'కేసీఆర్‌కు రైతులంటే గౌరవం లేదు' | uttam kumar reddy slams kcr over farmers problems | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌కు రైతులంటే గౌరవం లేదు'

Apr 10 2017 12:11 PM | Updated on Sep 19 2019 8:44 PM

మిర్చీ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమండ్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరు మార్కెట్‌ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.

వరంగల్‌ అర్బన్‌: మిర్చీ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమండ్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరు మార్కెట్‌ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం‍లో టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేతలు శ్రీధర్‌బాబు, గండ్రతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులంటే గౌరవం లేదు.. రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయ ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయాయి.
 
గిట్టుబాటు ధరలు, కొనుగోళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్‌ ఏమి పట్టనట్లు కూర్చున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. క్వింటాకు రూ.12 వేలు ఇచ్చి మిర్చీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని’’ డిమాండ్‌ చేశారు. అంతకు ముందు మార్కెట్‌లో కలియ తిరిగిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement