ట్రాక్టర్‌పై నుంచి పడి వ్యక్తి మృతి | A man Died who fell from the tractor | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

Sep 21 2015 10:50 AM | Updated on Aug 30 2018 3:56 PM

నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన బాణాల రాజేష్(28)ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి మృత్యువాతపడ్డాడు.

ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఒక వ్యక్తి మృత్యువాతపడ్డాడు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన బాణాల రాజేష్(28) మేళ్లచెర్వు మండల కేంద్రంలోని అత్తవారింట్లో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సిమెంట్ బస్తాల లోడుతో మండలంలోని మల్లారెడ్డిగూడెం వైపు వెళ్తుతుండగా.. ట్రాక్టర్ రోడ్డుమీద ఉన్న గుంటలో పడి.. దీంతో ఇంజిన్ నుంచి వేరుపడిన ట్రాలీ.. లోడుతో సహా తిరగబడింది. దీంతో ట్రాలీలో సిమెంట్ బస్తాల మీద కూర్చున్న రాజేష్ తీవ్ర గాయాలతో.. అక్కడికక్కడే మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement