తెలంగాణలో 45కు చేరిన కరోనా కేసులు

CoronaVirus: One More Positive Case Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో కరోనా కేసు నమోదయింది. సికింద్రాబాద్‌ బౌద్ద నగర్‌లోని 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. బౌద్ద నగర్‌లోని ఆ వ్యక్తికి సంబంధించిన వారితో పాటు అతను ఎవరెవరిని కలిశాడో వంటి వివరాలను పోలీసులు, వైద్యులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వారందరికి కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం సాయంత్రం నమోదయిన ఈ కేసుతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 45కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా సాగుతోంది. ప్రజానీకాన్ని బయటకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top