నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన బాణాల రాజేష్(28)ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి మృత్యువాతపడ్డాడు.
ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఒక వ్యక్తి మృత్యువాతపడ్డాడు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన బాణాల రాజేష్(28) మేళ్లచెర్వు మండల కేంద్రంలోని అత్తవారింట్లో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సిమెంట్ బస్తాల లోడుతో మండలంలోని మల్లారెడ్డిగూడెం వైపు వెళ్తుతుండగా.. ట్రాక్టర్ రోడ్డుమీద ఉన్న గుంటలో పడి.. దీంతో ఇంజిన్ నుంచి వేరుపడిన ట్రాలీ.. లోడుతో సహా తిరగబడింది. దీంతో ట్రాలీలో సిమెంట్ బస్తాల మీద కూర్చున్న రాజేష్ తీవ్ర గాయాలతో.. అక్కడికక్కడే మృతి చెందాడు.