బిజినెస్‌ ఆసోసియేషన్‌ 98వ సమావేశానికి హాజరుకావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావును ఆ సంస్థ ఆహ్వానించింది. జర్మనీలోని హంబర్గ్‌లో మార్చ్‌ 2న జరగనున్న ఈ సమావేశంలో పాల్గొని తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు వివరించాలని కోరింది. ఆసియా దేశాలతో జర్మనీ నిర్వహించే వ్యాపార వాణిజ్య అవకాశాలను చర్చించే ఈ సమావేశానికి సుమారు అంతర్జాతీయంగా పేరున్న 300 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకు లు, దౌత్యవేత్తలు హాజరవుతారని అసోసియేషన్‌ తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా అమలుచేస్తున్న సంక్షేమ, ఆర్థిక విధానాలపై జర్మన్‌ వ్యాపార వర్గాలకు ఆసక్తి ఉందని, అందుకే ఈ అంశంపై చర్చించేందుకు తమ దేశంలోని అగ్ర వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ సమావేశంతో తెలంగాణ, జర్మనీ మధ్య వాణిజ్య బంధం మరింత విస్తృతమవుతుందని అసోసియేషన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రత్యేక అహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement