విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి | man died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి

Sep 28 2016 11:57 AM | Updated on Sep 4 2017 3:24 PM

ఇంట్లో కరెంట్ వైర్లు సరిచేస్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందగా.. అతన్ని రక్షించడానికి యత్నించిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

చిన్నశంకరంపేట: ఇంట్లో కరెంట్ వైర్లు సరిచేస్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందగా.. అతన్ని రక్షించడానికి యత్నించిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శేరిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిరుమలయ్య(45) ఇంట్లో విద్యుత్ తీగలు సరి చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురయ్యాడు. అతన్ని రక్షించడానికి వచ్చిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement