తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో పదవులు చేపట్టబోయే ఎమ్మెల్యేల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్ కు అందజేశారు.
హైదరాబాద్:తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో పదవులు చేపట్టబోయే ఎమ్మెల్యేల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. తాజా కేబినెట్ లో ఐదుగురికి చోటు కల్పించిన కేసీఆర్.. అందుకు సంబంధించిన వివరాలను గవర్నర్ కు పంపారు. సీఎం పంపిన జాబితాలోని పేర్లు..
ఇంద్రకరణ్ రెడ్డి(ఆదిలాబాద్), అజ్మీరా చందూలాల్ (వరంగల్), జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి(మహబూబ్ నగర్), తలసాని శ్రీనివాస్ యాదవ్(హైదరాబాద్).