-
మార్పు తథ్యమేనా?.. సీఎం పదవిపై మంత్రి శ్రీధర్బాబు రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: టైమ్ ఎప్పుడు వస్తుందా?. సీఎం రేవంత్ను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోందంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎంను మారిస్తే మళ్లీ అర్హత గల సీఎం దొరకడం కష్టమని.. ఎలిజిబుల్ ఉన్న శ్రీధర్ బాబు సహా మిగతా వారికి వసూల్ చేయడం రాదన్నారు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గుతోందంటూ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్బాబు స్పందిస్తూ.. రేవంతే ముఖ్యమంత్రిగా ఉంటారని.. ఉండి తీరతారంటూ తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా.. అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నారన్నారు. ‘‘మా పార్టీలో అందరూ సమర్థులే. అరవింద్ ఏ సందర్భంగా మాట్లాడారో తెలియదు. నాకు అరవింద్ చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టే నా గురించి అలా అన్నాడేమో. మా పార్టీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అంతిమ నిర్ణయం అధిష్టానానిదే’’ అంటూ శ్రీధర్బాబు స్పష్టం చేశారు.‘‘సచివాలయంలో మీనాక్షీ నటరాజన్ ఎలాంటి సమీక్ష నిర్వహించలేదు. ఆమె మమ్మల్ని కలవడానికి సచివాలయానికి వచ్చారు. సచివాలయానికి ఎవరైనా రావచ్చు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా సచివాలయానికి వస్తారు’’ అని శ్రీధర్బాబు చెప్పుకొచ్చారు.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బాధ్యతాయుతంగా పని చేయాలని మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. ప్రకృతి కాలుష్యం తరిమి కొట్టాలని, మూసీ పరివాహక ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు విరోధులగా మారారు. హెచ్యూసీ ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసు. తొమ్మిది ఏండ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింక పిల్లను హెచ్సీయూలో చనిపోయినట్లు చూపించారు. ఏనుగులు హెచ్సీయూ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు ఏఐ ద్వారా చూపించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని మా ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నారు’’ అని శ్రీధర్బాబు ధ్వజమెత్తారు. -
‘ఒకరు సంచులు మోస్తే.. మరొకరు చెప్పులు మోస్తారు’
హైదరాబాద్: రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు ఢిల్లీ పార్టీల్లో ఒకటి సంచుల పార్టీ అయితే, మరొకటి చెప్పులు మోసే పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్.గతంలో కేసీఆర్ నాయకత్వంలో ఏప్రిల్, మే నెలల్లో కూడా మానేరు ఓ సజీవధారగా ప్రవహించదన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక చిన్న పర్రె పడితే బద్నాం చేశారని బీజేపీ, కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఎస్ఎల్పీసీలో ఎనిమిది చనిపోతే, సుంకిశాల కూలిపోతే ఎన్డీఎస్ఏ ఎందుకు రాదని ప్రశ్నించారు.భూకంపం వచ్చినా తట్టుకుని నిలబడింది కాళేశ్వరమని, మేడిగడ్డకు ఇప్పటికైనా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్ సీయూ భూములపై స్వయానా కుదవ పెడితే.. మరో మంత్రేమో ఏం లేదంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మీదీ కాని భూమిని తనఖా పెట్టడం తప్పు కాదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
వారంలోగా క్షమాపణ చెప్పకపోతే.. బీఆర్ఎస్ నేతకు టీజీపీఎస్సీ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ఎటువంటి ఆరోపణలు చేయొద్దని రాకేశ్రెడ్డికి టీజీపీఎస్సీ హెచ్చరించింది. -
బండి సంజయ్ -రాజాసింగ్ భేటీపై ఉత్కంఠ
హైదరాబాద్: ఇటీవల రాష్ట్ర బీజేపీపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే రాజాసింగ్ తో కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ భేటీ కానుండటంపై ఉత్కంఠ నెలకొంది. హిందుత్వ ఎజెండాతో పని చేస్తున్న ఈ ఇద్దరు నేతల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతుంది. రాజాసింగ్ తో సంధి కోసమే.. బండి సంజయ్ భేటీ అవుతున్నారనే ప్రచారం ఒకవైపు జరుగుతుండగా, బీజేపీలో రాజాసింగ్ ను మళ్లీ యాక్టివ్ చేయడానికే బండి సంజయ్ భేటీ అవుతున్నారని మరోవైపు ప్రచారం ఊపందుకుంది.ఈరోజు(శనివారం) పాతబస్తీకి వెళ్లనున్న బండి సంజయ్.. ఆకాశ్ పురిలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం రాజాసింగ్ తో సమావేశం కానున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించిన రాజాసింగ్... తన స్టేట్ మెంట్స్ తో రాష్ట్ర నేతలను ఒకింత కలవరానికి గురి చేశారు.ఈ క్రమంలోనే రాజాసింగ్ తో బండి సంజయ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజాసింగ్ ను కాస్త శాంతిపచేసి మళ్లీ తిరిగి బీజేపీ కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కోరే అవకాశం ఉంది.మరొకవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ వీరు భేటీ కావడం మరో వాదనకు తెరలేపింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై అభిప్రాయ సేకరణ పూర్తైన నేపథ్యంలో రాజాసింగ్ తో బండి సంజయ్ సమావేశం అవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. తాను అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ ప్రకటించినప్పటికీ వేరే వాళ్లకు మద్దతు ఇస్తే, ఎవరికి మద్దతు ఇస్తారు అనే దానిపై చర్చ నడుస్తోంది. మద్దతు కూడగట్టేందకే రాజాసింగ్ తో భేటీ అవుతున్నారా ? అనేది భేటీ తర్వాత క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఇదిలా ఉంచితే, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎన్ గౌతంరావు బరిలో ఉన్నారు. దీనిపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. గౌతంరావును పట్టుబట్టి బరిలో దింపారు బండి సంజయ్. ఈ విషయంపై రాజాసింగ్ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్ర పార్టీ నాయకత్వంపై కూడా విమర్శలు చేశారు. ఈ ఎన్నికను బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, పార్టీలో కీలక నేతగా ఉన్న రాజాసింగ్ మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తరుణంలో వీరి భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. -
కాంగ్రెస్కు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ రాజీనామా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (ఆర్ఎల్డి)లోకి దిలీప్ చేరారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరిన దిలీప్.. ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో రాజీనామా చేసినట్లు సమాచారం. ఆర్ఎల్డిలోకి చేరిన దిలీప్ కుమార్ను ఆ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంఛార్జ్గా జయంత్ చౌదరి నియమించారు. -
రేవంత్, కడియంపై రాజయ్య సంచలన ఆరోపణలు
సాక్షి, జనగామ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రే భూములు అమ్మడం విడ్డూరం ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఈ నెలలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో దోపిడీ పెరిగింది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రే భూములు అమ్మడం విడ్డూరం. ముఖ్యమంత్రికి నేనేమన్నా తక్కువ అన్నట్టుగా ఇనపరాతి గుట్టలపై కడియం శ్రీహరి కన్నేశాడు.అక్కడ 28 ఎకరాల దేవనూరు భూమి తన బినామీ పేరుపై ఉన్నది వాస్తవం కాదా?. ఆ 28 ఎకరాల వద్ద తన బినామీలతో కడియం దిగిన ఫోటోలు నా వద్ద ఉన్నాయి. దేవనూరులో కడియం శ్రీహరి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు. వ్యవసాయం చేసే కుటుంబం అంతకన్నా కాదు. కడియం శ్రీహరి అవినీతి, అక్రమాలకు.. ఆయన ఆస్తులే సజీవ సాక్షాలు. రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనాపూర్ ప్రజలే రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ విమర్శలు చేశారు. -
ఆ రూ. 5,200 కోట్లు కేటీఆర్ పద్దు
సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూకి చెందిన భూముల విలువ రూ. 5,200 కోట్లని మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారని.. కానీ అది భూముల విలువ కాదని.. కేటీఆర్ ముడుపుల పద్దు అని టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. ఐఎంజీ భారత్ సంస్థ ముసుగులో హెచ్సీయూ భూముల్ని కాజేయజూసిన బిల్లీరావుతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ రూ. 5,200 కోట్లని దుయ్యబట్టారు.శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఆమేర్అలీ ఖాన్, ఎమ్మెల్యే శ్రీగణేశ్, టీజీఎంఆర్ఈఐఎస్ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీలతో కలిసి మహేశ్కుమార్గౌడ్ మాట్లాడారు. బిల్లీరావుతో ఒప్పందం ప్రకారం హెచ్సీయూకు చెందిన 400 ఎకరాలను ఐఎంజీ భారత్కు అప్పగిస్తే ఆ భూమి విలువలో 30 శాతం కమీషన్ కేటీఆర్కు ముట్టేదన్నారు. అయితే కేటీఆర్ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.టీడీపీ హయాంలో బిల్లీరావుకు ఇచి్చన ఆ భూముల్ని నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్ కాపాడితే సుప్రీంకోర్టులో పోరాడి ఆ భూముల్ని రేవంత్రెడ్డి వెనక్కి తెచ్చారని చెప్పారు. ‘రూ. 5,200 కోట్లు నీ ఫిగర్. మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు. వై.ఎస్. రాజశేఖర్రెడ్డి, రేవంత్రెడ్డి లేకుంటే ఆ భూములు బిల్లీరావుకు ఎప్పుడో వెళ్లిపోయేవి. ఇప్పుడు ఆ భూములు అభివృద్ధి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఇంత కడుపు మంట ఎందుకు? ఉద్యోగాలు రాకూడదా? రుణమాఫీ చేయకూడదా?’అని మహేశ్కుమార్గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ హయా ంలో ప్రభుత్వ భూములు అమ్మినప్పుడు కోకాపేటలో ఎకరం రూ. 100 కోట్లు పలికితే.. ఐఎస్బీ, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, గూగుల్, యాక్సెంచర్ లాంటి సంస్థల సమీపంలో అమెరికన్ కాన్సులేట్కు ఆనుకొని ఉన్న భూమి రూ. 75 కోట్లు పలకదా? అని ప్రశ్నించారు. ఆ భూమిపై రూ.10 వేల కోట్ల రుణ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం ఆ 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ఇచ్చి రూ. 10 వేల కోట్లను బాండ్ల రూపంలో ఐసీఐసీఐ నుంచి రుణం తీసుకుందని మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. ఆ మొత్తాన్ని రైతు రుణమాఫీ, సన్న ధాన్యానికి బోనస్ కోసం ఉపయోగించిందన్నారు. కేటీఆర్ ఆరోపించిన రూ. 175 కోట్ల విలువైన టెండర్లు పిలిచి కన్సల్టెన్సీకి ఇచ్చామని.. అందులో కుంభకోణం ఎక్కడిదన్నారు. ఆనవాయితీగా టెండర్లు పిలిచి అధికారికంగా వైట్మనీ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఇచ్చామని చెప్పారు. సీబీఐ విచారణ జరపాల్సింది కేటీఆర్పైనే సీబీఐ విచారణ జరపాల్సింది నిజంగా కేటీఆర్ మీదేనని, దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కు వ ప్రజాధనాన్ని దోపిడీ చేసింది కేసీఆర్ కుటుంబమేనని మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. -
‘కాంగ్రెస్కు, సీఎం రేవంత్కు కేటీఆర్ బాడీగార్డ్’
హైదరాబాద్: కాంగ్రెస్-బీఆర్ఎస్లపై మరోసారి ధ్వజమెత్తారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మీడియాతో చిట్ చాట చేసిన మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ కు తోక పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మారిందంటూ విమర్శించారు. చెన్నైలో డీకే శివకుమార్ తో కేటీఆర్ రెండు గంటలు పాటు సమావేశమయ్యారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య కుదిరిన ఒప్పందంగా మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య మద్రాసు ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్కు కేటీఆర్ బాడీగార్డ్. బీజేపీని అడ్డుకోవడానికి రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. లోన్ ఇప్పించిందంటూ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ను ప్రొటెక్ట్ చేసేందుకే బీజేపీ ఎంపీ ఉన్నారంటూ కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే పేరు బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి -
‘ వారికి వసూల్ చేయడం రాదనే.. సీఎంను మార్చడం లేదు’
హైదరాబాద్: : తెలంగాణ రాష్ట్రంలో అసమర్థ, అవినీతి ప్రభుత్వం నడుస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. అసలు రాష్ట్రంలో పరిపాలన శూన్యమని, ప్రజల దృష్టికి మరల్చడానికే హెచ్ సీయూ హైడ్రా వివాదాలని ఆరోపించారు అరవింద్. లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి కాంగ్రెస్ ఇన్ని వాగ్దానాలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రగతిభవన్ లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నప్పుడు, కేసీఆర్ కు తెలియదా.. లంకె బిందెలు ఎక్కడ దాచుకోవాలో అని నిలదీశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. ‘ సీఎం రేవంత్ సీసీపీయూ( Connect Collect Pay Use) కోర్సు చేశారని, ఇది మాత్రమే ఆయనకు తెలుసు. రేవంత్ పాలనలో పెద్దల నుంచి అంగన్ వాడిలో చదువుకునే చిన్నపిల్లలు కూడా సంతోషంగా లేరు. కేసీఆర్, రేవంత్ ల కథ గజదొంగ గంగన్న, ఆయన కొడుకు రంగన్న కథలా ఉంది. HCU భూముల అంశంలో బిజేపి ఎంపీ ఉన్నాడు అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. మరి పేరు ఎందుకు బయటపెట్టడం లేదు. టైమ్ ఎప్పుడు వస్తుంది.రేవంత్ ను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోంది. సీఎంను మారిస్తే మళ్లీ అర్హత గల సీఎం దొరకడం లేదు. ఎలిజిబుల్ ఉన్న శ్రీధర్ బాబు సహా మిగతావారికి వసూల్ చేయడం రాదు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గుతోంది’ అని ఆరోపించారు ధర్మపురి అరవింద్. -
సీఎం రేవంత్ మతి లేకుండా మాట్లాడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి మతి స్థిమితం లేకుండా, బాధ్యతారహి తంగా మాట్లాడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. సీఎం తన కుర్చీని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీని మెప్పించడానికి ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేశారన్నారు. తెలంగాణను రాహుల్ పాదాల వద్ద రేవంత్ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రేవంత్ చెబుతున్నట్టుగా తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వడం కాదని.., హామీలు అమలు చేయనందుకు ప్రజలే రాహుల్ని ఇక్కడ అడుగుపెట్టనివ్వరని వ్యాఖ్యానించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్లో మళ్లీ పోటీ చేస్తే రేవంత్ గెలిచే పరిస్థితి లేదని, అక్కడ ఆయన రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. ‘లోక్సభ ఎన్నికల్లో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్కు 23 వేల ఓట్లు తగ్గాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ రేవంత్ని ఓడించేది బీజేపీనే. ఉప ఎన్నిక వస్తే అక్కడ ఆయన బీజేపీ చేతిలో ఓడిపోవడం ఖాయం.సొంత సీటులోనే గెలిచే సత్తా లేని రేవంత్.., తెలంగాణ నుంచి బీజేపీని ఖతం చేస్తామనడం బుడ్డర్ ఖాన్ మాటలే’అని అన్నారు. ‘హామీలు అమలు చేయకుండా అహ్మదాబాద్లో గొప్పలు చెప్తావా? గ్యారంటీలపై చర్చకు సిద్ధమా? రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చేందుకు ముఖం లేదు. దమ్ముంటే హెచ్సీయూలో రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టగలరా?’అని మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. తన పదవికి కౌంట్ డౌన్ మొదలైందని భావిస్తున్న రేవంత్రెడ్డి, ఎలాగైనా దానిని కాపాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే మోదీ, బీజేపీలపై విమర్శలు సంధిస్తున్నారన్నారు. -
జగన్ అద్భుత నాయకుడు
సాక్షి, హైదరాబాద్: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన నాయకుడు.. జీవితంలో ఆయన అత్యంత కఠిన సమయాలను ఎదుర్కొన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు బాగుంటుంది. ఆయన పోరాట యోధుడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ 2.0ను చూస్తున్నాం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఓ పాడ్కాస్ట్ ఇంటర్వూ్యలో కవిత మాట్లాడుతూ, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి పాడ్కాస్ట్లో ప్రస్తావన రాగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు.‘పవన్ కళ్యాణ్ను నేను సీరియస్గా తీసుకోవడం లేదు. దురదృష్టవశాత్తూ ఆయన పొరుగు రాష్ట్రం ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఆయన గురించి అన్నీ ప్రశ్నించాలి్సన అంశాలే. చెగువేరాను ప్రేమించే వ్యక్తి ఏకంగా సనాతన వాదిగా ఎలా మారతాడు. ఆయన ఇచ్చే రాజకీయ ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రేపు తమిళనాడుకు వెళ్లి హిందీని రుద్దకూడదు అని కూడా అంటాడు. అందుకే పవన్ కళ్యాణ్కు సంబంధించిన ప్రశ్నలపై నేను నిజంగా స్పందించాలని అనుకోవడం లేదు. ఆయనను సీరియస్ రాజకీయ నాయకుడిగా పరిగణించడం లేదు’ అని కవిత వ్యాఖ్యానించారు. గతంలో ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కవిత గుర్తు చేశారు. ‘దళిత మహిళ కాబట్టే హోంశాఖ మంత్రి అనితను పక్కన పెట్టి తాను హోంమంత్రిత్వ శాఖ తీసుకుంటాను అన్నాడు. లోకేశ్ హోంమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసేవాడా’ అని కవిత ప్రశ్నించారు. -
యంగ్ ఇండియా నా బ్రాండ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘గతంలో ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని, అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఏ బ్రాండ్ సృష్టించుకోలేదని కొందరు అంటున్నారు. విమర్శకులకు నా సమాధానం ఇదే..నా బ్రాండ్ యంగ్ ఇండియా..మహాత్మాగాంధీ స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనేది మా బ్రాండ్. విద్య, వైద్యం, ఉపాధికే మా ప్రాధాన్యం..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ‘దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని నేను విశ్వసిస్తా. నిత్యం విధుల్లో ఉండే పోలీసులు వారి పిల్లల చదువుల విషయంలో ఆందోళనతో ఉండొద్దన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాం. సైనిక్ స్కూల్కు దీటుగా పోలీస్ స్కూల్ను తీర్చిదిద్దాలి. పోలీసు స్కూల్లో చదివామన్న ఒక బ్రాండ్ను క్రియేట్ చేసేలా తయారు చేయాలి. కావాల్సిన నిధులు, అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేజీ నుంచి పీజీ వరకు తీర్చిదిద్దుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కంపెనీలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కొన్ని నిధులను అందించాల్సిన బాధ్యత ఆ సంస్థలకు ఉంది. పోలీస్ స్కూల్ కోసం రూ.100 కోట్లతో కార్ఫస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని డీజీపీని ఆదేశిస్తున్నా. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని సీఎం చెప్పారు. రైతు బాంధవుడిగా వైఎస్సార్ ఎప్పటికీ గుర్తుంటారు.. ‘దేశ చరిత్రలో ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ అందులో కొద్దిమంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయి. జలయజ్ఞం, వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ఉచిత కరెంటు ఇవ్వడం, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం మొదలు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి గుర్తుకు వస్తారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతి పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఐటీని అభివృద్ధి చేశారు. సంస్కరణలతో భారతదేశాన్ని ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిలిపిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుది. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరింది. అయితే తెలంగాణ ప్రదాతలం, ఉద్యమకారులమని కొందరు బ్రాండ్లు క్లెయిమ్ చేసుకుంటుంటారు. వారి గురించి నేను చర్చించను..’ అని రేవంత్ పేర్కొన్నారు. మన విద్యా విధానం ప్రాథమిక స్థాయిలోనే లోపం ‘ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే, వాటిల్లో 18.50 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రైవేటులో 11,500 స్కూళ్లు ఉంటే వాటిల్లో 30 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ అర్హతలు ఉన్న వారు పని చేస్తున్నప్పటికీ విద్యార్థులు చేరడం లేదంటే మన విద్యా విధానంలో ఉన్న లోపాలు ఏమిటనే ఆలోచన చేశాం. ప్రాథమిక స్థాయిల్లోనే అస్పష్టత ఉందనే విషయం గమనించాం. నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వ బడుల్లోనూ ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ప్రీస్కూల్ విధానం ప్రవేశపెట్టాలని, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అందుబాటులోకి తేవాలనే ఆలోచన చేశాం. ప్రైవేటు స్కూళ్లల్లో పిల్లలకు ఎలాగైతే రవాణా సౌకర్యం ఉంటుందో అదే తరహాలో నిరుపేదల పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయాలు కల్పించి వారికి ఉత్తమమైన ప్లే స్కూల్ విద్యను అందించాలని నిర్ణయించాం..’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత ‘విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వర్సిటీలో చేరే ప్రతి విద్యారి్థకి ఉద్యోగ భద్రత లభిస్తుంది. ఈ యూనివర్సిటీతో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ మొదలు పెట్టాం. ఇవి కాకుండా 58 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చేపట్టాం..’ అని రేవంత్ వివరించారు. పోలీసులకు ఎంత చేసినా తక్కువే: మంత్రి శీధర్బాబు దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసుల పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ప్రజల ప్రశాంత జీవనం కోసం ఎన్నో త్యాగాలు చేసే పోలీసుల కోసం ఎంత చేసినా తక్కువే అని అన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. పోలీసుల పిల్లల పరిస్థితులు అర్థం చేసుకుని ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్రెడ్డికి పోలీస్శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..ఈ స్కూల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న అంశంపై దృష్టి పెట్టామని, తగ్గింపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు కిట్లు స్కూలు విద్యార్థులకు యూనిఫాం, ఇతర వస్తువులు ఉన్న కిట్లను సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు అందజేశారు. పోలీస్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ క్యాప్లను చేతపట్టుకుని ఊపుతూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. స్కూల్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన విశాల్ గోయల్, శరత్, ఎస్పీ రెడ్డిలను సీఎం జ్ఞాపికలతో సత్కరించారు. గోల్ కొట్టిన ముఖ్యమంత్రి పోలీస్ స్కూల్ను ప్రారంభించిన తర్వాత సీఎం పాఠశాలను పరిశీలించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారితో సరదాగా ఫుట్బాల్ ఆడారు. పది మంది చిన్నారులు తన నుంచి బాల్ను తీసుకునేందుకు పోటీ పడుతున్నా, వారిని తప్పించుకుని గోల్ కొట్టి అబ్బుర పరిచారు. సామాజిక బాధ్యత కింద విరాళాలు పోలీస్ స్కూల్కు సీఎస్ఆర్ కింద ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి రూ.30 లక్షలు, ఎసీ రెడ్డి రూ.కోటి, జీజీఎస్ ఇంజనీరింగ్కు చెందిన ప్రవీణ్రెడ్డి రూ. 50 లక్షలు, తేజస్వి డెవలపర్స్కు చెందిన నిరంజన్ రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కాలే యాదయ్య, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి, సీఐడీ డీజీ శిఖాగోయల్, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీస్, జైళ్ల శాఖల అధికారులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. చిన్నారులతో సందడి చేసిన సీఎం మణికొండ: గండిపేట మండలం, మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిన్నారులతో కలిసి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడి వారిని ఉత్తేజ పరిచారు. పది మంది చిన్నారులు సీఎం నుంచి బాల్ను తీసుకునేందుకు పోటీ పడుతున్నా వారిని ఏ మార్చి గోల్ కొట్టి వారిని అబ్బుర పరిచారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ఇంకా ఏర్పాటు చేయాల్సిన వాటి గురించి చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. వారి కోరికలు విని పాఠశాలను వారి ఆశలకు అనుగుణంగా తీర్చి దిద్దాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు. -
రేవంత్.. నోరు అదుపులో పెట్టుకో
హైదరాబాద్,సాక్షి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు.గుజరాత్లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన అఖిల భారత కాంగ్రెస కమిటీ సదస్సు ‘న్యాయ్పథ్’లో.. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకమైన వారని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, గాంధీ ఆలోచనలను రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళుతుంటే ప్రధాని మోదీ గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడారు. రేవంత్ మతి స్థిమితం లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. రాహుల్ మెప్పు కోసం మాట్లాడారు. రేవంత్ తెలంగాణను రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టారు. రాజ్యాంగేతర శక్తి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియేట్లో అడుగు పెట్టారు. సీఎం లేనప్పుడు అజ్ఞాత వ్యక్తి సెక్రటరియేట్లో రివ్యూ చరిత్రలో లేదు.రేవంత్ నీ స్థాయిని మించి మోదీపై మాట్లాడటం మానుకో. ప్రధాని పదవి కోసం నెహ్రూ దేశాన్ని ముక్కలు చేశారు. దేశ విభజనకు కారణం కాంగ్రెస్. రేవంత్ చరిత్ర మర్చిపోయిన దేశ ప్రజలు మర్చిపోలేదు. హామీలు అమలు చేయకుండా అహ్మదాబాద్లో గొప్పలు చెప్తావా?గ్యారంటీలపై చర్చకు సిద్దమా? రాహుల్ గాంధీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. హామీలు అమలు చేయనందుకు ఆయన్ను రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వరు. దమ్ముంటే హెచ్సీయూలో రాహుల్ గాంధీ మీటింగ్ పెడతారా? త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ రాబోతుంది. రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చననే నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?’ అని ప్రశ్నించారు. -
జింకల మృతికి కారణమైన వారిపై చర్యలేవీ?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నియమ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అన్ని ఆధారాలతో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులతో సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిశామన్నారు. రైతు ఒక్క చెట్టు కొడితే కేసు నమోదు చేస్తున్నారు.. రైతుకు ఒక చట్టం.. రేవంత్ రెడ్డికి ఒక చట్టమా?’’ అంటూ హరీష్రావు ప్రశ్నించారు.‘‘కంచె చేను మేసినట్టిగా ప్రభుత్వం వేలాది చెట్లు నరికివేసింది. వైల్డ్ లైఫ్ యాక్ట్, వాల్టా యాక్ట్ ఉల్లంఘించి ప్రభుత్వం వ్యవహరించింది. మూడు జింకలు చనిపోయాయి. వన్య ప్రాణుల గూడును చెదరగొట్టారు. జింకల మృతికి కారణమైన అధికారులపైన చర్యలేవీ? పర్యావరణ విధ్వoసం జరిగితే అటవీ అధికారులు నిద్ర పోతున్నారా?. ప్రైవేట్ భూమి అయినా అందులో చెట్లు పెరిగితే అందులో వన్య ప్రాణులు గూడు ఏర్పాటుచేసుకుంటే అది అటవీ భూమిగా పరిగణిస్తారు. 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉంటే.. అందులో చెట్లు ఉంటే అది అటవీ భూమిగానే పరిగణిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కంచ గచ్చిబౌలిలో చెట్లు నాటారు’’ అని హరీష్రావు గుర్తు చేశారు.హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సెలవు దినాలు చూసుకుని మరి జేసీబీలతో చెట్లు నరికివేశారు. కంచ గచ్చి బౌలి భూములు హెచ్సీయూ అధీనంలో ఉందని గతంలోనే ఆర్డీవో, కలెక్టర్ కలెక్టర్ లేఖ రాశారు. సీఎం రేవంత్ ఈ భూమిని మాడ్యూగేట్ చేసి 10 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పు ఇప్పించిన బ్రోకర్కు 169 కోట్ల 83 లక్షలు చెల్లించారు. ఈ భూములను అమ్మి సీఎం రేవంత్ 40 వేల కోట్లు తేవాలని సీఎం రేవంత్ ప్రయత్నం’’ అంటూ హరీష్రావు ఆరోపించారు.సుప్రీoకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతుంది. నిన్న సాయంత్రం టీజీఐఐసీ భూమి అని బోర్టులు ఏర్పాటు చేశారు. కంచ భూముల విధ్వంసంలో పోలీస్ శాఖ పాత్ర కూడా ఉంది. గతంలో కొత్త సచివాలయం నిర్మించే సమయంలో చెట్లు నరకొద్దంటూ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లిన రేవంత్కు ఇన్ని చెట్లు నరకొద్దూ అని తెలియదా?. యూనివర్సిటీ భూములు తమకే చెందాలని విద్యార్థులు అడిగితే వారిపై కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వం శాశ్వతo కాదు’’ అని హరీష్రావు వ్యాఖ్యానించారు. -
యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైందని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని తెలిపారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్ అని అన్నారు. సైనిక్ స్కూల్కు ధీటుగా పోలీస్ స్కూల్ను తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆయన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. పోలీసు శాఖపై మాకు స్పష్టమైన ఆలోచన ఉంది. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవే. 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్. దేశానికే దార్శనికుడు పీవీ నరసింహారావు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. యంగ్ఇండియా పోలీస్ స్కూల్కు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ను సమకూర్చుకోవాలి. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం అంటే వైఎస్సార్ గుర్తుకువస్తారు. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్. ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నాం. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచాం. పోలీసు స్కూల్ విషయంలో రాజకీయం లేదు.వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి.. ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకరమైన వారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యా నించారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టినట్లే రాహుల్గాంధీ నాయకత్వంలో మనమంతా దేశంలో బీజేపీని ఓడించి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్గాంధీ నేతృత్వంలో ముందుకు తీసుకుని వెళ్తుంటే.. ప్రధానమంత్రి మోదీ మాత్రం దేశ వ్యాప్తంగా గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అహ్మదాబాద్లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సదస్సు ‘న్యాయ్పథ్’లో బుధవారం సీఎం ప్రసంగించారు.వల్లభాయ్ పటేల్తో హృదయపూర్వక బంధం‘గుజరాత్ ప్రజలతో, వల్లభాయ్ పటేల్ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంది. దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదు. అప్పుడు మాకు స్వాతంత్య్రం ప్రసాదించిన వల్లభాయ్ పటేల్తో మాకు హృదయపూర్వక బంధం ఉంది. వల్లభాయ్ పటేల్ మాకు స్వాతంత్య్రం ఇస్తే.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి నేను ఒకటే చెబుతున్నా. మేము బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం..అడ్డుకుంటాం. వారిని ఎవరూ క్షమించరు’ అని రేవంత్ అన్నారు.మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే..‘రాహుల్గాంధీ తెలంగాణలోని రైతులకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 10 నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసి చూపించింది. మరో హామీ అయిన కులగణనను కూడా పూర్తి చేశాం. కేంద్రం జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్పై లోక్సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా రాహుల్గాంధీని మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని గాలికి వదిలేశారు. రెండు కోట్ల మందికి రాకపోయినా మోదీ, అమిత్షాలకు మాత్రం పదవులు వచ్చాయి. రైతులు కనీస మద్దతు ధర, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 15 నెలలపాటు ఆందోళన చేసినా మోదీ ప్రభుత్వం కనీసం వారితో చర్చలు కూడా జరపలేదు. మోదీ మణిపూర్లో మంటలు రాజేశారు. దేశ మూల వాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం చేశారు. మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే. కానీ రాహుల్గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరిట 150 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.బీజేపీ ఓటమికి కంకణబద్ధులై వెళ్లాలిదేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ ఎన్నో ఆందోళనలు చేసినా.. ఆయనపై ఏనాడూ లాఠీ ఎత్తలేదు. కానీ స్వాతంత్య్రం వచ్చిన ఆరునెలల్లోనే గాడ్సేలు తూటాలు పేల్చి ఆయన్ను పొట్టన పెట్టుకున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు, మోదీ ఆలోచన విధానాన్ని అడ్డుకునేందుకే మనమంతా ఇక్కడ ఏకమయ్యాం. ఇక్కడకు వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్త రానున్న ఎన్నికల్లో బీజేపీని ప్రతిచోటా ఓడించేలా కంకణబద్ధులై వెళ్లాలి. గాడ్సే భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీని, బీజేపీని అడ్డుకుని దేశాన్ని రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. -
అహ్మదాబాద్ వేదికగా.. ప్రధానిపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
అహ్మదాబాద్ (గుజరాత్): మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చుపెడుతున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.వచ్చే రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. దేశంలో కుల గణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. బ్రిటీష్ వాళ్లు ఎలా దేశాన్ని లూటీ చేశారో.. బీజేపీ నేతలు కూడా అలానే లూటీ చేస్తున్నారు. బిట్రీష్ వాళ్ల కంటే బీజేపీ వాళ్లే ప్రమాదకరం. బ్రిటీష్ వాళ్లను తరమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడగొట్టాలి. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. -
‘కేసీఆర్ది సాగు భాష..రేవంత్ది చావు భాష’
హైదరాబాద్,సాక్షి: దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవుణ్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ(BRS Silver jubilee) సభను విజయంతం చేయాలని సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోంది. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది. ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. జీవో 58,59ను కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టింది. రైతు రుణమాఫీ, 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి.13 లక్షల పేదల పిల్లలకు కళ్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత కేసీఆర్ది. రేవంత్ మాయ మాటలతో మోసం చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ పడగొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్,ఇతర ఆదాయాలు తగ్గిపోయాయి.కేసీఆర్ చెట్టు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరికాడు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 4వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, అడవిలోని మూగజీవులను చంపిన శాపం రేవంత్దే. కేసీఆర్ది సాగు భాష..రేవంత్ రెడ్డిది చావు భాష.ఢిల్లిలో ధర్నా,సమావేశం పెడితే రేవంత్ రెడ్డి పిలిస్తే రాహుల్ గాందీ రాలేదు.రేవంత్ పాలన ఆగమాగం అయ్యింది.. మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదు.దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవున్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కునారిల్లిపోయింది. అన్ని వర్గాలు దివాళా తీశారు.మెట్రో రైలు, ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదు.కాంగ్రెస్ పాలనలో తాగునీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి.ఏడాది తిరగకుండానే లక్షా50 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది. పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారింది.. ధాన్యాగారంగా మారింది. ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ను కోరుకుంటున్నారు. వరంగల్ జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి’ అని పిలుపు నిచ్చారు. -
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎంపీలు నేడు సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు భేటీ అవుతున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నివాసంలో వీరంతా సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా హెచ్సీయూ భూముల వివాదంపై ఎంపీలు చర్చించనున్నారు.అంతకుముందు బీజేపీ, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల, మూసీ పునరుజ్జీవనం, హెచ్సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ను కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు. -
‘నిరూపిస్తే.. మీ ఇంట్లో గులాంగిరీగా పనిచేస్తా.. లేకపోతే...’
హనుమకొండ జిల్లా: కావాలనే తన క్యారెక్టర్ దెబ్బతీయడానికి ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే కలిసి అభూత కల్పనలు స్పష్టిస్తున్నారని విమర్శించారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను అవినీతికి, కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఆ ఇద్దరికీ చీము నెత్తురు ఉంటే తన సవాల్ ను స్వీకరించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.దేవునూర్ గుట్టల వ్యవహారంపై హన్మకొండ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరి మీడియా సమావేశం మాట్లాడుతూ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై విరుచుకుపడ్డారు. ‘ నేను, నా కుటుంబ ఆక్రమిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీఆ భూములను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే కబ్జా అనడం సిగ్గుచేటని కడియం ఆరోపించారుఆధారాలు ఉంటే ప్రజలు ముందు పెట్టాలని తప్పు ప్రచారం చేసే పత్రికలకు, చానెల్స్ కు, వ్యక్తులకు ఆధారాలు ఉంటే బయట పెట్టలని డిమాండ్ చేసారు. నిజమని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి జీనామా చేస్తా. లేదంటే న్యాయపరంగా వెళ్లాడనికి వెనకడను అని హేచ్చరించారు. 30 ఏళ్ల రాజకీయాలలో ఒక గంట కబ్జా చెయ్యలేదని, ఆధారాలు నిరూపిస్తే పల్లా, తాటికొండ రాజయ్యల ఇంట్లో గులాంగీరీగా పనిచేస్తా అని కడియం అన్నారు. ఆధారాలు నిరూపించకపోతే నా ఇంట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య గులాంగిరి చెయ్యాలని డిమాండ్ చేశారు -
‘రేవంత్, కేటీఆర్ జాన్ జబ్బలు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై మరోసారి మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్.‘ రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు. ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నదే రేవంతే. చెన్నై డీలిమిటేషన్ మీటింగ్ కు ఇద్దరూ కలిసే వెళ్లారు. హైదరాబాద్లో త్వరలో జరగబోయే మీటింగ్ను ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నరు. ఆ ఇద్దరూ కలిసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో ఓటేయించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసే మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్దమయ్యారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ ను కాపాడేందుకే కేటీఆర్ బీఆర్ఎస్ ను బరిలో దించలేదు. తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ బుద్ది మారలేదుఇద్దరూ ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నరు. హెచ్ సీయూ భూములపై దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధమా?, రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రంలో ఉన్నది కేసీఆర్, రేవంత్ సర్కార్ కాదు. భూదందా, అవినీతిపరులపై ఉక్కుపాదం మోపే మోదీ సర్కార్ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు సిద్దమైతే హెచ్సీయూ భూ కుట్రదారుల భాగోతాన్ని బట్టబయలు చేస్తాం’ అని ధ్వజమెత్తారు బండి సంజయ్. -
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్,సాక్షి: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు.వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebrations) కోసం బీఆర్ఎస్ (brs) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.ఈ తరుణంలో కేటీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ,హెచ్సీయూ భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండవ తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. అందుకే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది. ఈ సారి డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెడుతున్నాం. అన్ని జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నెలకో కార్యక్రమం జిల్లాల్లో నిర్వహిస్తాం.అమెరికా దుందుడుకు నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు నష్టపోయారు. మోదీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా మౌనం ఎందుకు?. తర్వాత దెబ్బ తెలంగాణపై పడబోతుంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు ఉంటాయి. వాటిపై ఎఫెక్ట్ ఉండబోతుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు BRS పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల,మూసీ పునరుజ్జీవనం, హెచ్సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు. -
‘నేను ప్రజలకు కాపలా కుక్కను.. నీలాగా గుంట నక్కను కాదు’
జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య వాగ్వాదం రోజురోజుకూ ీవ్రతరమవుతోంది. ఈ నేతలు ఇద్దరు కౌంటర్ల మీద కౌంటర్ల ఇచ్చకోవడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. తాజాగా కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనను బొచ్చు కుక్క అన్న వ్యాఖ్యలను తనదైన శైలిలో తిప్పికొట్టారు పల్లా.తాను కుక్కనేనని, కాకపోతే ప్రజలకు విశ్వాసంగా పని చేసే కాపలా కుక్కనన్నారు. అదే సమయంలో కడియం శ్రీహరిని గుంట నక్కతో పోల్చారు. నీలాగా గుంట నక్కను కాదంటూ మండిపడ్డారు. ‘ఘన్పూర్కు మున్సిపాలిటీ వస్తే ఆపేసారు, డిగ్రీ కాలేజీ ఆపేసారు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసారు, 100 పడకల ఆస్పత్రిని ఆపేశారు. నవాబ్పేటకు లైనింగ్ వస్తే దాన్ని కూడా ఆపేశారు. ఆపేసే చరిత్ర వాళ్లది.. పనులు చేయడమనే చరిత్ర మనది’ అంటూ మండిపడ్డారు.ఇటీవల తనను ‘బొచ్చు కుక్క’ అనేలా మాట్లాడిన కడియంను పల్లా గట్టిగానే తిప్పికొట్టారు. “అవును నేను కుక్కనే..నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటాను. నీలాగా గుంట నక్కను మాత్రం కాదు,” అని పల్లా స్పష్టంగా చెప్పారు. ‘అటవీ భూములపై జరుగుతున్న ఆక్రమణల గురించి కూడా స్పందించారు.ముసలితనానికి అటవీ భూముల మీద కన్నేస్తున్నారు. ఒకరిపై 25 ఎకరాలు, మరొకరిపై మరో 25 ఎకరాలు ఆ భూములను కాపాడటానికి నేను రేసు కుక్కలా ఉంటా’ అని తెలిపారు.కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉన్న కుక్కను. ప్రజలను కాపాడటంలో ఎప్పుడూ ముందుండే లక్షణాలు నాకు ఉన్నాయి. నిన్ను ఎదుర్కొనే గుణాలు కూడా నా వద్ద ఉన్నాయి’ అని కూడా హెచ్చరించారు. -
‘తెలంగాణకు ఏం ఎలగబెట్టారని ఒక్క చాన్స్’
హైదరాబాద్: కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మరోసారి మండిపడ్డారు. అసలు తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఒక్క చాన్స్ అడుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏమి తెచ్చారో కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.‘11 ఏండ్లు తెలంగాణ కు ఏమి తెచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి.. చర్చకు సిద్ధమా.. మోదీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పని చేస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కరిగిపోతే ఎందుకు పట్టలేదు. 10 వేల ఎకరాల భూములను కేసీఆర్, కేటీఆర్ లు అమ్ముకుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తుండు. ఇప్పడు కిషన్ రెడ్డి ఒక్క చాన్స్ కావాలని ప్రాధేయపడుతున్నాడు. తెలంగాణకు ఏమి ఎలగబెట్టారని ఒక్క చాన్స్ అడుగుతున్నారు. మూడుసార్లు మోదీని ప్రధానిని చేస్తే రాష్ట్రానికి ఏమీ ఎలగబెట్టారు. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే ఏం చేశా. మీకు ప్రజలు చాన్స్ ఇవ్వరు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం కల. విభజన హామీలు కిషన్ రెడ్డికి,బండి సంజయ్ కి పట్టదు. వారిద్దరూ పగటి కలలు కంటున్నారు’ అని విమర్శించారు. -
తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Sukhender Reddy) ప్రమాణ స్వీకారం చేయించారు.ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ఎమ్మెల్సీలతో మండలి గుత్తా సుఖేందర్రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy), ఎంపీలు రఘునందన్రావు, లక్ష్మణ్ హాజరయ్యారు.అలాగే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలగా (MLA quota MLCs) కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవం ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలతో కూడా గుత్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే సమయంలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ (P.R.T.U) అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి (Sripal Reddy) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.